నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆర్గుల్ గ్రామంలో నిర్మితమవుతున్న మిషన్ భగీరథ పంప్ హౌజ్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఫిల్టర్ బెడ్ పనులను నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పరిశీలించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఆర్గుల్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ప్రజలకు త్వరలోనే ఇంటింటికి సురక్షిత తాగునీరు సరఫరా చేస్తామని చెప్పారు. మిషన్ భగీరథ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆశయం …
Read More »హైదరాబాద్ లో కాల్పులు కలకలం
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలో కాల్పులు ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపాయి. మైలార్దేవ్పల్లిలోని ఓ ఫామ్హౌస్లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.పోలీసులు రంగంలోకి దిగారు. అతన్నివెంటనే ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. భూవివాదమే ఈ కాల్పులకు కారణమని తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read More »హైదరాబాద్ మెట్రో రైలు గురించి మీకు తెలియని విషయాలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెట్రో రైలు ఈ నెల 28న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు ప్రారంభం కానుంది.ఇప్పటికే చాలా చోట్ల మెట్రో లైన్లు, స్టేషన్లు నిర్మితమయ్యాయి. ఏక స్తంభాలపై స్టేషన్లను నిర్మించి ఇంజనీరింగ్ అద్భుతాన్ని ఆవిష్కరించింది ఎల్ అండ్ టీ సంస్థ. ఇదిలా ఉంటే దేశంలో ఏ మెట్రో రైల్ వ్యవస్థకూ లేని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హైదరాబాద్ …
Read More »ఐటీ హబ్గా కరీంనగర్..!
ఇప్పటి వరకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు మాత్రమే పరిమితమైన ఐటీరంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించేందుకు దిశగా రాష్ట్ర సర్కారు ముందుకు కదులుతున్నది. ఎక్కడి విద్యార్థులకు అక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంలో భాగంగా ఐటీ పరిశ్రమలను జిల్లాలకు విస్తరిస్తున్నది. ఈ నేపథ్యంలో కరీంనగర్ లో రూ.25 కోట్లతో జీ+5 అంతస్తులతో భవనాన్ని నిర్మించేందుకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిజైన్లు సిద్ధం చేయగా, సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి …
Read More »దేశినేని మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
ఇందుర్తి మాజీ ఎమ్మెల్యే,సీనియర్ కమ్యూనిస్టు నేత దేశినేని చిన్న మల్లయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు.గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న చిన్న మల్లయ్య శనివారం ఉదయం కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమంలో తొలినాళ్ల నుంచి చిన్న మల్లయ్య క్రియాశీలక పాత్ర పోషించారని సీఎం పేర్కొన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సీఎం. దేశినేని కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read More »బైక్పై వెళ్లి ఆకస్మికంగా పరిశీలించిన మంత్రి తుమ్మల
రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ఉదయం మోటార్ సైకిల్ పై వెళ్లి అభివృద్ధి పనులను ఆకస్మికంగా పరిశీలించారు. ఖమ్మం నగరంలోని రహదారులు, వంతెనల నిర్మాణం, పారిశుధ్యం పనులను మంత్రి పరిశీలించారు. లకారం ట్యాంక్ బండ్ నుంచి ధంసలాపురం వరకు బైక్ను నడుపుకుంటూ వెళ్లి పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ చొరవతో ఖమ్మం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నదని అన్నారు.రైతు …
Read More »జీఎస్టీలో తెలంగాణ గళం వినిపించి మాట నెగ్గించిన మంత్రి ఈటల
జీఎస్టీపై భయాలు క్రమంగా తొలిగిపోతున్నాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. అసోంలోని గువాహటిలో శుక్రవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 23వ సమావేశానికి హాజరైన ఈటల.. సమావేశ నిర్ణయాలు వినియోగదారులకు ఊరటనిచ్చేవిగా ఉన్నాయని చెప్పారు. పలు రకాల వస్తువులు, సేవలపై పన్నులను తగ్గించాలని తెలంగాణతోపాటు పలు రాష్ట్రాలు కేంద్రంపై తెచ్చిన వత్తిడి ఫలించిందన్నారు. ఈ క్రమంలోనే గ్రానైట్పై పన్నుభారం తగ్గిందని చెప్పారు. ప్రతి ఒక్కరు పన్నులను చెల్లించేలా ఆచరణాత్మక …
Read More »ప్రధాని చేతులమీదుగా..28నే మెట్రో ప్రారంభం..కేంద్రం నుంచి సమాచారం
హైదరాబాద్ మెట్రోరైలు పరుగులు పెట్టేందుకు సిద్దమైంది.ఈ నెల 28వ తేదీనే ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన సంకేతాలు కేంద్ర ప్రభుత్వం నుంచి అందాయి. ఈ విషయాన్ని హైదరాబాద్ మెట్రోరైలుకు చెందిన ముఖ్య అధికారి ఒకరు వెల్లడించారు. ప్రారంభోత్సవానికి సిద్ధమైన నేపథ్యంలో నాగోల్ నుంచి మియాపూర్ వరకు పనులను యుద్ధప్రాతిపాదికన చేపట్టి,రాత్రింబవళ్లు పనిచేసి పూర్తిచేసినట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతులమీదుగా ప్రాజెక్టు …
Read More »వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు 60 నుంచి 70 సీట్లు..
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 50 సీట్లు వస్తాయని, కొంచెం బాగా కష్టపడితే 60 నుంచి 70 సీట్ల వచ్చే చాన్స్ ఉందని నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు . ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ … తమ పార్టీలో పాదయాత్రలకు అనుమతి ఇవ్వరని.. గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి చేస్తానంటే గులాంనబి ఆజాద్ ఒప్పుకోలేదన్నారు. తాను, భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేస్తానన్నా …
Read More »ఐదోరోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఐదోరోజు షెడ్యూల్ విడుదల అయింది. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు ఆయన ప్రొద్దుటూరు బైపాస్ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. పాదయాత్ర షెడ్యూల్ వివరాలు… ఉదయం 11 గంటలకు పొట్లదుర్తి మధ్యాహ్నం 1.30 గంటలకు-ప్రొద్దుటూరు శివారు అయ్యప్పగుడి దగ్గర భోజన విరామం మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభం …
Read More »