తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్కరోజే 352 కేసులు వెలుగుచూశాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 302 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,027కి చేరింది. ఇవాళ మరో ముగ్గురు ఈ మహమ్మారి కారణంగా మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 195కి పెరిగింది.
ఇవాళ 230 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 3,301కి మంది డిశ్చార్జి కాగా.. 2,531 యాక్టివ్ కేసులు ఉన్నాయి.