నాలుగేళ్లలోపు పిల్లలకు క్లోరోఫెనిరామైన్ మాలేట్, ఫెనైల్ట్ఫిన్ కాంబినేషన్లోని యాంటీ కోల్డ్ డ్రగ్స్ ఇవ్వడాన్ని కేంద్రం నిషేధించింది. దగ్గుమందుల వాడకంతో గతేడాది నుంచి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 141 మంది పిల్లలు చనిపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సినారెస్ట్ టాబ్లెట్, మక్స్డ్ సిరప్, నాసోక్లియర్ కోల్డ్-AF డ్రాప్స్ మొదలైనవి ఈ నిషేధిత కాంబినేషను చెందినవే.
Read More »దేశంలో కరోనా కలవరం
దేశంలో కరోనా కలవరం మొదలైన నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. * మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. * 10 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వారు, గర్భిణులు అత్యవసరమైతే తప్పా బయటకు రావొద్దు. * వీలైనన్ని ఎక్కువసార్లు చేతులు శుభ్రం చేసుకోవాలి. * జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాసలో ఇబ్బందులుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. * ఇంటి లోపల వేడి వాతావరణం ఉండేలా చూసుకోవాలి.
Read More »వెంట్రుకలు రాలకుండా ఉండాలంటే..?
మన వెంట్రుకలకు సహాజంగానే వానకాలం శత్రువు లాంటిది. మనకు తెలియకుండానే జుట్టు రాలిపోతుంది. జడ పలచబడిపోతుంది. తడి వాతావరణంలో చుట్టుపక్కల కాలుష్యమంతా తల మీద పోగైపోతుంది. దీంతో చర్మ రోగాలు పుట్టుకొస్తాయి. చుండ్రు తిష్టవేస్తుంది. జుట్టు జిడ్డుగా మారుతుంది. కొందరిలో విపరీతంగా పొడిబారుతుంది. దురదగానూ అనిపించవచ్చు. తగిన జాగ్రత్తలతో ఈ సమస్యల్ని నివారించడం సాధ్యమే. వర్షంలో తడవకండి. తడిసినా వెంటనే పొడి తువ్వాలుతో తుడుచుకోండి. అప్పుడు కూడా ఎక్కువ ఒత్తిడి …
Read More »మొక్క జొన్న ఎవరైనా తినొచ్చా..?
సహజంగానే మొక్కజొన్న శక్తికి చిరునామా. తక్షణ శక్తికి మంచి ఎంపిక. ఇందులో విటమిన్- ఎ, బి, ఇ, కె లాంటి విటమిన్లతోపాటు.. మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్లాంటి మినరల్స్ అధికంగా ఉంటాయి. తక్కువ స్థాయిలో కొవ్వులూ ఉంటాయి. అందువల్ల ఎవరైనా తినొచ్చు. కాకపోతే, ఇతర ఆహార పదార్థాలతో పోలిస్తే ఇందులో కార్బొహైడ్రేట్లు కూడా ఎక్కువే. అందుకే మధుమేహులు దూరంగా ఉండాలంటారు. అలా అని, అసలు తినకూడదని కాదు, తక్కువ మోతాదులో తీసుకోవచ్చు. …
Read More »గర్భిణీ తినాల్సిన పండ్లు ఏవి..?
గర్భిణీ తన కడుపులో పిండం పెరుగుతున్న దశలో ఇద్దరికీ సరిపోయేలా తినమని పెద్దలు చెప్పే మాట ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ అది నిజమే. గర్భిణిగా ఉన్నప్పుడు చేసుకునే ఆహార ఎంపికలు కడుపులో బిడ్డమీద కూడా ప్రభావం చూపుతాయి. పిండం అభివృద్ధి కోసం తల్లి నాణ్యమైన పోషకాహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో పండ్లు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. అన్ని పండ్లు మంచివే అయినా, గర్భిణులకు కొన్నింటిని మాత్రం తప్పకుండా తినాలని …
Read More »100కోట్ల మందికి కలరా ముప్పు
రానున్న రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కలరా మళ్లీ విజృంభించే అవకాశం ఉందని UNO హెచ్చరించింది. సుమారు 100 కోట్ల మంది కలరా బారినపడే ప్రమాదం ఉందని UNO తాజా నివేదికలో పేర్కొంది. ప్రధానంగా 40 దేశాలకు చెందిన చిన్నారులు ఈ జాబితాలో ఉన్నారని తెలిపింది. ఇప్పటికే 24 దేశాల్లో కేసులు నమోదైనట్లు వెల్లడించింది. వాతావరణ మార్పులు, పారిశుద్ధ్య నిర్వహణ లోపం, నీటి శుద్ధిపై దృష్టి పెట్టకపోవడమే దీనికి కారణమని తెలిపింది.
