ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య రాకెట్ వేగం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి.ఇరు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య దాదాపు పదివేలకు చేరుకుంది.
ఏపీలో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,834కి చేరుకుంది.మరోవైపు తెలంగాణలో 9,553కి చేరింది.ఒకపక్క ఏపీలో 119మంది కరోనా వైరస్ వలన మృతి చెందారు.ఇక తెలంగాణలో 220మంది మృత్యువాత పడ్డారు.
అయితే గడిచిన వారం రోజుల నుండి కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి.బుధవారం నమోదయ్యే కరోనా పాజిటీవ్ కేసులతో ఇరు రాష్ట్రాల్లో పది వేల మార్కును దాటనున్నాయి.