ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో సోషల్ మీడియా మాధ్యామం అయిన ట్విటర్ ను కొనుగోలు చేస్తానన్న డీల్ ను మస్క్ రద్దు చేసుకున్నారు. ఫేక్ అకౌంట్లకు సంబంధించి వివరాలు సమర్పించడంలో ట్విటర్ విఫలమైంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విటర్ కు టెస్లా లేఖ రాసింది. కాగా 44 బిలియన్ డాలర్లకు ట్విటర్ ను కొనుగోలు చేస్తున్నట్లు మస్క్ ఏఫ్రిల్ నెలలో ప్రకటించారు.
Read More »ట్విట్టర్ లో ప్రకంపనలు
ట్విట్టర్ను టెస్లా సీఈవో ఎలన్మస్క్ టేకోవర్ చేయకముందే మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా సైట్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ట్విట్టర్లో ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్లను వైదొలగాలని ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ ఆదేశించారు. వారిలో కన్జూమర్ ప్రొడక్టు మేనేజర్ కవ్యోన్ బెయ్క్పూర్, రెవెన్యూ జనరల్ మేనేజర్ బ్రూస్ ఫాల్క్ చెప్పారు. ట్విట్టర్లో చేరిన ఏడేండ్ల తర్వాత వైదొలుగుతున్నట్లు బెయ్క్పూర్ ప్రకటించారు. ట్విట్టర్ను ఎలన్మస్క్ టేకోవర్ చేయడానికి ముందు సంస్థను విభిన్న మార్గంలో …
Read More »మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఇంట్లో విషాదం
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమారుడు జైన్(26) మృతి చెందాడు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య, ఆయన భార్య అను దంపతుల కుమారుడు జైన్ నాదెళ్ల సోమవారం ఉదయం(అమెరికా కాలమానం ప్రకారం) మరణించినట్లు మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ తెలిపింది. ఈ విషయాన్ని సత్య నాదెళ్ల తన ఎగ్జిక్యూటివ్ సిబ్బందికి ఇమెయిల్ ద్వారా తెలియజేశారు. జైన్ పుట్టినప్పటి నుంచి సెరెబ్రల్ పాల్సీ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఇక సెరెబ్రల్ …
Read More »రోజుకు 90 లక్షల మందికి టీకా తప్పకుండా వేయాల్సిందే..లేకపోతే..?
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదించడం ఆందోళన కల్గిస్తోందని NDTV కో-ఫౌండర్ ప్రణయ్ రాయ్ ట్వీట్ చేశారు. 4 వారాల కింద రోజుకు 22 లక్షల మందికి, 2 వారాల కింద 20 లక్షల మందికి, వారం క్రితం 19 లక్షల మందికి టీకా ఇస్తే మే 19న మాత్రం 13 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారని తెలిపారు. కరోనాపై విజయం సాధించాలంటే రోజుకు 90 లక్షల మందికి …
Read More »మరో 600 ఎకరాలను కొనుగోలు చేసిన మార్క్ జుకర్ బర్గ్
ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ దంపతులు హవాయిలో మరో 600 ఎకరాలను కొనుగోలు చేశారు. హవాయిలోని కవాయి ద్వీపంలో ఈ భూమిని 53 మిలియన్ డాలర్లకు (రూ.391 కోట్లు) కొన్నారు. హవాయిలో జుకర్ బర్గ్కు ఇప్పటికే భూమి ఉండగా, ప్రస్తుత కొనుగోలుతో అక్కడ ఆయన భూమి మొత్తంగా 1300 ఎకరాలకు చేరింది.
Read More »సత్య నాదెళ్ల, మంత్రి కేటీఆర్ ముఖాముఖి -మీకోసం
కరోనా కారణంగా వైద్యరంగంలో సమూల మార్పులు వచ్చాయని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. మార్పులను కొనసాగిస్తూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వైద్యసేవల రంగంలో ప్రవేశపెట్టాలని పిలుపునిచ్చారు. వైద్య సిబ్బందిపై ఒత్తిడి తగ్గిస్తూ, రోగులకు ప్రయోజనం చేకూర్చేలా కృత్రిమ మేధ, హాలోగ్రామ్ వంటి టెక్నాలజీలను ప్రోత్సహించాలని సూచించారు. బయోఏషియా-2021 సదస్సు రెండోరోజు ‘హెల్త్కేర్ టు హిట్ రిఫ్రెష్’ అంశంపై చర్చలో సత్య నాదెళ్ల, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే …
Read More »ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ సంస్థగా టీసీఎస్
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మరోమారు తన సత్తాను చాటింది. మార్కెట్ విలువలో దేశీయ అత్యంత విలువైన సంస్థగా ఆవిర్భవించింది. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ను వెనక్కినెట్టి టీసీఎస్ తొలి స్థానం సాధించింది. రూ.12,34,609.62 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో టీసీఎస్ ఈ సత్తా చాటింది. రూ.12,29,661.32 కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నది. ఇంట్రాడేలో 1.26 శాతం పెరిగిన టీసీఎస్ షేరు ధర చివరకు …
Read More »మైక్రోసాఫ్ట్ నుండి బిల్ గేట్స్ ఔట్
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మైక్రోసాఫ్ట్ బోర్డు నుండి తప్పుకోవాలని బిల్ గేట్స్ నిర్ణయించుకున్నారు. సరిగ్గా 1975లో పాల్ అల్లెన్ తో కల్సి బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ ను స్థాపించారు. అప్పటి నుండి చాలా కాలం సీఈఓగా పని చేశారు. గత కొంతకాలంగా సేవ కార్యక్రమాలపై దృష్టి పెట్టిన బిల్ గేట్స్ సేవపనులపైనే ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారు అని తెలుస్తుంది. అందుకే ఒక పక్క …
Read More »సత్య నాదెళ్ల జీతం ఎంతో తెలుసా..?
మైక్రోసాప్ట్ సీఈఓ సత్య నాదెళ్ల జీతం ఎంతో తెలుసా..?. ఒక ఏడాదికి ఎంత సంపాదిస్తాడో తెలుసా..?. 2018-19 ఏడాదికి ఎంతమొత్తంలో తీసుకున్నాడో తెలుసా..?. 2018-19ఏడాదికి సత్య నాదెళ్ల తీసుకున్న జీతం అక్షరాల రూ.305 కోట్లు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది సత్యనాదెళ్లకు 65% జీతం పెరిగింది. ఆయన మూల వేతనం రూ.16.63 కోట్లు. అధిక శాతం సంపాదన సంస్థ షేర్ల నుంచే వచ్చింది కావడం గమనార్హం. ఆయనకు …
Read More »బ్రేకింగ్ న్యూస్. రవిప్రకాశ్ అరెస్ట్
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ9 మాజీ సీఈఓ అయిన రవిప్రకాశ్ గత కొద్ది రోజుల కింద పోర్జరీ సంతకం కేసులో అరెస్ట్ .. విచారణ తదితర చర్యలను ఎదుర్కున్న సంగతి విదితమే. తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని బంజరాహిల్స్ పోలీసులు రవిప్రకాశ్ ను అరెస్ట్ చేశారు. తమ విధులకు అటంకం కలిగిస్తున్నారనే నేపంతో రవిప్రకాశ్ ను అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read More »