కేంద్ర అసమర్థ ఆర్థిక విధానాలతో దేశం అన్నింటా వెనుకబడి పోతున్నదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ద్రవ్యోల్బణం అదుపు తప్పిందని మండిపడ్డారు. రాష్ర్టాల హక్కులను కాలరాస్తూ, నిధులన్నీ కేంద్రానికి తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెస్లు, సర్చార్టీల పేరుతో రాష్ర్టాల కడుపు కొడుతున్నారని ధ్వజమెత్తారు. రాజ్యసభలో మంగళవారం కేటాయింపుల బిల్లుపై కేశవరావు మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. అన్ని …
Read More »సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం
సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ సింగర్ కేకే పేరొందిన కృష్ణకుమార్ కున్నత్ (53) హఠాన్మరణం చెందారు. కోల్కతాలో బుధవారం రాత్రి సంగీత ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాత హోటల్కు చేరుకున్న తర్వాత గదిలోనే కుప్పకూలినట్లు సమాచారం. ఆ తర్వాత ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు సీఎంఆర్ఐ దవాఖాన వైద్యులు పేర్కొన్నారు.
Read More »TRS Mp కె. కేశవరావు కి కరోనా
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు కరోనా బారినపడ్డారు. RTPCR పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. వెంటనే ఆయన నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించారు. వారి సలహా మేరకు ఇంటికి వెళ్లి క్వారంటైన్లో ఉన్నారు.
Read More »తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు
తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి కలిసి టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహం, ఆచార్య జయశంకర్ విగ్రహానికి కేకే పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం కే కేశవరావు మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అకుంఠిత కార్యదీక్షతో గాంధేయ మార్గంలో తెలంగాణ ఉద్యమాన్ని …
Read More »గ్రేటర్ మేయర్ మద్ధతుదారులకు రూ.6లక్షలు జరిమానా
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కొత్త మేయర్గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె మద్దతుదారులు పలువురు నగరంలో పలుచోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అనధికారికంగా వాటిని ఎలా పెడతారంటూ నెటిజన్లు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో జీహెచ్ఎంసీ అధికారులు స్పందించారు. ఈవీడీఎం విభా గం శనివారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తించారు. మొత్తం 30 …
Read More »పీవీ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్సీ కవిత నివాళి
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 16వ వర్ధంతి సందర్భంగా నెక్లెస్రోడ్డులోని పీవీ జ్ఞానభూమిలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. ఆమెతో పాటు పీవీ కుమార్తె శ్రీవాణి, కుమారుడు పీవీ ప్రభాకర్ రావు ఉన్నారు. పీవీ జ్ఞానభూమి వద్ద నివాళులర్పించిన వారిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ కేశవరావు, హోంమంత్రి మహముద్ అలీతో పాటు పలువురు నాయకులు ఉన్నారు. పీవీ …
Read More »పార్లమెంట్ స్టాండింగ్ కమిటీల్లో టీఆర్ఎస్ ఎంపీలు
పార్లమెంట్లో వివిధ స్టాండింగ్ కమిటీలను పునర్నియమించారు. ఈ పునర్నియామకాల్లో పలువురు టీఆర్ఎస్ ఎంపీలకు చోటు లభించింది. పరిశ్రమల స్టాండింగ్ కమిటీ చైర్మన్గా రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు నియమితులయ్యారు. ఎంపీ సంతోష్కుమార్ను రైల్వే స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా నియమించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్స్ అండ్ క్లైమేట్ చేంజ్ కమిటీలో సభ్యుడిగా కొత్త ప్రభాకర్ రెడ్డికి స్థానం కల్పించారు. కెప్టెన్ లక్మీకాంతరావును డిఫెన్స్ కమిటీ సభ్యుడిగా నియమించారు. సిబ్బంది, …
Read More »లాక్ డౌన్ పొడగింపునకు మించిన మార్గం లేదు
కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి లాక్ డౌన్ పొడగింపునకు మించిన మార్గం లేదు భారత ప్రభుత్వం, అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేస్తూ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఎంతో బాగున్నాయి కరోనా కట్టడి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటల పాటు కష్టపడుతున్నారు లాక్ డౌన్ వల్ల కష్టనష్టాలున్నప్పటికీ ఇది తప్పని చర్య. ప్రతికూల పరిస్థితుల్లో ఇదే ఉత్తమమైన మార్గం. మనం ఒకసారి …
Read More »టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు వీరే..
తెలంగాణలోని రెండు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలకు టిఆర్ఎస్ అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు డాక్టర్ కె.కేశవరావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్ రెడ్డిలను తమ అభ్యర్థులుగా ప్రకటించారు. టిఆర్ఎస్ అభ్యర్థులిద్దరూ శుక్రవారం తమ నామినేషన్లు దాఖలు చేస్తారు. తమను రాజ్యసభ అభ్యర్థులుగా నిర్ణయించినందుకు కేశవరావు, సురేష్ రెడ్డి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. వీరిద్దరినీ ముఖ్యమంత్రి అభినందించారు.
Read More »తెలంగాణలో త్వరలో రాజ్యసభ స్థానాలు ఖాళీ
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నయి. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఏకంగా ఎనబై మూడు స్థానాలను దక్కించుకుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోన్న పలు సంక్షేమాభివృద్ధి పథకాలకు ఆకర్శితులై ఏకంగా ఇరవై రెండు మంది ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గూటికి చేరారు. దీంతో ప్రతిపక్ష పార్టీలకు రాజ్యసభ …
Read More »