ముంబైలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. గత 24 గంటల్లో 5,428 కోత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఈ కేసుల 2,510 అధికం. అటు మహారాష్ట్రవ్యాప్తంగా 8,067 కేసులు నమోదయ్యాయి. 8 మంది కొవిడ్ వల్ల చనిపోయారు. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఆ రాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించింది.
Read More »తెలంగాణలో కొత్తగా 311 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 36,759 టెస్టులు చేయగా.. 311 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,81,898కు చేరాయి. .. గడిచిన 24 గంటల్లో 222 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు విదేశాల నుంచి వచ్చిన 159 మందికి టెస్టులు చేయగా.. 7 మందికి పాజిటివ్ రాగా, వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపారు.
Read More »హైదరాబాద్ ప్రజలకు న్యూ ఇయర్ కానుక
న్యూ ఇయర్ కానుకగా హైదరాబాద్ ప్రజల కోసం షేక్ పేట్ ఫ్లైఓవర్ ను ఈ రోజు మంత్రి కేటీ రామారావు ప్రారంభించనున్నారు. రూ. 333.55 కోట్ల అంచనాతో నిర్మించిన 2.8కి.మీ ఈ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి JNTU జంక్షన్ వరకు 17 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ సమస్యలు లేకుండా సులభతరం చేయనుంది.
Read More »పెరుగుతో లాభాలు మీకు తెలుసా..?
భోజనం చివర్లో ఒక్క ముద్దయిన పెరుగుతో తినాలంటారు. అది నిజమే ఎందుకంటే పెరుగు.. ఆహారం జీర్ణం కావడానికి దోహదపడుతుంది. అందుకే ప్రతిరోజూ పెరుగు తినాలి. అయితే ప్రస్తుతం చలికాలం కాబట్టి ఉదయం, మధ్యాహ్నం మాత్రమే పెరుగు తింటే మంచిది. సాయంత్రం, రాత్రివేళ దీన్ని తీసుకుంటే జలుబు చేసే అవకాశం ఉంది. ఇక పెరుగులో ఉండే రైబోఫ్లావిన్, విటమిన్ బి6, బి12, కాల్షియం వల్ల రోగనిరోధక శక్తి పెరగడం, ఎముకలు బలంగా …
Read More »హ్యాంగోవర్ అయిందా?.. అయితే ఇది మీకోసం..?
కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా హ్యాంగోవర్ అయిందా? అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. దీంతో డీహైడ్రేషన్, వికారం, తలనొప్పి, కండరాలు పట్టేయడం, అలసట, బద్ధకం వంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే వీటి నుంచి ఉపశమనం పొందాలంటే.. నిమ్మరసం, అల్లం-తేనె బ్లాక్ టీ, కొబ్బరి నీళ్లు, మజ్జిగలో ఏదైనా ఒకటి తీసుకోండి. అలాగే మంచినీళ్లు బాగా తాగితే డీహైడ్రేషన్ నుంచి రిలీఫ్ లభిస్తుంది.
Read More »బ్లాక్ టీ తాగడం వల్ల లాభాలెన్నో..?
బ్లాక్ టీ తాగడం వల్ల చర్మంపై వయసు ప్రభావం కనిపించదు. చర్మంపై వాపులు, మచ్చలు ఉంటే తగ్గుతాయి. చర్మవ్యాధులను నియంత్రిస్తుంది. బ్లాక్ టీ తయారీ కోసం.. 2 కప్పుల నీటిని 5ని. మరిగించాలి. అందులో టీ ఆకులను వేసి మూత క్లోజ్ చేసి మరో 2ని. మరిగించాలి. అప్పుడు ఆ నీటిని వడకట్టి తాగాలి. టేస్ట్ కోసం నిమ్మరసం, తేనే, అల్లం కలపుకోవచ్చు. చక్కెర వద్దు. చలికాలంలో ఈ టీ …
Read More »కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ కు మంత్రి కేటీఆర్ లేఖ
కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. వస్త్రాలపై అదనపు జీఎస్టీ ప్రతిపాదనలు విరమించుకోవాలని లేఖలో కోరిన ఆయన.. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై చర్చించాలన్నారు. జీఎస్టీ పెంపుతో వస్త్ర పరిశ్రమ కుదేలవుతుందన్న మంత్రి కేటీఆర్ కోట్లాది మంది చేనేతల జీవితాలు దెబ్బతింటాయన్నారు. వస్త్రాల ధరలు పెరిగి సామాన్యులు కూడా ఇబ్బంది పడతారన్న మంత్రి.. రైతుల మాదిరిగా నేతన్నలు కూడా కేంద్రంపై తిరగబడతారన్నారు.
Read More »ఏపీలో తగ్గిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు నిన్నటి కంటే స్వల్పంగా తగ్గాయి. తాజాగా 130 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో కొవిడ్తో ఒకరు చనిపోయారు. 97 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య- 20,76,979.మరణాల సంఖ్య- 14,493. మొత్తం కోలుకున్న వారి సంఖ్య- 20,61,405 ప్రస్తుతం యాక్టివ్ కేసులు- 1,081
Read More »నోరా ఫతేహికి కోవిడ్
బాలీవుడ్ నటి నోరా ఫతేహికి కోవిడ్ సోకింది. తాను కోవిడ్ తో తీవ్రంగా బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో ఆమె పేర్కొంది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నానని తెలిపిన నోరా.. అందరూ జాగ్రత్తగా ఉండాలి.. మాస్కులు ధరించాలని కోరింది. వైరస్ వేగంగా వ్యాపిస్తోందన్న ఫతేహి.. ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏదీ లేదని తెలిపింది. కాగా ప్రభాస్ ‘బాహుబలి’లో స్పెషల్ సాంగ్లో ఈమె నటించింది.
Read More »అమెరికాలో ఒక్కరోజే 6లక్షల కరోనా కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. గత 24 గంటల్లో ఒక్క అమెరికాలోనే 6 లక్షల కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల్లో ఇదే ప్రపంచ రికార్డు అని, ఇప్పటివరకు ఒక్క రోజులో ఇన్ని కేసులు ఎప్పుడూ రాలేదని అక్కడి అధికారులు తెలిపారు. కరోనా కాటుకు 1300 మంది మరణించారు. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇక ఫ్రాన్స్లో 2.06 లక్షలు, UKలో 1.90 లక్షల …
Read More »