కాంగ్రెస్, బీజేపీ పాలనలో దేశంలో ఎవరూ సంతోషంగా లేరని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నా ఇప్పటికే సాగునీరు, తాగునీరు, విద్యుత్ కోసం ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని చెప్పారు. బెంగళూరులో జనతాదళ్ (ఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామితో ఆయన భేటీ అయ్యారు. వారి నివాసంలో మధ్యాహ్న భోజనం చేశారు. ఆ తర్వాత వివిధ …
Read More »మాజీ సీఎం బీఎస్ యడియూరప్పకు బీజేపీ షాక్
కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్పకు బీజేపీ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. వయోభారాన్ని కారణంగా చూపి ఏడాది కిందట ఆయనను గద్దె దింపిన పార్టీ అధిష్ఠా నం తాజాగా ఆయన చిన్నకుమారుడు విజయేంద్రకు ఎమ్మెల్సీ టికెట్ నిరాకరించింది. వారసత్వ రాజకీయాలకు చోటులేదని ప్రధాని మోదీ కుండబద్దలు కొట్టిన తరుణంలోనే అధిష్ఠానం కర్ణాటక పార్టీ అగ్రనేతకు ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు పంపిందని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం యడియూరప్ప …
Read More »దళిత వ్యక్తి నమిలిన ఆహారాన్ని తిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే!
కులవివక్షకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వింత ప్రయత్నం చేశారు. దళిత పూజారి స్వామి నారాయణ్ నమిలిన ఆహారాన్ని ఆయన తిని అందర్నీ ఆశ్చర్య పరిచారు. ఈ ఘటన కర్ణాటకలోని చామరాజపేటలో చోటుచేసుకుంది. అక్కడ నిర్వహించిన అంబేడ్కర్ జయంతి, ఈద్ మిలాన్ ఉత్సవాల్లో స్వామి నారాయణ్కు ఎమ్మెల్యే జమీర్ఖాన్ తన చేతితో ఆహారం తినిపించారు. ఆ తర్వాత స్వామి నారాయణ్ ఎమ్మెల్యేకు ఆహారం తినిపించబోతే …
Read More »కొవ్వు తీయించుకోవాలని చేసిన సర్జరీ ఫెయిల్.. హీరోయిన్ మృతి
మరింత అందంగా కనిపించాలని ప్రయత్నించిన ఓ యంగ్ హీరోయిన్ జీవితం అనూహ్యంగా ముగిసిపోయింది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. కొవ్వు తీయించుకునేందుకు జరిగిన సర్జరీ ఫెయిల్ కావడంతో 21 ఏళ్ల కన్నడ నటి చేతనరాజ్ మృతిచెందింది. సర్జరీ తర్వాత అనారోగ్య సమస్యలు రావడంతోనే తమ కుమార్తె చనిపోయినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్లాస్టిక్ అనంతరం చేతనకు లంగ్స్లో వాటర్ చేరడంతో హార్ట్ ఎటాక్ వచ్చి చేతన మృతిచెందినట్లు తెలుస్తోంది. వైద్యుల …
Read More »వాకింగ్ వెళ్తుండగా యాక్సిడెంట్.. సినీ నిర్మాత మృతి
వాకింగ్కు వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగి ఓ సినీ నిర్మాత మృతచెందారు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. కన్నడ సినీ నిర్మాత బాల్ రాజ్ వాకింగ్ చేసేందుకు జేపీ నగర్లోని తన ఇంటి నుంచి బయల్దేరారు. వాకింగ్ చేసేందుకు తన కారు ఆపి రోడ్డు దాటుతుండగా అటుగా వెళ్తున్న ఓ వెహికల్ ఆయన్ను ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స …
Read More »కర్ణాటకలో ఆ ప్రాజెక్టుల పర్మిషన్ నిలిపేయండి: తెలంగాణ అభ్యంతరం
అంతర్రాష్ట్ర అంశాలు, ట్రైబ్యునల్ గతంలో ఇచ్చిన తీర్పులను పరిగణనలోకి తీసుకోకుండా కర్ణాటకలోని ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వొద్దని కేంద్రం జలసంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. కర్ణాటకలో చేపడుతున్న అప్పర్తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టుల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ రెండు ప్రాజెక్టులకు ఇచ్చిన పర్మిషన్ను నిలిపివేయాలని విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు తెలంగాణ ఇంజినీర్ ఇన్చీఫ్ (ఈఎన్సీ) మురళీధర్ లేఖ రాశారు. కర్ణాటకకు అనుమతిస్తే తుంగభద్ర నుంచి కృష్ణాకు …
Read More »వైరల్ అవుతున్న మంత్రి కేటీఆర్ ట్వీట్
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇటీవలి కాలంలో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలపై విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే బీజేపీ నేతలనుద్దేశించి.. ‘‘రాజకీయ పర్యాటకులు వస్తుంటారు.. పోతుంటారు.. సీఎం కేసీఆర్ ఇక్కడే ఉంటారు’’ అని ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్… తాజాగా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.కర్నాటకలో సీఎం కావాలంటే రూ.2500 కోట్లు అడుగుతున్నారట అని ఎద్దేవా …
Read More »బండి సంజయ్.. ఆర్డీఎస్ ఎలా పూర్తిచేస్తావో చెప్పగలవా?: నిరంజన్రెడ్డి సవాల్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీం) కొన తెలియదు.. మొన తెలియదని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఎద్దేవా చేశారు. ఆరునెలల్లో ఆర్డీఎస్ ఎలా పూర్తిచేయగలవో కాగితంపై రాసిస్తావా అని సంజయ్కు మంత్రి సవాల్ విసిరారు. ఎక్కడి నుంచి నిధులు తెస్తోవో చెప్పగలవా? అని ప్రశ్నించారు. కర్ణాటకను ఒప్పించి ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు సాగునీరు తెచ్చే దమ్ముందా? అని నిలదీశారు. పాలమూరు ఎత్తిపోతల …
Read More »‘కేజీఎఫ్’ థియేటర్లో ‘సీటు’ గొడవ.. ప్రేక్షకుడి కాల్పులు
కేజీఎఫ్ఛాప్టర్2 ప్రదర్శిస్తున్న థియేటర్లో అనూహ్య ఘటన చోటుచేఉకుంది. ఇద్దరు యువకులు థియేటర్లో సీటు కోసం గొడవ పడ్డారు. ఈ క్రమంలో అందులోని ఓ వ్యక్తి తుపాకీతో ఎదుటి వ్యక్తిపై కాల్పులు జరిపాడు. వివరాల్లోకి వెళితే కర్ణాటకలోని హవేరి జిల్లా షిగ్గాన్లోని ఓ థియేటర్లో కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా నడుస్తోంది. మంగళవారం రాత్రి ఓ యువకుడు ముందు సీటుపై కాలుపెట్టి చూస్తుండగా.. అందులో కూర్చొన్న వ్యక్తి సీరియస్ అయ్యాడు. దీంతో …
Read More »ఫ్యాన్స్కి చిరు ‘ఆచార్య’ సర్ప్రైజ్
ప్రముఖ నటుడు చిరంజీవి నటించిన ‘ఆచార్య’ మూవీ టీమ్ ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చింది. ఈనెల 29 ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం 5.49 గంటలకు ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేయనున్నారు. అయితే ఈ ట్రైలర్ను ఎప్పటిలాగే యూట్యూబ్లోనే కాకుండా ఏకకాలంలో 152 థియేటర్లలోనూ రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేసింది. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడులోని మొత్తం 152 థియేటర్లలో …
Read More »