టిక్టాక్ విషయంలో అమెరికాలో నెలకొన్న సస్పెన్స్కు తెరపడినట్టే కనిపిస్తోంది! టిక్టాక్ను కొనుగోలుకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ ఆదివారం నాడు ప్రకటించింది. సెప్టెంబర్ 15 కల్లా ఇందుకు సంబంధించిన చర్చలన్నీ పూర్తి చేస్తామని తెలిపింది.
టిక్టాక్ కొనుగోలు చేసే అంశంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేశారన్న వార్తల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా.. ఈ డీల్ విషయమై మైక్రోసాఫ్ట్ ఆదివారం నాడు ఓ బ్లాగ్ పోస్ట్లో సవవిరమైన ప్రకటన విడుదల చేసింది.
‘అధ్యక్షుడి అభ్యంతరాలను మైక్రోసాఫ్ట్ అర్థం చేసుకుంది. సమాచార భద్రతకు లోబడి, అమెరికాకు ఆర్థిక లాభం చేకూర్చే విధంగా.. టిక్టాక్ను కార్యకలాపాలను స్వాధీనం చేసుకునేందుకు మైక్రోసాఫ్ట్ పూర్తిగా కట్టుబడి ఉంది.
టిక్టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్తో సెప్టెంబర్ 15ను నాటికల్లా చర్చలు పూర్తవుతాయి. ఈ మధ్యకాలంలో అమెరికా ప్రభుత్వంతో మైక్రోసాఫ్ట్ నిరంతరం సంప్రదింపులు జరుపుతుంది’ అని సదరు సంస్థ బ్లాగ్పోస్ట్లో ఓ ప్రకటన విడుదల చేసింది.