Home / siva (page 4)

siva

ఏపీకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్

ఏపీకీ కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో మూడు మెడికల్ కాలేజీలు పెట్టేందుకు అనుమతులు మంజూరు చేసింది. గుంటూరు జిల్లాలోని గురజాల, విశాఖపట్నంలోని పాడేరు, కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలలో ఈ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తర్వులు వెలువరించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు ఆదేశాలను జారీ చేసింది. మరోవైపు ఒక్కో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు రూ. 325 …

Read More »

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ ఇంట్లో సుకేశ్‌గుప్తా….అరెస్ట్

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ ఇంట్లో సీసీఎస్‌ పోలీసులు సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 14 బీఎన్‌రెడ్డి కాలనీలోని రవిప్రకాశ్‌ ఇంట్లో ముసద్దీలాల్‌ జ్యువెల్లరీస్‌ అధినేత సుకేశ్‌ గుప్తా తలదాచుకున్నట్లు అందిన సమాచారం మేరకు ఈ దాడులు జరిపారు. సుకేశ్‌ గుప్తాపై ఎస్‌ఆర్‌ఈఐ ఎక్విప్‌మెంట్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ అసోసియేట్‌ వైస్‌ప్రెసిడెంట్‌ వేణుగోపాల్‌ ఫిర్యాదు చేశారు. దీంతో పక్కా సమాచారం మేరకు భారీ బందోబస్తు ఏర్పాటుచేసి సుకేశ్‌ గుప్తాను అదుపులోకి …

Read More »

అర్ధరాత్రి నుంచి…బస్సులు బంద్‌!

కరోనా భయాల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఇప్పటికే పలు రాష్ట్రాలు అప్రమత్తత ప్రకటించాయి. స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాళ్లు ఈ నెల 31 వరకు మూసేయాలని ఆదేశాలు జారీ చేశాయి. తాజాగా మేఘాలయా ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒక్కరోజుపాటు పూర్తిగా ప్రజా రవాణాపై ఆంక్షలు విధిస్తున్నట్టు గురువారం వెల్లడించింది. మార్చి 20 అర్ధరాత్రి నుంచి మార్చి 21 అర్ధరాత్రి వరకు ఈ ఆదేశాలు అమలవుతాయని తెలిపింది. దాంతోపాటు …

Read More »

సీఎం జగన్ చొరవ: పోలవరం ప్రాజెక్ట్ సకాలంలో పూర్తి

ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా పోలవరం పనులను పూర్తిస్థాయి ఇంజనీరింగ్, శాస్త్రసాంకేతిక పద్ధతుల్లో పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించి ప్రాధాన్యత ఇస్తోంది. రాజకీయ, కాంట్రాక్టర్ల ప్రయోజనాలు పక్కనపెట్టి గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలు, లోటుపాట్లు, ముఖ్యంగా అశాస్త్రీయంగా (నాన్-ఇంజనీరింగ్) పద్ధతిలో చేపట్టిన పనులన్నింటినీ క్రమంగా సవరిస్తూ ఇంజనీరింగ్ మోడల్లోనే పోలవరంముందుకు సాగుతోంది. అటు నిర్మాణ పరంగానూ ఇటు ఇంజనీరింగ్ అనుమతుల్లోనూ ప్రాజెక్ట్ వేగం అందుకుంది. బహుళ …

Read More »

ఏపీలో ఇళ్ల పట్టాలు పంపిణీ స్వల్ప మార్పు

పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో సీఎస్‌ నీలం సాహ్ని, ఉన్నతాధికారులు హాజరయ్యారు. జిల్లాల వారీగా ఇళ్ల పట్టాలు, ప్లాట్ల అభివృద్ధిపై సీఎం సమీక్షించారు. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వైరస్‌ నివారణకు చర్యలు చేపడుతున్నందున ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా వేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఏప్రిల్‌ 14 అంబేద్కర్‌ జయంతి …

Read More »

‘కరోనా’ కారణంగానే శ్రీవారి దర్శనాలు నిలిపివేత

కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగానే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనాలు నిలిపివేశామని తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రజలందరి ఆరోగ్య పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని, దయచేసి అందరూ సహకరించాలని కోరారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ నియంత్రణకు భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయన్నారు. ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ …

Read More »

దొరబాబుకు స్వగ్రామంలో ఘన స్వాగతం

యుద్ధభూమి రక్షణలో శత్రువులతో పోరాడి, ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టిన ఉద్దానం వీరు డు తామాడ దొరబాబు స్వగ్రామం చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికి, సన్మానించారు. మందస మండలం లొహరిబంద పంచాయతీ చిన్నలొహరిబంద గ్రామానికి చెందిన దొరబాబు 1ఆర్‌ఆర్‌ బెటాలియన్‌లో చేస్తున్నాడు. ఈయనతోపాటు 200 మంది జవాన్లు బృందంగా ఏర్పడి ఈ నెల 9న జమ్మూ కశ్మీర్‌లోని కోజ్‌పూర్‌ గ్రామంలో సెర్చ్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా …

Read More »

‘అరేయ్ కేఏ పాల్… ఈ సుత్తి సలహాలు ఇచ్చే బదులు..అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన వర్మ

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ లకు క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ బంపర్ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. విశాఖ సమీపంలోని 25 ఎకరాల్లో తమ ఛారిటీకి 100 గదులు ఉన్నాయిని… అలాగే హైదరాబాదుకు సమీపంలో ఉన్న సంగారెడ్డిలో 300 గదులు ఉన్నాయని… కరోనా బాధితుల కోసం ఈ గదులను ఉచితంగా వాడుకోవచ్చని ఆయన అన్నారు. ఈ ఆఫర్ పై సినీ …

Read More »

సినీ ప‌రిశ్ర‌మ‌ల్లో ప‌రిచ‌యాల‌ు..శ‌రీరాల‌తో వ్యాపారం..ఇంకెంతమంది ఉన్నారో

రంగుల ప్రపంచం గురించి కలలు కనడం తప్పు కాదు . సినిమా పరిశ్రమ పై వ్యామోహం పెంచుకోవడం , నటులు కావాలన్న ఆశతో హైదరాబాద్ కు పరుగుపరుగున వచ్చి ఒకటి రెండుసినిమాల్లో అతి కష్టం పైన అవకాశం దొరికగానే విలాసవంత మైన జీవితం గురించి ఉహించుకొని దానికోసం లేని పోనీ వ్యసనాలకు బానిసలు కావడం ఇపుడు సర్వ సాదారణం అయిపొయింది . తాజాగా వ్య‌భిచారానికి మించిన సంపాద‌న మార్గం లేద‌ని …

Read More »

జూబ్లీహిల్స్ లో ఎస్సై ఆత్మహత్య

సీఆర్పీఎఫ్ లో ఎస్సైగా పని చేస్తున్న ఓ ఎస్సై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ సీఆర్పీఎఫ్ క్వార్టర్స్ లో ఆయన ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎస్సై భవానీ శంకర్ (30) రాజస్థాన్ కు చెందినవారు. క్వార్టర్స్ లోని వినోద గదిలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat