వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్లు వైఎస్ YSవిజయమ్మ ప్రకటించారు. గుంటూరు జిల్లా చినకాకానిలో నిర్వహించిన వైసీపీ ప్లీనరీకి ఆమె హాజరై మాట్లాడారు. తమ కుటుంబంతో ప్రజల అనుబంధం 45 ఏళ్లుగా కొనసాగుతోందని చెప్పారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రతి మనిషినీ ప్రేమించారన్నారు. తమ కుటుంబ అనుబంధం, సంస్కారం గొప్పవని చెప్పారు. తామే కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలే ఓదార్చారన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు నా కొడుకు జగన్తో ఉన్నానని.. బిడ్డ షర్మిలకు …
Read More »ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
ఏపీలోని కోనసీమ జిల్లాను అంబేడ్కర్ కోనసీమగా పేరు మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్ ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన పీఆర్సీ జీవోలో మార్పులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ నెల 27న అమ్మఒడి పథకానికి నిధులు విడుదల చేయనున్నారు. దీంతోపాటు విద్యాకానుక, వాహనమిత్ర, జగనన్నతోడు, కాపు నేస్తం సంక్షేమ పథకాలను వచ్చే నెల నుంచి అమలు చేయనున్నారు. వంశధార …
Read More »మరోసారి మంచి మనసు చాటుకున్న సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ తనలో ఉన్న మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. తిరుపతి జిల్లాలో వకులామాత ఆలయ సంప్రోక్షణ సహా వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. పర్యటన ముగించుకుని తిరిగి ఎయిర్పోర్ట్కి వెళ్తున్న సమయంలో రోడ్డుపై అర్జీతో నిలుచుకున్న యువకుడు మహేశ్ని చూసి కాన్వాయ్ ఆపారు. సెక్యూరిటీ స్టాఫ్ని ఆ యువకుడి వద్దకు పంపి అర్జీని తీసుకున్నారు. మహేష్కి 2019లో యాక్సిడెంట్ కావడంతో ఎడమ చేయి విరిగిపోయింది. అంగవైకల్యం కలగడంతో …
Read More »ఏపీలో చురుగ్గా రోడ్ల మరమ్మతు పనులు: సీఎం జగన్
రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు, ఆర్వోబీలను వెంటనే పూర్తిచేయాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే పనులు చేపట్టాని స్పష్టం చేశారు. తాడేపల్లి క్యాంపు కర్యాలయంలో ఆర్అండ్బీ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులు చురుగ్గా సాగుతున్నాయని.. నాడు-నేడుతో చేపట్టే పనుల్లో పురోగతి కనిపిస్తోందని చెప్పారు. జులై 15 నాటికి గుంతలన్నీ పూడ్చాలని.. 20న ఫొటో గ్యాలరీలో పెట్టాలని సీఎం …
Read More »ఆ భూముల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి: జగన్ ఆదేశం
పరిశ్రమల కోసం ప్రభుత్వం కేటాయించిన భూముల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఎంఎస్ఎంఈలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని.. సకాలంలో వారికి ప్రోత్సాహకాలు అందేలా చూడాలని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల అభివృద్ధి, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడారు. దేశంలో ఎవరూ చేయని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు …
Read More »రైతులకు మేలు చేసేందుకు దేశంతో పోటీ: జగన్
కోనసీమలో క్రాప్ హాలిడే పేరుతో రైతుల్ని కొందరు రెచ్చగొడుతున్నారని ఏపీ సీఎం జగన్ విమర్శించారు. గతంలో ధాన్యం బకాయిలు ఎగ్గొట్టినందుకా? ఆ బకాయిలను వైసీపీ ప్రభుత్వం తీర్చినందుకా? ఎందుకు క్రాప్ హాలిడే అని ప్రశ్నించారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో పంటల బీమా పథకం కింద రూ.2,977కోట్ల పరిహారాన్ని రైతుల ఖాతాల్లో సీఎం జమ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రైతులకు మేలు చేసే …
Read More »త్వరలోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు?
ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 20 నుంచి వారం రోజులపాటు ఈ సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చ జరిగినట్లు సమాచారం. సభలో ప్రవేశపెట్టే బిల్లుల అంశాన్ని గవర్నర్ దృష్టి సీఎం తీసుకెళ్లినట్లు తెలిసింది. మరోవైపు రాష్ట్రంలో ఇటీవల జరిగిన కొన్ని అంశాలతో పాటు కోనసీమ అల్లర్లపై ప్రభుత్వం …
Read More »ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
ట్రాన్స్ఫర్ల కోసం ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బదిలీలకు సంబంధించిన ఫైల్పై సీఎం జగన్ సంతకం చేశారు. జూన్ 17లోపు బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు. సీఎం సంతకం పూర్తయిన నేపథ్యంలో ట్రాన్స్ఫర్లకు సంబంధించిన మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయనుంది.
Read More »వైసీపీ నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడు సస్పెన్షన్
మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిని వైసీపీ సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ సెంట్రల్ ఆఫీస్ఓ ప్రకటనలో వెల్లడించింది. పార్టీ అధినేత, సీఎం జగన్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ సెంట్రల్ ఆఫీస్ పేర్కొంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు వచ్చి ఫిర్యాదులు.. పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నరసాపురం నియోజకవర్గంలో గత కొద్దిరోజులుగా అక్కడి వైసీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజుతో …
Read More »ఆత్మకూరు పోరు.. విక్రమ్రెడ్డికి బీఫారం అందించిన జగన్
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికకు వైసీపీ అభ్యర్థిని అధికారికంగా ఖరారు చేసింది. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి సోదరుడు విక్రమ్రెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఈ మేరకు వైసీపీ అధినేత, సీఎం జగన్ పార్టీ తరఫున బీఫారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read More »