Home / TELANGANA (page 446)

TELANGANA

గొల్ల కురుమలకు సంక్రాంతి పండుగ కానుక

గొల్ల కురుమలకు సంక్రాంతి పండుగ కనుక గా ఈ నెల 16 న రెండో విడత గొర్రెల పంపిణీని నల్లగొండలో ప్రారంభించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ ప్రకటించారు. శనివారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రి వెంట పశుసంవర్ధక శాఖా కార్యదర్శి శ్రీ అనిత రాజేంద్ర, డైరెక్టర్ శ్రీ లక్ష్మారెడ్డి, …

Read More »

ఎల్బీన‌గ‌ర్‌లో జంట రిజ‌ర్వాయ‌ర్లు ప్రారంభం

ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో తాగునీటి కష్టాలు తీర్చేందుకు మరో రెండు భారీ అధునాతన రిజర్వాయర్లు అందుబాటులోకి వ‌చ్చాయి. శనివారం రూ. 9.42 కోట్ల వ్యయంతో నిర్మించిన భారీ 2.5ఎంఎల్‌ కెపాసిటీ గల రెండు మంచినీటి రిజర్వాయర్లను రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ‌ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎల్బీన‌గ‌ర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌తో పాటు స్థానిక కార్పొరేట‌ర్లు పాల్గొన్నారు. హడ్కో నిధులు రూ. 325 కోట్లతో …

Read More »

నిమ్స్ లో మేఘా ఆధునిక సదుపాయాలతో అంకాలజీ

పేద, మధ్యతరగతి ప్రజల కోసం మేఘా ఇంజనీరింగ్‌ నిమ్స్ లోని అంకాలజీ భవనాన్ని అభివృద్ధి చేసింది. కార్పోరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద తన వంతు బాధ్యతగా క్యాన్సర్‌తో బాధపడే వారికోసం అత్యాధునిక సదుపాయాలతో కార్పోరేట్‌ హాస్పిటల్స్ కు దీటుగా అంకాలజీ భవనాన్ని తీర్చిదిద్దింది. ప్రభుత్వ వైద్య సంస్థ నిమ్స్ లో క్యాన్సర్‌ చికిత్స విభాగం పూర్తిస్థాయిలో సేవలు అందించడానికి అవసరమైన భవన, వైద్య యంత్రాలు, బెడ్లు తదితర సౌకర్యాలను ఎంఈఐఎల్‌ …

Read More »

లంబాడీ తండాలో డ‌బుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభం

బాగ్‌లింగంప‌ల్లిలోని లంబాడీ తండాలో కొత్త‌గా నిర్మించిన డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను రాష్ర్ట ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ శ‌నివారం ఉద‌యం ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, మంత్రులు మ‌హ‌ముద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్‌, కాలేరు వెంక‌టేశ్‌, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌తో పాటు స్థానిక కార్పొరేట‌ర్లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. లంబాడీ తండాలో డ‌బుల్ బెడ్రూం ఇండ్లు …

Read More »

గొర్రెల పంపిణీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు

కరోనా కారణంగా నిలిచిపోయిన మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని సత్వరం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని గొల్ల కురుమలకు 75 శాతం సబ్సిడీపై గొర్రెల పంపిణీ చేపట్టగా మొదటి విడత చివరి దశలో కరోనా వల్ల పంపిణీ నిలిచిపోయింది. దాదాపు 30 వేల మందికి పైగా డీడీలు కట్టి ఉన్నారు. వారందరికీ తక్షణం గొర్రెలు పంపిణీ చేయాలని పశుసంవర్థక శాఖ మంత్రి …

Read More »

గ్రేటర్లో మంత్రి కేటీఆర్ ప‌ర్య‌ట‌న

తెలంగాణ రాష్ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ శ‌నివారం న‌గ‌రంలో ప‌ర్య‌టించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా దోమ‌ల‌గూడ‌లో జోన‌ల్ డిప్యూటీ క‌మిష‌న‌ర్ కార్యాల‌యం ప‌నుల‌కు, నారాయ‌ణ‌గూడ‌లో మోడ్ర‌న్ మార్కెట్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డితో క‌లిసి శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మాల్లో మంత్రులు మ‌హ‌ముద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్ రెడ్డి, ‌ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, అంబ‌ర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంక‌టేశ్‌, జీహెచ్ఎంసీ మేయ‌ర్ …

Read More »

టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు “జీవీఆర్” వితరణ

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ కు చెందిన బాలానగర్ లోని కళ్యాణి నగర్ లో నివాసముండే అవర్నాకుల స్వరూప  గుండెకు సంబందించిన మరియు డయాలసిస్ వ్యాధితో బాధపడుతుండేది. నగరంలోని ఫతేనగర్ కి చెందిన అధికార తెరాస నాయకుడు ఎర్రోళ్ల వెంకటేష్ గౌడ్ కూకట్పల్లి తెరాస సీనియర్ నాయకుడు  గొట్టిముక్కల వెంకటేశ్వర రావు(GVR) దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈరోజు (9/01) వారికీ కూకట్పల్లి తెరాస పార్టీకార్యలయం లో తాత్కాలిక వైద్య ఖర్చులకు గాను …

Read More »

పోలీసుల అదుపులో బీజేపీ ఎమ్మెల్యే

తెలంగాణ బీజేపీకి చెందిన ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు పలువురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆవులను వధించకుండా కాపాడేందుకు అదేవిధంగా రవాణా చేయకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తు ఎమ్మెల్యే రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. గోరక్షకులు, తన మద్దతుదారులతో ఎమ్మెల్యే రోడ్డుపై నిరసన తెలపడంతో ట్రాఫిక్‌ అసౌకర్యానికి కారణమయ్యారు. దీంతో ఎల్బీనగర్‌ పోలీసులు అదనపు సిబ్బందితో కలిసివెళ్లి రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Read More »

త్వరలోనే సింగరేణిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ

తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేసేందుకు యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 651 ఉద్యోగాలను రాబోయే మార్చిలోగా భర్తీ చేస్తామని సంస్థ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌ శుక్రవారం తెలిపారు. వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలకు త్వరలోనే వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 569 కార్మికులు, 82 అధికారుల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు చెప్పారు. కార్మికుల విభాగంలో ఎలక్ట్రిషన్లు, వెల్డర్‌ …

Read More »

సీఎం కేసీఆర్‌కు వైద్య ప‌రీక్ష‌లు

లంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఇవాళ మ‌రోసారి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఊపిరితిత్తుల్లో మంట కార‌ణంగా నిన్న సీఎం కేసీఆర్‌కు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. వ్య‌క్తిగ‌త వైద్యుల సూచ‌న మేర‌కు ఇవాళ మ‌రికొన్ని ప‌రీక్ష‌లు చేయించుకునేందుకు సీఎం కేసీఆర్ సికింద్రాబాద్‌ య‌శోద ఆస్ప‌త్రికి మ‌ధ్యాహ్నం 2:30 గంట‌ల‌కు వెళ్ల‌నున్నారు. ఎంఆర్ఐ, సిటీస్కాన్‌తో పాటు త‌దిత‌ర ప‌రీక్ష‌లు సీఎం చేయించుకోనున్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat