గూగుల్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.ఇందులో భాగంగా చిన్న వ్యాపారులు, ఇతర వ్యక్తిగత వినియోగదారుల అవసరాల కోసం గూగుల్ స్టోరేజీని 15జీబీ నుండి 1 టీబీకి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే వందకు పైగా ఫైల్ రకాలను గూగుల్ డ్రైవ్లో పొందుపరుచుకునే సదుపాయం ఉంది.. ప్రస్తుతం స్టోరేజీ పెంచడంతో వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. ఇది ఎప్పటి నుండి అమల్లోకి వస్తుందనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు
Read More »ప్రపంచాన్ని కలవరపెడుతున్న మంకీ పాక్స్
ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు విపరీతంగా పెరుగుతున్నట్లు వార్తలను మనం చూస్తూనే ఉన్నాము. ఈక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు మంకీ పాక్స్ కేసులు డెబ్బై వేల మార్కును దాటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే ఈ మహమ్మారి వల్ల రాబోయే రోజుల్లో మొత్తం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. కేసులు కాస్త తగ్గినట్లు అనిపించినా.. జాగ్రత్తలు తీసుకోవడం ఆపొద్దని సూచించింది. గతవారం మంకీపాక్స్ కేసులు పెరిగిన దేశాల్లో.. అమెరికా …
Read More »మరోసారి కలవరపెడుతున్న కొత్త కరోనా వేరియంట్
మూడు విడతలుగా కరోనా ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా దడ పుట్టించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఒమిక్రాన్కు చెందిన మరికొన్ని కొత్త వేరియంట్లు చైనాలో ఆందోళన కలిగిస్తున్నట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్ BF.7, BA.5.1.7 వేరియంట్ల కేసులు అధికంగా నమోదు అవుతున్నట్లు రికార్డులు ద్వారా స్పష్టమవుతోంది. ఈ కొత్త వేరియంట్లు చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. BA.5.1.7 ఒమిక్రాన్ సబ్ వేరియంట్ను మొదటిసారి ఈశాన్య చైనా ప్రాంతంలో గుర్తించామని …
Read More »డొనాల్డ్ ట్రంప్ పై అత్యాచార ఆరోపణలు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై అత్యాచార ఆరోపణల కింద జీన్ క్యారోల్ అనే రచయిత కేసు పెట్టేందుకు సిద్ధమయ్యారు. 1995లో ట్రంప్ తనను అత్యాచారం చేశారని ఆమె ఇదివరకే ఆరోపించారు. ఘటన జరిగి ఎన్నాళ్లైనా బాధితులు కేసు నమోదు చేయొచ్చని ఇటీవల న్యూయార్క్ చట్టాల్లో సడలింపులు రావడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఇప్పటికే ట్రంప్ పై పరువునష్టం దావా వేశారు క్యారోల్.
Read More »రూ.5.65లక్షల కోట్లు నష్టపోయిన జుకర్ బర్గ్
ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యధిక సంపద నష్టపోయిన కుబేరునిగా ఫేస్బుక్ కో-ఫౌండర్ మార్క్ జుకర్ బర్గ్ నిలిచాడు. ప్రస్తుతం ప్రపంచ ధనవంతుల్లో జుకర్ 20వ స్థానంలో నిలిచాడు. 2014 తర్వాత జుకర్ ఈ స్థాయికి దిగజారడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకు జుకర్ సంపదలో 71 బిలియన్ డాలర్లు(రూ.5.65 లక్షల కోట్లు) ఆవిరైపోయాయి. కంపెనీ పేరు ‘మెటా’గా మార్చి అందులో పెట్టుబడులు పెరిగాక కంపెనీ …
Read More »ఎలిజబెత్ తాగిన టీ బ్యాగ్ ఎంతనో తెలుసా..?
బ్రిటన్ రాణీ ఎలిజబెత్ II మరణంతో.. ఆమె వాడిన టీబ్యాగ్ ను Ebay అమ్మకానికి పెట్టింది. 1998లో ఎలిజబెత్ ఈ టీ బ్యాగ్ ను వినియోగించారు.. దానిని దాదాపు 12వేల డాలర్లకు Ebay అమ్ముతోంది. అంటే దాదాపు రూ.9.5 లక్షలకు కొనుగోలు చేయొచ్చు. ఈ టీ బ్యాగ్ మార్కెట్లో రూ. 5కు దొరుకుతుంది ..కానీ రాణి యూజ్ చేసినందున రూ.9.5లక్షలకు అమ్ముతున్నారు. ఎలిజబెత్ II మరణంతో ప్రపంచ దేశాల ప్రముఖులు …
Read More »రెండో ఎలిజబెత్ కన్నుమూత
బ్రిటన్ దేశపు మహారాణి రెండో ఎలిజబెత్ నిన్న గురువారం కన్నుమూశారు. ఎలిజబెత్ వయస్సు 96 సంవత్సరాలు. రాణి మరణవార్తను ఆమె నివాస భవనం బకింగ్హాం ప్యాలెస్ నిన్న గురువారం రోజు సాయంత్రం ప్రకటించింది. బ్రిటన్ను అత్యధిక కాలం (70 ఏండ్లు) పరిపాలించిన మహారాణిగా ఎలిజబెత్ చరిత్రకెక్కారు. రాణి మరణంతో ఆమె కుమారుడు చార్లెస్.. బ్రిటన్తోపాటు 14 కామన్వెల్త్ దేశాలకు రాజుగా బాధ్యతలు చేపట్టారు.ఆమె మృతదేహాన్ని ప్రజల సందర్శనార్ధం బకింగ్హాం ప్యాలెస్కు …
Read More »మరోసారి సంచలనం సృష్టించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
తాము అనుకున్న లక్ష్యం సాధించే వరకు ఉక్రెయిన్పై సైనిక చర్య కొనసాగుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. ఆంక్షల ద్వారా రష్యాను ఒంటిరిని చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలపై విమర్శలు గుప్పించారు. ఫార్ ఈస్టర్న్ పోర్ట్ సిటీ వ్లాడివోస్టాక్లో జరిగిన ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో పాల్గొన్న పుతిన్.. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని రక్షించడమే ప్రధాన లక్ష్యమన్నారు. సైనిక చర్యను ప్రారంభించింది తాము కాదని, దాన్ని అంతం చేసేందుకు …
Read More »చైనాలో మరో కొత్త వైరస్
కరోనా పుట్టినిల్లు చైనాలో మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. షాన్డంగ్, హెనాన్ ప్రావిన్సుల్లో 35 మందికి లంగ్యా హెనిపా వైరస్ సోకింది. జ్వరం, అలసట, దగ్గు, కండరాల నొప్పి, ఆకలి లేకపోవడం, తలనొప్పి, వాంతులు దీని లక్షణాలు. ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. అయితే మనుషుల నుంచి మనుషులకు సోకుతుందా అనేది తేలాల్సి ఉంది. వైరస్ సోకిన వారికి దూరంగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు.
Read More »డొనాల్డ్ ట్రంప్ నివాసంపై FBI దాడులు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాసంపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) దాడులు చేసింది. ఫ్లోరిడాలోని తన ఇల్లు ప్రస్తుతం FBI ఏజెంట్ల ముట్టడిలో ఉందని ట్రంప్ తెలిపారు. కనీస ముందస్తు సమాచారం ఇవ్వకుండా సోదాలు చేస్తున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆయన మండిపడ్డారు. అయితే సోదాల విషయం తెలిసి ట్రంప్ పలు కీలక డాక్యుమెంట్లను టాయిలెట్లో వేసి ఫ్లష్ చేశారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
Read More »