తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు మంగళవారం రాష్ట్ర పరిశ్రమల వార్షిక నివేదికను విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ”ఐదేళ్ల రాష్ట్రానికి రూ.2లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు.మొత్తం 12వేల పరిశ్రమలు ఏర్పాటయ్యాయి.
వీటితో 14లక్షల మందికి ఉపాధి లభించిందని వ్యాఖ్యానించారు.లైఫ్ సెన్సైస్,ఫార్మా రంగాలకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అడ్డగా మారింది.లెదర్ పార్కుల ద్వారా ఆదాయం రెట్టింపైంది.చేనేతకు చేయూతనివ్వడంతో అంతరించిపోయిన డిజైన్లకు ప్రాణం పోశామని మంత్రి కేటీఆర్ తెలిపారు..