మీ ఓటు ఎటువైపు.. కుట్టు మిషన్లకా.. కళ్యాణలక్ష్మికా..? అరవై రూపాయాల గోడ గడియారానికా.. కేసీఆర్ కిట్కా..? రూపాయి బొట్టుబిళ్లకా.. రూ.2016 పెన్షన్లకా..? అని మంత్రి హరీశ్రావు ఓటర్లను ఉద్దేశించి అడిగారు. వీటిలో ఏది ఉపయోగమో ఆలోచించాలని ఓటర్లకు ఆయన సూచించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని దమ్మక్కపేటలో యాదవ భవన నిర్మాణ పనులకు మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. గెల్లు శ్రీను ఉద్యమకారుడు. 20 ఏండ్లు …
Read More »ఢిల్లీ పర్యటనకు బయలుదేరిన మంత్రి పువ్వాడ..
దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ విహార్ మెట్రో స్టేషన్ వద్ద సెప్టెంబర్ 2న తెరాస పార్టీ జాతీయ కార్యాలయ నిర్మాణ శంకుస్థాపనకు సీఎం కేసీఆర్ గారు, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారితో కలిసి పాల్గొనేందుకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుండి ముఖ్యమంత్రితో కలిసి బయలుదేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారి చేతుల మీదుగా జరిగే భూమి …
Read More »మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. పదిహేను రోజుల వ్యవధిలో సిలిండర్ ధరలు పెరగడం ఇది రెండోసారి. గత నెల 17న గ్యాస్ బండ ధరలు పెంచిన చమురు కంపెనీలు మరోసారి వినియోగదారులపై భారం మోపాయి. గృహావసరాలకోసం వినియోగించే నాన్ సబ్సిడీ సిలిండర్ ధరను రూ.25 పెంచాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.884.50కు పెరిగింది. అదేవిధంగా వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 …
Read More »తెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్ పదవీ బాధ్యతల స్వీకరణ
బిసి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి బుర్రావెంకటేశం, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించిన బిసి కమిషన్ ఛైర్మన్, సభ్యులు.నూతనంగా నియమితులైన బిసి కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం క్రుష్ణమోహన్ రావు, సభ్యులు కిషోర్ గౌడ్, సంపత్, శుభప్రదపటేల్ ఈరోజు బుదవారం ఖైరతాబాద్లోని బిసి కమిషన్ కార్యాలయంలో కుటుంబ సభ్యల సమక్షంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బిసి సంక్షేమ …
Read More »కోవిడ్19 నివారణలో కీలకం కానున్న అత్యంత విష సర్పం
అత్యంత విష సర్పమే.. కోవిడ్19 నివారణలో కీలకం కానున్నది. బ్రెజిల్ అడవుల్లో కనిపించే సర్పం జరారాకుసో ( Jararacussu pit viper )కు చెందిన విషంతో కోవిడ్19ను అంతం చేయవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధ్యయన నివేదికను సైంటిఫిక్ జర్నల్ మాలిక్యూల్స్లో ప్రచురించారు. రక్తపింజర జరారాకుసో విషంలో ఉండే అణువులు.. కోవిడ్ వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ సర్ప విష అణువులు కోతుల్లో 75 …
Read More »మొదలైన పవన్ బర్త్ డే వేడుకలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కాని, పవన్ బర్త్ డే వేడుకలు కాని ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు. రేపు పవన్ 50వ బర్త్ డే సందర్భంగా ఈ సారి అభిమానులు బర్త్ డే సెలబ్రేషన్స్ ప్రత్యేకంగా జరపాలని భావిస్తున్నారు. ఒకవైపు పవన్ బర్త్ డే హంగామాతో పాటు మరోవైపు ఆయన పేరుతో పలు …
Read More »విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో రాగిజావ, బెల్లం, మొలకలు
కరోనా నేపథ్యంలో విద్యార్థులకు అదనపు పోషకాహారం అందించేందుకు చర్యలు చేపట్టారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు రాగిజావ, బెల్లం, లేత మొలకలను అందించనున్నారు. ఇందుకు కేంద్ర విద్యాశాఖ సైతం ఆమోదం తెలిపింది. 2021-22 మధ్యాహ్న భోజన పథకం ప్రాజెక్ట్ ఆమోదిత మండలి (పీఏబీ) మినట్స్ను ఇటీవలే కేంద్రం విడుదల చేసింది. ఈ ఏడాదికి 16,828 పాఠశాలల్లో 59 రోజులపాటు 7.75 లక్షల మందికి రాగిజావ, 7,277 పాఠశాలల్లో 61 …
Read More »తెలంగాణ భవన్ -జయించిన ధర్మమా.. ఇదీ నీ చిరునామా!
1969 జూలై 20వ తేదీన అమెరికన్ వ్యోమగామి నీల్ ఆమ్స్ట్రాంగ్ చంద్రుడిపై పాదం మోపిన ఘట్టాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఊపిరి బిగబట్టి వీక్షించారు. ఆమ్స్ట్రాంగ్ విజయాన్ని తమ విజయంగా భావించి పొంగిపోయారు. ‘ఒక మానవుడి అడుగు, మానవ జాతికి పెద్ద అంగ’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ మరిచిపోలేనివి. 1947 ఆగస్టు 15న ఇండియా గేట్ సమీపాన ప్రిన్సెస్ పార్క్ మైదానంలో తొలి ప్రధాని నెహ్రూ పతాకావిష్కరణ జరిపినప్పుడు …
Read More »దేశంలో కొత్తగా 30,941 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. మంగళవారం 30,941 కేసులు నమోదవగా తాజాగా 41 వేలకుపైగా మంది వైరస్ బారినపడ్డారు. ఇది నిన్నటికంటే 35.6 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 41,965 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,28,10,845కు చేరింది. ఇందులో 3,19,93,644 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారు. మరో 3,78,181 కేసులు యాక్టివ్గా ఉండగా, 4,39,020 …
Read More »తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్–19కు సంబంధించిన వివిధ రకాల వ్యాధుల్ని ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో చేర్చింది. అయితే తొలిదశలో దీనిని ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితం చేశారు. మలిదశలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా చికిత్స అందించనున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆయుష్మాన్ భారత్ పథకం కింద దేశంలో ఇప్పటికే కరోనాకు ఉచిత వైద్యం అందిస్తున్న సంగతి …
Read More »