తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం 6వ విడత కార్యక్రమాన్ని హాసన్ పర్తి మండలం అనంతసాగర్ గ్రామంలో ఎంపీ పసునూరి దయాకర్ గారితో కలిసి ముక్కలు నాటి ప్రారంభించారు…ఈ సంధర్బంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు మాట్లాడుతూ….ఆకుపచ్చ తెలంగాణ నిర్మాణం కావాలంటే ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని, సీఎం కేసీఆర్ గారు హరిత తెలంగాణ… ఆరోగ్యవంతమైన తెలంగాణను నిర్మించాలనే గొప్ప సంకల్పంతో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గారు తెలిపారు.
రాష్ట్రంలో అడవులను పరిరక్షించి వర్షాలు సమృద్దిగా కురవాలని తద్వారా రైతులు సుభిక్షంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే గారు పేర్కోన్నారు. కనుక ప్రతీ ఒక్కరు విద్యార్థుల నుండి వృద్దుల వరకు అందరూ మొక్కలు నాటడం తమ విధిగా భావించాలని ఎమ్మెల్యే గారు పిలుపునిచ్చారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరంక్షించడం కూడా బాధ్యతగా తీసుకోని భావి తరాలకు ఆహ్లదకరమైన వాతావరణాన్ని అందించిల్సిన అవసరం ఎంతైన ఉందని ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు అభిప్రాయపడ్డారు. ఆకుపచ్చ తెలంగాణ నిర్మాణంలో వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు ప్రథమ కర్తవ్యంగా భావించి హరితహారం కార్యక్రమంలో పాల్గోనాలని అన్నారు.
మొక్కల సంరక్షణ విషయంలో అధికారులు గాని, ప్రజా ప్రతినిధులు గాని నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం వైకుంఠధామ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పిటీసి, వైస్ ఎంపీపీ, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, మండల రైతు బంధు కో ఆర్డినేటర్, మండల పార్టీ అధ్యక్షుడు, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు.