అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ కన్నుమూశారు. ఆమె అద్భుతమైన, అందమైన మహిళ అని, ఆమె జీవితం స్ఫూర్తిదాయకం అని ట్రంప్ ట్వీట్ చేశారు. మరణానికి గల కారణాలను పేర్కొనలేదు. 1977లో ట్రంప్, ఇవానా పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. 1990లో విడాకులు తీసుకున్నారు. 1993లో నటి మార్గాను ట్రంప్ పెళ్లి చేసుకున్నారు. 1999లో ఆమెను వదిలేసి, 2005లో మెలానియా ట్రంపు పెళ్లాడారు.
Read More »69 ఏళ్ల వయసులో మరోసారి తండ్రి కాబోతున్న రష్యా అధ్యక్షుడు
రష్యా అధ్యక్షుడు పుతిన్ 69 ఏళ్ల వయసులో మరోసారి తండ్రి కాబోతున్నట్లు జనరల్ ఎస్వీఆర్ టెలిగ్రాం ఛానల్ వెల్లడించింది. ఆయన ప్రేయసి, మాజీ జిమ్నాస్ట్ అలీనా కబయెవా ప్రెగ్నెంట్ అని పేర్కొంది. లింగ నిర్ధారణ పరీక్షల్లో ఆడపిల్లగా తేలిందని తెలిపింది. వీరికి ఇప్పటికే ఇద్దరు కొడుకులున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ విషయం బయటపడకుండా ఆమెను రహస్యంగా స్విట్జర్లాండ్లో కొన్నేళ్లపాటు ఉంచారు.
Read More »కేన్ విలియమ్సన్ కి కరోనా పాజిటీవ్
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కొవిడ్ బారిన పడ్డాడు.మొన్న శుక్రవారం ఇంగ్లండ్తో రెండో టెస్టు ఆరంభానికి ముందు విలియమ్సన్ పాజిటివ్గా తేలినట్టు కివీస్ జట్టు కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపాడు. దీంతో కేన్ తాజా టెస్టుకు దూరమయ్యాడు.. అతని గైర్హాజరీతో మ్యాచ్కు టామ్ లాథమ్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. కాగా, విలియమ్సన్ స్థానంలో హమిష్ రూథర్ఫర్డ్ జట్టులోకి వచ్చాడు.
Read More »అత్యంత విషమంగా ముషారఫ్ ఆరోగ్యం..
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ హెల్త్ కండిషన్ ఏమాత్రం బాగోలేదు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. కొద్దిరోజులుగా దుబాయ్లోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన ఆరోగ్యం విషమించినట్లు హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం వెంటిలేటర్పై ముషారఫ్కు చికిత్స కొనసాగుతున్నట్లు సమాచారం. పాకిస్థాన్ ఆర్మీలో చేరి అంచెలంచెలుగా ముషారఫ్ ఎదిగారు. ఆ తర్వాత ఏకంగా ఆ దేశ అధ్యక్షుడిగా పనిచేశారు.
Read More »ఘోరం.. బిల్డింగ్ కింద సుమారు 200 డెడ్బాడీలు..
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్లోని చాలా పట్టణాలు, నగరాలు ఇప్పటికే ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా పోర్ట్ సిటీ మేరియుపోల్ తీవ్రంగా నష్టపోయింది. మూడునెలలుగా రష్యా జరుపుతున్న దాడిలో వందలాది మంది చనిపోయారు. ఆ నగరంలో తాజాగా భయానక వాతావరణం నెలకొంది. కూలిపోయిన ఓ భవనం కింద సుమారు 200 డెడ్బాడీలు లభ్యమయ్యాయి. భవనం శిథిలాలను కార్మికులు తొలగిస్తుండగా మృతదేహాలను గుర్తించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. డెడ్బాడీలు కుళ్లిపోయిన స్థితిలో …
Read More »దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగాయి. బుధవారం 1862 కేసులు నమోదవగా, తాజాగా ఆసంఖ్య 2364కు పెరిగింది. ఇది నిన్నటికంటే 29.3 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,31,29,563కు చేరాయి. ఇందులో 4,25,89,841 మంది కోలుకోగా, 5,24,303 మంది మరణించారు. ఇంకా 15,419 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 10 మంది మృతిచెందగా, 2582 మంది కరోనా నుంచి బయటపడ్డారు.
Read More »ప్రపంచాన్ని వణికిస్తోన్న మరో కొత్త వైరస్ -అమెరికాలో తొలి కేసు నమోదు
అమెరికాలో మంకీపాక్స్ వైరస్ కేసు నమోదు అయ్యింది. ఆ దేశ అంటువ్యాధుల సంస్థ సీడీసీ ఈ కేసును ద్రువీకరించింది. మాసాచుసెట్స్కు చెందిన ఓ వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే ఆ వ్యక్తి ఇటీవల కెనడాలో పర్యటించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతన్ని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్లో చేర్పించారు. కెనడాలోని క్యూబెక్ ప్రావిన్సులో డజన్ల సంఖ్యలో ఇలాంటి కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. మంకీపాక్స్ను సీరియస్ వైరస్ కేసుగా …
Read More »భారతీయుడికి అసామాన్య గుర్తింపు.. ప్రకటించిన పోప్
మనదేశంలో 18వ శతాబ్దంలో పుట్టి క్రిస్టియానిటీని స్వీకరించిన దేవ సహాయం పిళ్లైకు ఇక నుంచి దైవదూతగా గుర్తింపు లభించనుంది. క్రిస్టియన్ల ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం వాటికన్ సిటీలో ఆదివారం జరిగిన ప్రత్యేక వేడుకలో దేవసహాయం పిళ్లైను దైవదూతగా పోప్ ప్రాన్సిస్ ప్రకటించారు. ఈ గుర్తింపు లభించిన తొలి భారతీయ సామాన్యుడిగా పిళ్లై చరిత్రలో నిలిచిపోనున్నారు. తమిళనాడులోని కన్యాకుమారి గతంలో ట్రావెన్కోర్ రాజ్యంలో భాగంగా ఉండేది. ఆ జిల్లాలోని హిందూ నాయర్ల …
Read More »తాలిబన్లు సంచలన నిర్ణయం
ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల పాలనలో మహిళలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మహిళల ఉన్నత విద్యపై పలు కండిషన్లు పెట్టిన తాలిబన్లు.. తాజాగా మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ జారీచేయడాన్ని నిలిపివేశారు. కాబూల్, ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే ఈ అంశమై ఆదేశాలు జారీ అయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. డ్రైవింగ్ టీచర్లకు కూడా ప్రభుత్వ మార్గదర్శకాలు అందినట్లు పేర్కొంది.
Read More »చందమామను అణుబాంబులతో పేల్చాలని అనుకున్నారా..?
మీరు చదివిన వార్త నిజమే. చందమామను అణుబాంబులతో పేల్చేయాలని ప్రపంచంలోనే అగ్రదేశమైన అమెరికా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. చందమామను అణుబాంబులతో పేల్చేయాలని.. అక్కడ ఉన్న ఖనిజ సంపదను దోచుకోవాలని అమెరికా ప్రయత్నాలు మమ్మురం చేసింది. ఇందులో భాగంగా రహస్యంగా ఓ ప్రభుత్వ విభాగాన్ని సైతం అమెరికా ఏర్పాటు చేసినట్లు సమాచారం. చంద్రుడ్ని ఎలా పేల్చివేయాలనే దానిపై పరిశోధనలకు దాదాపు వందల కోట్లు ఖర్చు చేసినట్లు గుసగుసలు. ఆ రహస్య విభాగం …
Read More »