శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కివీస్ బ్యాటర్లు ఆది నుంచే దూకుడుగా ఆడారు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. టిమ్ సీఫెర్ట్ 48 బంతుల్లో 88 రన్స్ చేశాడు.. మరోవైపు లాథమ్ 31, చాడ్ బోవ్స్ 17, చాప్టాన్ 16, డారిల్ మిచెల్ 15 రన్స్ చేశారు. తాజా విజయంతో కివీస్ 2-1 తేడాతో సిరీస్ …
Read More »మిథాలీరాజ్ అరుదైన రికార్డులు
కివీస్ తో జరిగిన రెండో వన్డేలో భారత క్రికెటర్ మిథాలీరాజ్ అరుదైన రికార్డులు సాధించింది. తన కంటే 21 ఏళ్ల చిన్నదైన రిచాఘోష్తో కలిసి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పింది. మిథాలీ మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన 4ఏళ్లకు రిచా జన్మించింది. అలాగే 20ఏళ్ల కెరీర్ పూర్తయిన మొదటి మహిళా క్రికెటర్, కివీస్పై అత్యధిక హాఫ్ సెంచరీలు, రన్స్ చేసిన భారత కెప్టెన్ రికార్డులు నెలకొల్పింది. ధోనీ, కోహ్లి రికార్డులను బద్దలుకొట్టింది.
Read More »T20 World Cup Final కి ముందు కివీస్ కు పెద్ద షాక్
T20 ప్రపంచ కప్ ఫైనల్ కు ముందు న్యూజిలాండు పెద్ద షాక్ తగిలింది. కివీస్ వికెట్ కీపర్ Batsmen డెవాన్ కాన్వే జట్టుకు దూరమయ్యాడు. ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో స్టంప్ ఔటైన తర్వాత కాన్వే చేతితో బ్యాట్ ను గట్టిగా గుద్దాడు. దీంతో అతని అరచేతి ఎముక విరిగింది. ఫలితంగా అతను ఆస్ట్రేలియాతో జరిగే ఫైనల్తో పాటు ఇండియా టూరూ దూరమయ్యాడు. ఇప్పటికే ఆ జట్టు పేసర్ …
Read More »వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్-రిజర్వ్ డే-ఎందుకంటే..?
ఈరోజు భారత్, న్యూజిలాండ్ మధ్య వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ ప్రారంభంకానున్నది. సౌతాంప్టన్లోని ఏజియల్ బౌల్ స్టేడియంలో ఈ ఫైనల్ మ్యాచ్కు అంతా సన్నద్దమైంది. నిజానికి ఈ ఫైనల్ మ్యాచ్.. లార్డ్స్ మైదానంలో జరగాల్సి ఉంది. కానీ మహమ్మారి కరోనా వల్ల వేదికను సౌతాంప్టన్కు మార్చారు. దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత టెస్ట్ చాంపియన్షిప్ చివరి మజిలీకి చేరింది. 2019లో ఈ చాంపియన్షిప్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. 9 జట్లతో …
Read More »పృథ్వీ షా ఔట్..గిల్ ఇన్..?
న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ నిరాశజనక ప్రదర్శన చేస్తున్న సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్లో కేవలం 165 పరుగులకు కుప్పకూలిన టీమిండియా.. ప్రత్యర్థిని త్వరగా ఆలౌట్ చేయలేకపోయింది. దీంతో 348 పరుగులు చేసిన కివీస్.. కీలకమైన 183 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇక రెండో ఇన్నింగ్స్లోనూ భారత బ్యాటింగ్ లైనప్ గాడిన పడలేదు.మూడోరోజు ఆటముగిసేసరికి 144/4తో నిలిచింది. ఇంకా ప్రత్యర్థి కంటే 39 పరుగుల వెనుకంజలో ఉంది. టాపార్డర్లో …
Read More »ప్రపంచంలోనే ఏకైక క్రికెటర్ టేలర్
కివీస్ సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టీమిండియాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ రాస్ టేలర్ కెరీర్ లో వంద మ్యాచ్ కావడం విశేషం. దీంతో అన్ని ఫార్మాట్ల(టెస్టులు,వన్డేలు,టీ20)లో వంద మ్యాచులు ఆడిన ఏకైక క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలో మరే క్రికెటర్ ఈ ఘనతను సాధించలేదు. ఇప్పటివరకు టెస్టుల్లో 7174పరుగులు చేశాడు. ఇందులో 19సెంచరీలు… 33హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Read More »కివీస్ గడ్డపై మయాంక్ రికార్డు
వెల్లింగ్టన్ వేదికగా ఈ రోజు శుక్రవారం కివీస్ తో టీమిండియా తొలి టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి విదితమే. అయితే వర్షం అడ్డు రావడంతో తొలి రోజు మ్యాచ్ ను అంపెర్లు నిలిపేశారు. ఈ క్రమంలో కివీస్ తో తొలి టెస్టు మ్యాచులో భారత్ ఓపెనర్ మయాంక్ అరుదైన క్లబ్ లో చేరాడు. కివీస్ గడ్డపై తొలి సెషన్ మొత్తం బ్యాటింగ్ చేసిన రెండో టీమిండియా ఓపెనర్ గా నిలిచాడు. …
Read More »ఇషాంత్ రీఎంట్రీ
కివీస్ తో జరగనున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ నెల పదిహేనో తారీఖున నేషనల్ క్రికెట్ అకాడమీలో జరగనున్న ఫిటినెస్ టెస్ట్ కు ఇషాంత్ శర్మ హజరు కానున్నాడు. ఒకవేళ ఈ టెస్ట్ లో ఇషాంత్ శర్మ నెగ్గుతాడు అని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరపున ఆడుతున్న ఇషాంత్ శర్మ జనవరి ఇరవై ఒక్కటో తారీఖున …
Read More »14వేల క్లబ్ లో రోహిత్
టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి పద్నాలుగు వేల పరుగులను సాధించిన ఆటగాడిగా పేరు లిఖించుకున్నాడు. కివీస్ తో జరుగుతున్న ఐదో టీ20లో ముప్పై ఒకటి వ్యక్తిగత పరుగుల దగ్గర రోహిత్ ఈ ఫీట్ ను అందుకున్నాడు. దీంతో పద్నాలుగు వేల పరుగులను పూర్తి చేసిన ఎనిమిదో ఆటగాడిగా రికార్డును లిఖించుకున్నాడు. అయితే అత్యధిక పరుగులు …
Read More »ఈడెన్ లో పరుగులే పరుగులు
టీమిండియా, కివీస్ జట్ల మధ్య రెండో టీ20 ఈ రోజు ఆదివారం ఈడెన్ పార్క్ మైదానంలో జరగనున్నది. ఇటీవల జరిగిన తొలి టీ20లో పరుగుల సునామీను సృష్టించిన ఇరు జట్లు ఈ మ్యాచులో కూడా అదే సునామీని కోనసాగించవచ్చు అని పిచ్ క్యూరెటర్ పేర్కొన్నారు. అయితే ఈ మౌఇదానం బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండటం.. మైదానం చాలా చిన్నాది కావడంతో పరుగుల వరద ఖాయం అంటున్నారు విశ్లేషకులు. మొదట ఏ …
Read More »