మధ్యప్రదేశ్ లోని హోంషంగాబాద్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ధ్యాన్ చంద్ హాకీ పోటీల్లో పాల్గొనేందుకు ఇటార్సీకి వెళుతున్న నలుగురు జాతీయ హాకీ క్రీడాకారులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు క్రీడాకారులకు తీవ్ర గాయాలు కాగా, వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్సను అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. 69వ జాతీయ రహదారిపై రైసల్ పూర్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. …
Read More »ఏపీలో రోడ్డు ప్రమాదం ఇద్దరు విద్యార్ధులు మృతి
విజయనగరం జిల్లా రాంభద్రపురం మండలం ఆరికతోట వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్యాంకర్ లారీ మోటారు సైకిల్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు విద్యార్ధులు మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయలు అయ్యాయి. మృతులు వెంకటాపురం వాసులు. ఈమేరకు జాతీయ రహదారిపై గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గంట నుంచి జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.
Read More »ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..అక్కడికక్కడే 6 మంది మృతి..!
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల పెట్రోలు బంకువద్ద ఘోర రోడ్డు ప్రమాద ఘటన తీవ్ర విషాదం నింపింది. పెట్రోలు బంకు వద్ద ఆగి ఉన్న లారీని వ్యాను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని తాడేపల్లిగూడెం ఆస్పత్రికి తరలించారు. మరణించిన వారిలో ఇద్దరు భార్యాభర్తలు, మూడు సంవత్సరాల పాప తనూజతో …
Read More »రోడ్డు ప్రమాద బాధితులను నా కారులో తీసుకెళ్లండి.. మంత్రి అనిల్
నవ్యాంధ్ర రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కూమార్ యాదవ్ మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు సాయం అందించి నిజమైన ప్రజాసేవకుడిగా నిలిచారు. అమరావతిలో జరిగే సీఎం సమీక్ష సమావేశానికి ఉదయం నెల్లూరునుంచి బయలుదేరి వెళ్లారు అనిల్ కుమార్ యాదవ్. మార్గమధ్యంలో మేదర మెట్ల దగ్గర ఓ ప్రమాదం చూసి వెంటనే కాన్వాయ్ ని ఆపమన్నారు. ప్రమాదంలో గాయపడినవారిని చూసి చలించిపోయి తన కారులో వారిని వెంటనే ఆస్పత్రికి …
Read More »ఏపీలో వైసీపీ నేత మృతి
తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎదుర్లంకకు చెందిన వైసీపీ నేత వినోద్ వర్మ దుర్మరణం చెందారు. కె.గంగవరం మండలం పాతకోట వద్ద కారు అదుపు తప్పి డ్యామ్లో పడిపోయింది. యానం నుంచి కోటిపల్లి వెళుతుండగా ఈ ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాద సమాచారం తెలుసుకున్న ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More »కామారెడ్డిలో విషాదం
తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని భిక్కనూరు మండలం బస్వాపూర్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహానంపై వస్తున్న ఇద్దర్ని కారు ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది
Read More »అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..కమిషనర్తో సహా నలుగురు మృతి
అనంతపురం జిల్లా కణేకల్లు మండలం నల్లంపల్లి–వీరాపురం గ్రామాల మధ్య బసయ్యతోట సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ సహా మరో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ షేక్ ఇబ్రహీం సాహెబ్ ఎన్నికల విధుల్లో భాగంగా మంగళవారం ఉదయం …
Read More »ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..!
ఏపీలో ఈ మద్య రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. చాల మంది ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయి. రోడ్డన్ని రక్తంతో తడిసి ముద్ద అవుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలోని పోడూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడుకు వెళ్తున్న వ్యాన్ను లారీ ఢీకొట్టడంతో 5 మంది చనిపోయారు. మరణించినవారు తమిళనాడు వాసులుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. తమిళనాడులోని ధర్మపురికి చెందిన రామ్మూర్తి అనె వ్యక్తికి పక్షవాతం …
Read More »నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం..!!
తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలోని చింతపల్లి మండలం నసర్లపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం తెలిసిన పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.మృతులు..హైదరాబాద్ మహానగరంలోని టోలీచౌకీకి చెందిన మోహిన్, అక్బర్, ముస్తఫా, సద్దాం, సమ్మిగా గుర్తించారు. ప్రమాదం ఎలా జరిగిందంటే.. హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ వెళ్తున్న ఓ కారు నసర్లపల్లి దగ్గర అదుపుతప్పి బస్టాండ్ …
Read More »రోడ్డు ప్రమాదంలో 9 మందికి గాయాలు..!
16వ నెంబర్ జాతీయ రహదారిపై దెందులూరు మండలం సత్యనారాయణ పురం వద్ద ఆటోను కారు ఢీ కొన్న ప్రమాదంలో 9 మందికి గాయాలయ్యాయి. భీమడోలు మండలం గుండుగొలను గ్రామానికి చెందిన కూలీలు సత్యనారాయణపురంలో వరి నాట్లు వేయడానికి వెళ్లారు. జాతీయ రహదారి నుంచి సత్యనారాయణపురం వైపు మలుపు తిరుగుతున్న ఆటోను ఏలూరు నుంచి గుండుగొలను వైపు వెళ్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ సత్యనారాయణతో పాటు మత్త …
Read More »