కర్నూల్ జిల్లా నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి ముఖ్య అనుచరుడు, టీడీపీ మాజీ కౌన్సిలర్ ముడియం కొండారెడ్డి పెద్ద కుమారుడు (తార్నాక్) తెలంగాణ నుంచి భారీ గా మద్యం తరలిస్తూ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఏపీ 21 ఏఎఫ్ 3336 స్విఫ్ట్ డిజైర్ కారులో జోగులాంబ–గద్వాల జిల్లా అలంపూర్ వద్ద ఉన్న మద్యం దుకాణం నుంచి 11 కేస్ల మద్యం (132 ఫుల్బాటిళ్లు) కొనుగోలు చేసి తార్నాక్ …
Read More »రాంగ్ నంబర్ డయల్..పాకిస్థాన్ వ్యక్తి, కర్నూలు మహిళ ప్రేమ
ఇండియా నుంచి పాకిస్థాన్లోని పంజాబ్ రాష్ట్రం సియాల్ కోట్కు 4–5 నెలలుగా తరచూ ఫోన్లు వెళుతున్నాయి. దీనిపై కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు దృష్టి సారించారు. ఫోన్లు ఎక్కడి నుంచి వెళుతున్నాయని ఆరా తీయగా.. కర్నూలు నుంచి అని తేలింది. సెల్ టవర్ సిగ్నల్స్ ఆధారంగా గడివేముల వాసి షేక్ గుల్జార్ ఖాన్.. పాక్కు ఫోన్ చేస్తున్నట్టు గుర్తించారు. అతను నెల కిందటే పాస్పోర్టు తీసుకోవడం, పది రోజులుగా మరీ ఎక్కువగా …
Read More »కర్నూలు జిల్లాలో చంద్రబాబు ముందే టీడీపీ నేతలు వాగ్వాదం
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా సోమవారం నుంచి మూడురోజులపాటు కర్నూలు చంద్రబాబు పర్యటన సాగిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా నేతలతో సమీక్షలు నిర్వహించి భవిష్యత్ వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. తొలిరోజు ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, డోన్, నందికొట్కూరు నియోజకవర్గాల నేతలతో సమీక్ష నిర్వహించారు. రెండవ రోజు ఆళ్లగడ్డ, కోడుమూరు, ఆలూరు, పత్తికొండ, నంద్యాల నేతలతో విడివిడిగా చర్చించారు. నేడు బనగానపల్లె, పాణ్యం, శ్రీశైలం, కర్నూలు నియోజకవర్గాల నేతలతో …
Read More »నిజం చెబితే బాగుండదమ్మా.. చెప్పలేనంటూ కన్న కూతురు..ఆ నిజం మీకు తెలిస్తే
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రే కాలయముడయ్యాడు. కుమారుడు అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లడంతో భార్య, బంధువులను అక్కడికి పంపించి.. ఇంట్లో ఒంటరిగా ఉన్న కుమార్తెపై రెండు రోజుల పాటు అత్యాచారం చేశాడు. ఈ ఘటన కర్నూల్ జిల్లా బనగానపల్లె మండలం పల్లెజిల్లెల్ల గ్రామంలో చోటుచేసుకుంది. బాధితురాలి తల్లి కథనం మేరకు.. పల్లెజిల్లెల్ల గ్రామానికి చెందిన వ్యక్తికి కుమారుడు, కుమార్తె సంతానం. కుమార్తె నంద్యాలలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం …
Read More »చంద్రబాబుకు కర్నూలులో ఇద్దరు షాక్..మధ్యలోనే అలిగి వెళ్లిపోయిన నేతలు
టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలులో నిర్వహిస్తున్న నియోజకవర్గాల సమీక్ష సమావేశాలను కొందరు ఆ పార్టీ నేతలు లైట్గా తీసుకున్నారు. నందికొట్కూరు, కోడుమూరు నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బండి జయరాజు, రామాంజనేయులు డుమ్మా కొట్టారు. అలాగే కోడుమూరు నియోజకవర్గ నేత విష్ణువర్ధన్రెడ్డి మధ్యలోనే అలిగి వెళ్లిపోయారు. గతంలో ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జ్గా పనిచేసిన వీరభద్రగౌడ్ హాజరు కాలేదు. నగర శివారులోని వీజేఆర్ కన్వెన్షన్ హాలులో రెండో రోజు మంగళవారం …
Read More »అమెరికా డ్రోన్ తయారీ కంపెనీ..ఇక ఆంధ్రలో కూడా..?
అమెరికాకు చెందిన ప్రముఖ డ్రోన్ తయారీ కంపెనీ డీజేఐ రాష్ట్రంలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నది. డ్రోన్లపై జరుగుతున్న పరిశోధనలకు గాను నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో డ్రోన్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ సీఈవో ఆళ్ల రవీంద్ర రెడ్డి తెలియజేసారు. డ్రోన్ టెక్నాలజీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఇన్వెస్ట్మెంట్ పాలసీని ప్రవేశపెట్టే ఉద్దేశంలో ఉన్నట్లు తెల్పారు పెట్టుబడులను ఆకర్షించడం కోసం …
Read More »కర్నూల్ జిల్లాలో భర్తకు విషం ఇచ్చిన కేసులో..ఎవరూ ఊహించని మలుపు
కొత్త పెళ్లి కూతురు భర్తను చంపేందుకు నిజంగా ప్రయత్నం చేసిందా? మజ్జిగలో నవవధువు పురుగుల మందు కలిపిందా? అదే నిజమైతే ఆ యువతి భర్తతోపాటే ఆసుపత్రికి ఎందుకు పరుగులు తీస్తుంది? నిజంగా చంపే ఉద్దేశం ఉంటే మజ్జిగలోనే ఎందుకు విషం కలుపుతుంది? పెళ్లైన వారానికే మజ్జిగలో విషం కలిపిందంటూ వెలుగులోకి వచ్చిన కేసుకు సంబంధించి యువతి కుటుంబసభ్యులు అడుగుతున్న ప్రశ్నలివి. మొత్తం వ్యవహారాన్ని గమనిస్తే ఆ కొత్త పెళ్లికొడుకే వివాహబంధం …
Read More »కర్నూలు జిల్లా జొన్నగిరి గ్రామంలో పెళ్లైన వారానికే పాలల్లో భర్తకు విషం కలిపి ఇచ్చిన భార్య
కర్నూల్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లైన వారం రోజులు కూడా గడవక ముందే తన వైవాహిక జీవితానికి ఓ నవ వధువు స్వస్తి పలకాలనుకుంది. అత్తవారి ఇంటికి వచ్చిన భార్య.. భర్తకు విషం ఇచ్చిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామానికి చెందిన లింగమయ్యకు వారం రోజుల క్రితం మదనంతపురం గ్రామానికి చెందిన నాగమణితో వివాహం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు …
Read More »కర్నూల్ జిల్లాలో జగన్ దెబ్బకు టీడీపీ నేతలు రాజకీయాలకు గుడ్ బై
వైసీపీ పార్టీ రాయలసీమలో అత్యంత బలంగా ఉన్న జిల్లాల్లో కర్నూలు ఒకటి. కడప జిల్లా తర్వాత అత్యంత బలమైన నాయకత్వం, కేడర్ ఆ పార్టీ సొంతం. ఇదే క్రమంలో టీడీపీ అత్యంత బలహీనంగా ఉండే జిల్లాల్లో కూడా కడప తరువాత కర్నూలే! 2019 ఎన్నికల ఫలితాలు కొందరి రాజకీయ జీవితానికి ముగింపు పలకగా, మరికొందరు పార్టీ భవిష్యత్తుపై నమ్మకం కోల్పోయి ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఎన్నికలు ముగిసి 7 …
Read More »సాక్షాత్తూ తహసీల్దార్ ముందే చెప్పులతో దాడి చేసుకున్నఇద్దరు వీఆర్వోలు
గ్రామస్థాయిలో ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాల్సిన వీఆర్వోలు విచక్షణ మరిచారు. తాము ప్రభుత్వ ఉద్యోగులం అన్న మాట మరచి వీధి రౌడీల్లా మారిపోయారు. యుష్టి యుద్ధానికి దిగారు.. చెప్పులతో దాడి చేసుకున్నారు. కోపోద్రిక్తుడైన ఓ వీఆర్వో.. చెవి కొరికి కక్ష తీర్చుకున్నాడు. ఆదివారం ఉదయం కర్నూలు తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కర్నూలు మండలం సుంకేసుల వీఆర్వోగా వేణుగోపాల్ రెడ్డి కొనసాగుతున్నాడు. ఈయనకు వెబ్ల్యాండ్లో ఆన్లైన్ నమోదు చేసే …
Read More »