ఏపీలో వ్యవసాయ మోటార్లు అన్నింటికీ విద్యుత్మీటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్టు సక్సెస్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా దీన్ని కొనసాగించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన శాఖలపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా కేంద్రాలు ఎఫ్ఏవో ఛాంపియన్ అవార్డుకు ఎంపికైన …
Read More »వాళ్లే టెన్త్ పేపర్లు లీక్ చేశారు: సీఎం జగన్
వైసీపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేందుకే టెన్త్ పరీక్షల పేపర్లను లీక్ చేస్తున్నారని ఏపీ సీఎం జగన్ ఆరోపించారు. టీడీపీకి మాజీ మంత్రి నారాయణకు చెందిన శ్రీ చైతన్య, నారాయణ స్కూల్స్ నుంచే పేపర్లు లీక్ అయ్యాయన్నారు. తిరుపతిలో జగనన్న విద్యాదీవెన నిధులను సీఎం విడుదల చేశారు. గత ప్రభుత్వాలేవీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదని.. ఇప్పుడు తాము ఇస్తుంటే తట్టుకోలేకపోతున్నారని ఆక్షేపించారు. అందుకే వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని …
Read More »ఎన్ని ఆటంకాలు వచ్చినా.. ఇచ్చిన మాట తప్పను: జగన్
తన పాదయాత్ర, ఎన్నికల మేనిఫెస్టోలో 25లక్షల మందికి ఇళ్లు కట్టిస్తామని మాటిచ్చామని.. అదనంగా మెరుగైన సౌకర్యాలతో కట్టిస్తున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. అనకాపల్లి జిల్లా పైడివాడ అగ్రహారం లే అవుట్లో ఏర్పాటు చేసిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో సొంతంగా ఇల్లు లేని కుటుంబం ఉండబోదని మాటిచ్చామని.. ఇచ్చిన మాటకంటే మెరుగైన సౌకర్యాలతో కట్టించి తీరుతామని …
Read More »హైకోర్టు సీజేతో సీఎం జగన్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రతో సీఎం జగన్ భేటీ అయ్యారు. విజయవాడలోని స్టేట్ గెస్ట్హౌస్లో వీరి సమావేశం జరిగింది. సీజేను సీఎం మర్యాదపూర్వకంగా కలిశారు. సీజేగా జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్ర బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం జగన్ భేటీ కావడంతో ఇదే మొదటిసారి. హైకోర్టుకు కొత్త భవనాల నిర్మాణ పనులతో పాటు ఇతర అంశాలపైనా వీరిద్దరూ చర్చించినట్లు తెలిసింది. దీంతో పాటు రాష్ట్రంలో కోర్టుల్లో …
Read More »గవర్నర్తో సీఎం జగన్ భేటీ.. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చ!
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో సీఎం జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. విజయవాడలోని రాజ్భవన్కు వెళ్లి గవర్నర్తో సమావేశమయ్యారు. త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన అంశాలపై గవర్నర్తో సీఎం చర్చించినట్లు సమాచారం. రేపు సాయంత్రం కేబినెట్ భేటీ జరగనుంది. ఆ సమావేశంలో ఎవరెవరిని మంత్రివర్గం నుంచి తప్పిస్తున్నారనే సమాచారాన్ని మంత్రులకు సీఎం వివరించనున్నారు. సీఎం జగన్ నిర్ణయం మేరకు ఈనెల 8న మంత్రులు తమ రాజీనామాలను సమర్పించే …
Read More »ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకోసం రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. 26 జిల్లాల ఏర్పాటుపై గతంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన వర్చువల్ కేబినెట్ మీటింగ్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదముద్ర వేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 70 రెవెన్యూ డివిజన్లు ఉండనున్నాయి. వీటిలో కొత్తగా 22 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. …
Read More »కేంద్రమే అంత క్లియర్గా చెప్పినా అధికారం లేదంటే ఎలా?: జగన్
రాజధాని, సీఆర్డీఏ చట్టాల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర శాసనసభకు ఉన్న అధికారాలను ప్రశ్నించే విధంగా ఉందని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అన్నారు. శాసనసభలో సీఎం మాట్లాడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పు.. రాజధాని విషయంలో కేంద్రం చెప్పిన అంశాలను ప్రస్తావించారు. ప్రజాస్వామ్యంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు మూడు మూల స్తంభాలని.. రాజ్యాంగం ప్రకారం ఈ మూడూ తమ పరిధులకు లోబడి మరో వ్యవస్థలో జోక్యం చేసుకోకూడదన్నారు. రాజధానితో …
Read More »మా విధానం మూడు రాజధానులే: అసెంబ్లీలో జగన్
ఏ ప్రభుత్వ విధానాలైనా నచ్చకపోతే ప్రజలే వారిని ఇంటికి పంపిచేస్తారని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ పాలన నచ్చపోవడంతోనే 175 స్థానాల్లో ఎన్నికలు జరిగితే వైసీపీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించారని చెప్పారు. ప్రభుత్వ పనితీరుని చూసి ప్రజలే తీర్పు ఇస్తారని.. ప్రజాస్వామ్యం గొప్పతనం ఇదేనని చెప్పారు. శాసనసభలో వికేంద్రీకరణపై అంశంపై జరిగిన చర్చలో సీఎం జగన్ మాట్లాడారు. అసాధ్యమైన టైం లైన్స్తో నెలరోజుల్లో రూ.లక్ష …
Read More »చంద్రబాబుపై సీఎం జగన్ సెటైరికల్ కామెంట్స్..
టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పులను తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మద్యం తయారీకి సంబంధించిన 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలలరీలకు పర్మిషన్ ఇచ్చిన పాపం చంద్రబాబు ప్రభుత్వానిదేనని చెప్పారు. లిక్కర్ పాలసీపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో జగన్ మాట్లాడారు. నవరత్నాలు, అమ్మఒడి.. ఇవన్నీ తమ ప్రభుత్వ బ్రాండ్లని.. ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ ఛాయిస్, భూంభూం బీర్, 999 లెజెండ్, పవర్స్టార్ 999 …
Read More »ఏపీలో నిరుద్యోగులకు జగన్ గుడ్న్యూస్
విజయవాడ: ఏపీలోని నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. తొలుత జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన పోస్టుల కంటే ఎక్కువ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీకి ప్రభుత్వం అనుమతించింది. దీని ద్వారా గ్రూప్-1లో 110, గ్రూప్-2లో 182 పోస్టులు భర్తీ చేయనున్నారు. గ్రూప్-1లో డిప్యూటీ కలెక్టర్లు, ఆర్టీవోలు, సీటీవో, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, ఎంపీడీవో, డీఎస్పీ ఇలా.. …
Read More »