భారతదేశంలో కూడా కరోనా విజృంభిస్తుంది.మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ బులిటెన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం గురువారం నాటికి మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 6,412కి చేరుకుంది.దేశంలో మొత్తం 5,709 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి.ఇందులో 504మంది కరోనా నుండి కోలుకోని డిశ్జార్జ్ అయ్యారు.
కరోనా వలన ఇప్పటివరకు 199మంది మరణించారు .ఇరవై నాలుగంటల్లో ముప్పై మంది ఈ మహమ్మారి భారీన పడి మృత్యు వాతపడ్డారని తెలిపింది.అయితే దేశంలో మహరాష్ట్రలో అత్యధికంగా 1135కేసులు నమోదయ్యాయి.
తర్వాత రెండో స్థానంలో ఉన్న తమిళనాడు రాష్ట్రంలో 738కేసులు నమోదు కాగ మూడో స్థానంలో ఉన్న ఢిల్లీలో 699కేసులు,నాలుగో స్థానంలో ఉన్న తెలంగాణలో 471కేసులు,ఐదో స్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్ లో 410కేసులు నమోదయ్యాయి.