Read More »తల్లిని మించిన గేదే..?
ఏపీలో వినూత్నమైన సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో ఓ ముర్రా జాతి గేదె రికార్డు స్థాయిలో పాలు ఇస్తోంది. ముత్యాల సత్యనారాయణకు చెందిన తల్లి గేదె రోజుకు 26.58 లీటర్ల పాలు ఇస్తూ రాష్ట్రస్థాయి పాల దిగుబడి పోటీల్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచాయి.. నాలుగేళ్ల వయసున్న పిల్ల గేదె రెండో ఈతలోనే తల్లికి మించి రోజుకు 26.59 లీటర్ల పాల దిగుబడిని నమోదు …
Read More »శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారికి శుభవార్త
ప్రస్తుత ఆధునీక యుగంలో బిజీబిజీ జీవిన శైలీలో చాలా మంది శ్వాసకోశ వ్యాధుల (యూఆర్టీఐ)తో బాధపడుతున్న సంగతి విదితమే. అయితే ఇలాంటి వారికి నిజంగా ఇది శుభవార్త. వైద్య చరిత్రలోనే అత్యంత దీర్ఘకాలిక వ్యాధులను ఆయుర్వేద డ్రగ్ ఫిఫట్రాల్ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నదని తాజాగా పరిశోధకులు గుర్తించారు. మొత్తం 203 మంది యూఆర్టీఐ రోగులకు రోజుకు రెండుసార్లు ఫిఫట్రాల్ డ్రగ్ను ఇచ్చారు. డ్రగ్ ఇచ్చిన మొదటి, నాలుగు, ఏడో రోజున వారికి …
Read More »మొటిమలు రాకుండా ఏమి చేయాలంటే..?
టీనేజ్ వయసు రాగానే మగవారిలో, ఆడవారిలో మొటిమలు కనిపిస్తుంటాయి. హార్మోన్ల సమతుల్యత లోపించడం వల్ల సబేసియస్ గ్రంథుల నుంచి సెబమ్ ఎక్కువగా తయారై మొటిమలకు దారితీస్తుంది. అయితే మధ్య వయసు వారిలో మొటిమలు రావడం అసహజంగా ఉంటుంది. మన వద్ద 40 ఏండ్లు దాటిన వారిలో మొటిమలు కనిపిస్తున్నాయి. ఇలా మధ్య వయసులో మొటిమలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎలా తయారవుతాయి.. చమురు గ్రంథులను నిరోధించినప్పుడు చర్మం ఉపరితలంపై …
Read More »మీరు సమయానికి తినడం లేదా…? అయితే ఇది మీకోసం .?
ప్రస్తుత బిజీబిజీ షెడ్యూల్ లో టైం తినకపోవడానికి.. టైంకి నిద్రపోవడానికి అసలు కుదరదు. అయితే చాలా మందికి మానసిక ఒత్తిడి,ఆందోళనకు ఇదోక కారణం అంటున్నారు. మనం తిండి తినే సమయానికి సంబంధం ఉంటుందట. పగటి పూట భోజనం చేసేవారితో పోలిస్తే రాత్రి పూట భోజనం చేసేవారికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. ప్రత్యేకించి రాత్రి పూట భోజనం చేసేవారిలో మానసిక ఒత్తిడి, ఆందోళన అధికంగా …
Read More »