ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు అనుకులంగా వార్తలు వండివారిచ్చే రెండు ప్రధాన పత్రికలు క్రమంగా తమ పాఠకులను కోల్పోతున్నాయా..సాక్షి పత్రికకు ఆదరణ పెరుగుతుందా..తాజాగా వెల్లడైన పత్రికల రీడర్షిప్లో వెల్లడైన విషయాలను చూస్తే నిజమే అనిపిస్తోంది. గత మూడు దశాబ్దాలుగా చంద్రబాబుకు కమ్మగా వంతపాడుతూ…టీడీపీకి పచ్చపాతంగా వార్తలు రాస్తూ, ప్రత్యర్థులపై విషం చిమ్మే రెండు ప్రధాన పత్రికలకు కాలం చెల్లే సమయం దగ్గరలోనే ఉంది. ఒక పత్రిక మీడియా మొఘలుగా పేరుగాంచిన …
Read More »ప్రముఖ కమేడియన్ వేణుమాధవ్ మృతి…ఉత్తమ్కుమార్ రెడ్డి సంతాపం…!
ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ ఇవాళ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. తెలంగాణకు చెందిన వేణుమాధవ్ మరణంపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి జగదీష్రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. తాజాగా వేణుమాధవ్ మృతిపట్ల పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వేణుమాధవ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. వేణుమాధవ్ తెలంగాణ గర్వించదగ్గ హాస్యనటుడని..మంచి గుర్తింపు పొందిన నటుడిగా ఆయన …
Read More »శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ సేవకు ఉన్న విశిష్టత ఏంటీ..?
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 30 నుంచి అంగరంగ వైభవంగా జరుగునున్నాయి. సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరుడు మలయప్పస్వామిగా తొమ్మిదిరోజులపాటు ఒక్కో రోజు ఒక్కోవాహనం పై భక్తులకు దర్శనం ఇస్తాడు. పెద్దశేషవాహనం, చిన్నశేషవాహనం, సింహపువాహనం, ముత్యపుపందిరి వాహనం, కల్పవృక్షవాహనం, సర్వభూపాల వాహనం, గరుడవాహనం, హనుమంతవాహనం, స్వర్ణరథం, గజవాహనం, సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, రథోత్సవం, అశ్వవాహనం, పల్లకీ ఉత్సవం..ఇలా రోజుకో వాహనంపై ఊరేగుతూ శ్రీవారు భక్తులకు కనువిందు చేస్తారు. అయితే బ్రహ్మోత్సవాలలో ఐదవరోజు …
Read More »తిరుమలలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమం…!
తిరుమలలో ప్రతి ఏటా జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి సెప్టెంబర్ 30 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న సందర్భంగా టీటీడీ అధికారులు మంగళవారం నాడు తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని చేపట్టారు. వేకువ జామున 3 గంటలకు సుప్రభాతం నిర్వహించిన అనంతరం శ్రీహరి మూలవిరాట్టును పట్టుపరదాతో పూర్తిగా కప్పివేసి, ఆనంద నిలయం, బంగారువాకిలి, …
Read More »వైసీపీ సర్కార్పై టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ ఫైర్…!
గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో అవినీతి జరిగిందని భావించిన సీఎం జగన్ రివర్స్ టెండరింగ్కు వెళ్లిన విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్కు వెళ్లడం ద్వారా ప్రభుత్వానికి 58 కోట్ల ఆదాయం కూడా చేకూరింది. కాగా పోలవరం ప్రాజక్టు నిర్మాణపనుల్లో సంస్థలు ఇలా తక్కువకే కోట్ చేయడం వెనుక క్విడ్ఫ్రోక్ ఉందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో సహా ఎల్లోమీడియా ఛానళ్లు గగ్గోలు …
Read More »ఔరా అనిపిస్తున్న సైరా టైటిల్ సాంగ్…!
మెగాస్టార్ చిరంజీవీ హీరోగా, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్వుడ్ నుంచి అమితాబ్, సుదీప్, విజయ్సేతుపతి ముఖ్య పాత్రధారులుగా పాన్ ఇండియా మూవీగా వస్తోన్న చిత్రం…సైరా. చరిత్రలో మరుగునపడిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితగాథ పై రూపొందించిన చిత్రమే…ఈ సైరా. దాదాపు 300 కోట్ల బడ్జెట్తో రూపొందించిన ఈ చిత్రం అక్టోబర్ 2 న వరల్డ్వైడ్గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజైన సైరా మూవీ ట్రైలర్ కోటి వ్యూస్ దాటి …
Read More »సీఎం జగన్పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!
ఏపీలో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారి దాదాపు లక్షా పాతికవేలకు పైగా గ్రామవాలంటీర్లు, సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇటీవల పరీక్ష ఫలితాలను కూడా విడుదల చేసింది. అర్హత సాధించిన అభ్యర్థులకు కాల్లెటర్స్ పంపుతోంది. కాగా సచివాలయ ఉద్యోగాల ఫలితాల అనంతరం చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలు పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయని, ఏపీపీపీయస్సీలోనే ఈ లీకేజీ బాగోతం జరిగిందని, లక్షలాది మంది విద్యార్థులకు …
Read More »టీడీపీ నేత శివప్రసాద్ మృతి..కన్నీళ్లు పెట్టుకున్న వైసీపీ మంత్రి..!
చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్, టీడీపీ సీనియర్ నేత ఎన్. శివప్రసాద్ మరణం ప్రతి ఒక్కరిని కదిలించి వేస్తోంది. పార్టీ కోసం, ముఖ్యంగా పేద ప్రజల కోసం ఎంతో నిబద్దతతో పని చేసిన శివప్రసాద్ను వ్యకిగతంగా ప్రతి ఒక్కరూ అభిమానిస్తారు. . నటుడిగా, దర్శకుడిగా, రాజకీయ నాయకుడిగా రాణించిన శివప్రసాద్ ఆజాతశత్రువుగా పేరుగాంచారు. కరడు గట్టిన టీడీపీ నేతగా ఉన్నా..శివప్రసాద్ అన్ని రాజకీయ పార్టీల నాయకులతో స్నేహంగా వ్యవహరించేవారు. టీడీపీ …
Read More »నేడు ప్రగతిభవన్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ..!
ఇవాళ హైదరాబాద్లోని ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్తో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ భేటీ కానున్నారు. వైఎస్ జగన్ సోమవారం ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి హైదరాబాద్లోని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు నివాసమైన ప్రగతి భవన్కు వెళతారు. ఈ రోజు మధ్యాహ్నం ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశమై వివిధ అంశాలపై చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014లోని పరిష్కారం కాని అంశాలు, తొమ్మిది, పది షెడ్యూళ్లలోని సంస్థల …
Read More »బాహుబలి రికార్డులను “సైరా” బద్దలు కొడితే… పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు…!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మెగాపవర్ స్టార్ రాంచరణ్ నిర్మాతగా, సురేందర్ రెడ్డి డైరెక్షన్లో వస్తోన్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం..సైరా. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్ 2 న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ఆదివారం నాడు సైరా మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ను హైదరాబాద్లో అట్టహాసంగా నిర్వహించారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, …
Read More »