Home / Tag Archives: pv narasinharao

Tag Archives: pv narasinharao

పీవీకి ఘన నివాళులు అర్పించిన మంత్రి పువ్వాడ.

మాజీ ప్రధాని పివి నర్సింహారావు గారి జయంతిని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా కేంద్రంలోని లకారం సర్కిల్ నందు పివి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు.పివి శత జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజలందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.వారి విగ్రహాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సూచనల మేరకు గత ఏడాది ఖమ్మం జిల్లా కేంద్రంలో మొదటిగా …

Read More »

రెండు కండ్లు ఒకే చూపు – తెలంగాణ ముద్దుబిడ్డలు పీవీ, కేసీఆర్‌

తెలంగాణ ముద్దు బిడ్డలలో ఒకరు దేశ ప్రధానిగా చరిత్ర సృష్టిస్తే మరొకరు ఉద్యమ నాయకుడిగా విజయం సాధించి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చరిత్రాత్మక పాత్ర నిర్వహిస్తున్నారు. రాజకీయ నేపథ్యాలు, నిర్వహించిన పదవులు వేరైనా ఇరువురి ఆలోచనల్లో, కార్యాచరణలో సారూప్యం ఉన్నది. ఇరువురి ఆకాంక్ష పేదల కన్నీరు తుడవడమే. వివిధ సందర్భాలలో ప్రధానిగా పీవీ ప్రసంగాలు, ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఆచరణ గమనిస్తే, భావసారూప్యం ఎంతగా ఉందో తెలిసిపోతుంది. పీవీ ప్రధాని పదవి చేపట్టే …

Read More »

ఎమ్మెల్సీగా గెలిపిస్తే మీ గొంతుకనవుతా: ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి

ఎన్నికలప్పుడు ఏడాదికి కోటి ఉద్యోగాలిస్తామన్న బీజేపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విమర్శించారు. ఆరేండ్లు ఎమ్మెల్సీగా ఉన్న బీజేపీ అభ్యర్థి రాంచందర్‌ రావు ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎన్నో ఏండ్లుగా అమలుకాని ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులిచ్చామని చెప్పారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభీ వాణీదేవి, మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి సనత్‌నగర్‌లోని …

Read More »

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాణీ దేవి

తెలంగాణలో మార్చి 14న జరగనున్న రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ తమ  అభ్యర్థిని ఎంపిక చేశారు. అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం పీవీ నరసింహారావు కూతురు వాణీ దేవికి ఇవ్వాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ ఈ మేరకు ప్రగతి భవన్ లో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. వాణి గెలుపు కోసం శక్తి వంచన లేకుండా ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పారు. సమావేశం …

Read More »

పీవీ దేశ చ‌రిత్ర‌లో నిలిచిపోతారు : సీఎం కేసీఆర్

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 16వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ నివాళుల‌ర్పించారు. ఈ సందర్భంగా ఆయనను కేసీఆర్ స్మరించుకున్నారు. నిరంత‌ర‌ సంస్కరణ శీలిగా భారత దేశ చర్రిత్రలో పీవీ చిరస్థాయిగా నిలిచిపోతారని సీఎం అన్నారు. ఆర్థిక, విద్య, భూ పరిపాలన తదితర రంగాలలో పీవీ ప్రవేశపెట్టి, అమలు చేసిన సంస్కరణల ఫలితాన్ని నేడు భారతదేశం అనుభవిస్తున్నదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అంతర్గత భద్రత వ్యవహారాల్లోనూ, విదేశాంగ వ్యవహారాల్లోనూ మాజీ ప్ర‌ధాని …

Read More »

పీవీని అవమానించిన కాంగ్రెస్

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పుట్టుక నుంచి మరణించే వరకు ఒకే రాజకీయ పార్టీలో కొనసాగారని, ఆ పార్టీకి, దేశానికి ఎనలేని సేవ చేశారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. కానీ, పీవీ మరణానంతర పరిణామాలు హృదయవిదారకంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన ఢిల్లీలో మరణిస్తే.. పార్థివదేహాన్ని కనీసం ఏఐసీసీ కార్యాలయంలోకికూడా తీసుకెళ్లలేదని, తెలంగాణ బిడ్డ కావడం వల్లే ఆనాడు పీవీని కాంగ్రెస్‌ అవమానించిందని ఆరోపించారు. హైదరాబాద్‌కు తీసుకొచ్చి అంత్యక్రియలు …

Read More »

హెచ్‌సీయూకు పీవీ నరసింహారావు పేరు పెట్టాలి: ప్రధానికి సీఎం కేసీఆర్‌ లేఖ

ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఇవాళ్టి నుంచి జరుపుతున్నట్లు ప్రధాని నరేంద్రమోదీకి సీఎం కేసీఆర్‌ తెలియజేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. మునుపెన్నడూ లేని విధంగా కుదేలైపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను 1991లో సంస్కరణలను చేపట్టి పీవీ నరసింహారావు గాడిలో పెట్టారని ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ గుర్తు చేశారు. భరతమాత ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. అనేక ఇతర …

Read More »

ఆర్థిక సంస్కరణలు తప్పా పీవీ ఇంకా ఏమి చేశారంటే..?

దక్షిణ భారత దేశం నుండి తొలిసారిగా ప్రధాని పదవి చేపట్టిన పీవీ నరసింహారావు గారు దేశానికి ఏం చేశారు? ఆర్థిక సంస్కరణలు రూపొందించి అమలు చేసారు ఇంతేనా అనుకునే వాళ్ళ కోసం రాస్తున్న ఈ ఆర్టికల్. భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన అనంతరం దేశ ఆర్థిక వ్యవస్థ ఎలాంటి విధానాన్ని అనుసరించాలని నెహ్రు లాంటి పెద్దలు ఆలోచన చేసి మిశ్రమ ఆర్థిక విధానాన్ని అనుసరించాలని వ్యూహం రచించారు.. ఇక్కడ మిశ్రమ …

Read More »

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారి నిరాడంబరతను ఆదర్శంగా తీసుకోవాలి

సీఎం కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మాజీ ప్రధాని పివి నరసింహరావు గారి శత జయంతి ఉత్సవాలను ఎడాది పొడవునా ఘనంగా జరుపుకోవాలి.. – ఈ ఏడాది పివి నరసింహ రావు శత జయంతి సంవత్సరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది, రాష్ట్ర వ్యాప్తంగా పివి జయంతి ఉత్సవాలు జరుగుతాయి. – అన్ని జిల్లా కేంద్రాలలో విగ్రహాలు కూడా పెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. – కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు …

Read More »

పీవీ శతజయంతి వేడుకల్లో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య

భారత మాజీ ప్రధాని గౌరవ శ్రీ పి.వి. నరసింహారావు గారి శతజయంతి వేడుకల్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలి అని ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారి పిలుపు మేరకు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు సత్తుపల్లి లో శ్రీ పి.వి నరసింహారావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు మాట్లాడుతూ – సత్తుపల్లిలో నెలకొల్పబడుతున్న స్మృతి వనానికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat