భారత ఆర్మీ చీఫ్గా జనరల్ మనోజ్ పాండే శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ భారత ఆర్మీ చీఫ్గా బాధ్యతల్లో వున్న జనరల్ ఎం.ఎం. నరవాణే శనివారం పదవీ విరమణ చేశారు. మూడేళ్ల పాటు పాండే ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇప్పటి వరకూ జనరల్ మనోజ్ పాండే ఆర్మీకి ఉప చీఫ్గా పనిచేసిన విషయం తెలిసిందే.కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ నుంచి మొదటి సారిగా ఆర్మీ చీఫ్గా ఎన్నిక కావడం ఇదే …
Read More »గుజరాత్ లో రూ. 450 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
గుజరాత్ తీరంలోని పిపావావ్ పోర్టులో దాదాపు 90 కిలోగ్రాముల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.450 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇరాన్ నుంచి ఆమ్రేలి జిల్లాలోని పిపావావ్ పోర్టుకు చేరుకున్న ఓ షిప్పింగ్ కంటెయినర్ నుంచి ఈ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల నుంచి తప్పించుకునేందుకు డ్రగ్స్ అక్రమ రవాణాదారులు ప్రత్యేక పద్ధతి అవలంబించారని డీజీపీ అశిష్ భాటియా తెలిపారు. హెరాయిన్ ఉన్న ద్రావణంలో దారాలను నానబెట్టి, …
Read More »RJD నేత తేజ్ ప్రతాప్ సంచలన ప్రకటన
బీహార్ రాష్ట్ర మాజీ మంత్రి,ఆర్జేడీ పార్టీకి చెందిన సీనియర్ ప్రముఖ నేత తేజ్ ప్రతాప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా త్వరలోనే ఆర్జేడీ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ఆయన సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే దీని గురించి తన తండ్రి.. మాజీ ముఖ్యమంత్రి లాల్ ప్రసాద్ యాదవ్ తో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. చర్చించిన తర్వాత తన రాజీనామా పత్రాన్ని ఆయనకు ఇవ్వనున్నట్లు కూడా ఈ …
Read More »దేశంలో కొత్తగా 2,541 కరోనా కేసులు
గడిచిన ఇరవై నాలుగంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 2,541 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,60,086కు చేరాయి. ఇందులో 4,25,21,341 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,22,223 మంది మృతిచెందగా, 16,522 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక కొత్తగా 30 మంది మహమ్మారికి బలవగా, 1862 మంది వైరస్ నుంచి బయటపడ్డారు.
Read More »దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కలవరం
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 1,094 కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం ఢిల్లీలో యాక్టివ్ కేసులు 3,705కు చేరుకున్నాయి. పాజిటివిటీ రేటు 4.82 శాతానికి చేరింది. ఈనెల 11న 601గా ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పుడు 3,705కి చేరింది. పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రభుత్వం అప్రమత్తమైంది. బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆదేశించింది.
Read More »పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ సంచలన నిర్ణయం
పంజాబ్ రాష్ట్ర సీఎం భగవంత్ సింగ్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్రంలోని 184 మంది ప్రముఖుల భద్రతను వెనక్కి తీసుకుంటూ ఆదేశాలు జారీ చేయగా.. ఇందులో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కొందరు ప్రైవేట్ వ్యక్తులు కూడా ఉన్నారు. మాజీ సీఎం చన్నీ కుటుంబ సభ్యులకు సైతం భద్రతను ఉపసంహరించగా.. సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులున్న వారికి మాత్రమే భద్రతను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.
Read More »మూడు రోజుల్లో పెళ్లి.. అత్త, ఆడపడుచుకు మత్తు మందు ఇచ్చి వధువు పరార్
సినిమాలోని కక్షపూరిత సన్నివేశాన్ని తలపించే ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. మరో మూడురోజుల్లో పెళ్లి ఉండగా కాబోయే అత్త, ఆడపడుచుకు పెళ్లికుమార్తె టీలో మత్తు మందు కలిపి ఇచ్చేసి ఆ ఇంట్లోని డబ్బుతో ఉడాయించింది. మధ్యప్రదేశ్లోని మందసౌర్ ప్రాంతంలో ఉంటున్న ఓ కుటుంబంలోని వ్యక్తికి వయసు అయిపోతున్నా పెళ్లికాకపోవడంతో ఆ కుటుంబసభ్యులు ఓ మహిళను సంప్రదించారు. ఆమె రూ.2లక్షలు తీసుకుని ఆర్తిబింద్ అనే అమ్మాయితో పెళ్లి సంబంధం కుదిర్చింది. మరో మూడు …
Read More »విరాళాల సేకరణలో బీజేపీ మరో రికార్డు
గత ఏడాది పార్టీలకు అందిన విరాళాల విషయంలో కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీ మరో రికార్డు నెలకొల్పింది. దేశవ్యాప్తంగా ప్రధానమైన 12 పార్టీలకు రూ.258 కోట్ల వరకు విరాళాలు అందగా.. అందులో ఒక్క బీజేపీ కే రూ.212 కోట్లు డొనేషన్లు అందాయి. మొత్తం విరాళాలలో ఇది 82 శాతం కావడం విశేషం. రెండో స్థానంలో రూ.27 కోట్లతో (10.45 %) జేడీయూ నిలిచింది. ఇక కాంగ్రెస్, ఎన్సీపీ,ఏఐడీఎంకే, డీఎంకే, …
Read More »దేశంలో కరోనా డేంజర్ బెల్స్
దేశంలో రోజురోజుకు కొత్తగా కరోనా కేసుల నమోదు సంఖ్య పెరిగిపోతుంది. ఈ క్రమంలో గడిచిన ఇరవై నాలుగంటల్లో మొత్తం కొత్తగా మరో 2451 మంది కరోనా బారినపడినట్లు దేశ వ్యాప్తంగా నిర్వర్తించిన కరోనా పరీక్షల్లో తేలింది. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా మొత్తం కేసుల సంఖ్య 4,30,52,425కు చేరాయి. ఇందులో నుండి మొత్తం 4,25,16,068 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,22,116 మంది కరోనా మహమ్మారిన పడి …
Read More »యాక్టివాకి ఫ్యాన్సీ నంబర్.. ఎంత పెట్టి కొన్నాడో తెలుసా?
మూమూలుగా అయితే కార్లకి, మొబైల్ ఫోన్కి ఫ్యాన్సీ నంబర్లు ఉండాలని చాలా మంది కోరుకుంటారు. ఎవరి స్థాయి బట్టి వారు ఖర్చును భరించి తమకు కావాల్సిన నంబర్ల కోసం ప్రయత్నాలు చేసుకుంటారు. ఆటో, బైక్ తదితర చిన్న వాహనాలకు ఫ్యాన్సీ నంబర్ కావాలని ఎవరూ దాదాపుగా పట్టుబట్టరు. కానీ.. చండీగఢ్లో ఓ వ్యక్తికి ‘ఫ్యాన్సీ’ కిక్ ఉండటంతో భారీ మొత్తంలో చెల్లించి అనుకున్న నంబర్ను సొంతం చేసకున్నాడు. ఇంతకీ ఫ్యాన్సీ …
Read More »