దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ రైల్వే శాఖ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది.
టైం టేబుల్ ఆధారిత అన్ని రెగ్యులర్ ప్రయాణికుల రైలు సర్వీసులను (మెయిల్/ ఎక్స్ప్రెస్, ప్యాసింజర్, సబర్బన్ రైళ్లు) ఆగస్టు 12 వరకు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
దీంతో జులై 1 నుంచి ఆగస్టు 12 మధ్య చేసుకున్న అన్ని టిక్కెట్లు రద్దవుతాయని రైల్వే బోర్డు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది.