స్థానిక పరిస్థితుల దృష్యా లాక్డౌన్ను మే 7 వరకు పొడిగించామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
కేంద్ర పశుసంవర్థక శాఖ మంత్రి గిరిరాజ్సింగ్ ఆయనకు ఫోన్ చేసి తెలంగాణలో లాక్డౌన్ పరిస్థితులను గురించి తెలుసుకున్నారు. స్థానిక పరిస్థితుల వల్లే లాక్డౌన్ పొడిగించామని తలసాని ఆయనకు వివరించారు. ఎలాంటి మినహాయింపులు ఇవ్వకూడదని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని చెప్పారు.
ఇప్పటికే పాడి, మత్స్య, పౌల్ట్రీ, మాంస పరిశ్రమ, రైతులకు మినహాయింపులు ఇచ్చామని కేంద్ర మంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని గిరిరాజ్ సింగ్ ప్రశంసించారు. సీఎం కేసీఆర్కు అభినందనలు తెలిపారు.