Home / NATIONAL / తన భార్య మైనపు విగ్రహాంతో గృహాప్రవేశం

తన భార్య మైనపు విగ్రహాంతో గృహాప్రవేశం

కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ గుప్తా తన భార్య మైనపు విగ్రహాన్ని తయారు చేయించి గృహప్రవేశం చేశారు. కొన్నేళ్ల క్రితం ఆయన సతీమణి రోడ్ యాక్సిడెంట్ లో మరణించారు.

నచ్చేశారు గుప్తా గారు… భార్య బతికి వుండగానే ప్రత్యక్ష నరకం చూపించే మగానుభావులు, పొద్దున లేస్తే అర్థాంగి మీద కుళ్లు జోకులు వేస్తూ పలుచన చేసే భర్త గార్లు ఉన్న ఈ లోకంలో మీరు సమ్ థింగ్ స్పెషల్.

గుండెల్లో గుడి కట్టుకోవడమే కాదు. ఏకంగా జీవకళ ఉట్టి పడుతున్న ఆమె మైనపు విగ్రహాన్నే తయారు చేయించి ఇంట్లో పెట్టుకున్నారీ పెద్దాయన. రాజసూయ యాగానికి ఆనాడు శ్రీరాముడు స్వర్ణ సీతమ్మను తయారు చేయిస్తే… నేటి ఈ శ్రీనివాసుడు గృహ ప్రవేశానికి ఏకంగా మైనపు సతీమణినే చేయించాడు.

చెప్తే గానీ తెలిసేలా లేదు ఆమె కాదు అది విగ్రహమని. ఆ నవ్వు, చీర, నగలు ఎంత సహజంగా ఉన్నాయో. ఈ అద్భుతాన్ని సృష్టించిన కళాకారులూ అభినందనీయులే..!!!

వాస్తవానికి చచ్చాక గుళ్ళు, విగ్రహాలు పెట్టమని మా ఆడవాళ్లు కోరుకోరు. బతికి ఉన్నప్పుడు సాటి మనిషిగా ప్రేమ, గౌరవాన్ని కోరుకుంటారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat