కేరళలోని కూడల్ మాణిక్యం దేవాలయంలో ఓ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ దేవాలయంలో జరిగే జాతీయ నాట్య వేడుకల్లో నాట్యం చేసేందుకు ప్రముఖ భరతనాట్య కళాకారిణి మన్సీయకు అనుమతి నిరాకరించారు. తనకు ఎదురైన సంఘటనను.. అనుభవాన్ని సోషల్ మీడియాలోని ఫేస్ బుక్ వేదికగా మన్సీయ తెలుపుతూ తాను హిందువు కాదని..హిందూయేతరులను దేవాలయంలోకి అనుమతించబోమని వారు చెప్పినట్లు వివరించారు. తాను ముస్లీం కుటుంబంలో పుట్టానని..ప్రస్తుతం ఏ మతాన్ని నమ్మడం లేదని …
Read More »తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా వికాస్ రాజ్
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా వికాస్ రాజ్ ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నిన్న సాయంత్రం ఉత్తర్వులను జారీ చేసింది. 1992బ్యాచ్ తెలంగాణ ఐఏఎస్ అధికారి అయిన వికాస్ రాజ్ ప్రస్తుతం సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన రాష్ట్రంలో ఎలాంటి ఇతర పోస్టుల్లో కొనసాగరాదు. అదనపు బాధ్యతలో సైతం ఉండరాదు అని ఎన్నికల …
Read More »భారత్ లో కొత్తగా కరోనా కేసులు నమోదుకాని రాష్ట్రం ఏదో తెలుసా..?
భారత్ లో కొత్తగా కరోనా కేసులు నమోదుకాని రాష్ట్రంగా నాగాలాండ్ నిలిచింది. ఆ స్టేట్లో సోమవారం కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 12 యాక్టివ్ కేసులే ఉన్నాయని స్పష్టం చేసింది, నాగాలాండ్లో రికవరీ రేటు 97.90 శాతం ఉండగా గత శనివారం వరకు 21,481 మందికి వ్యాక్సిన్ వేశారు. మరోవైపు కేరళ, మహారాష్ట్రలో మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తున్నాయి.
Read More »తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజులపాటు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి ఉత్తర మధ్య మహారాష్ట్ర వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నది. దాని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. సోమవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రాష్ట్రంలోని సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, …
Read More »టీడీపీ కోసం సింగం పోలీస్ స్టేషన్ కూడా రెడీ !
గత నాలుగేళ్ల కాలంలో టీడీపీ ప్రభుత్వం చేసిన ఆర్ధిక లావాదేవీలు, కీలక విధానాలు, నిర్ణయాలు, ప్రాజెక్టులు, భూముల లావాదేవీలపై విచారణ, ఇన్సైడర్ ట్రేడింగ్పై దర్యాప్తు కోసం తాజాగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు రాష్ట్ర ప్రభుత్వం ఓ పోలీసు స్టేషన్ హోదాను కల్పించింది. సీఆర్పీసీలోని సెక్షన్2ను అనుసరించి కేసుల నమోదు, దర్యాప్తు వంటి విస్తృత అధికారాలను సైతం ప్రభుత్వం వారికి కట్టబెట్టింది. దీనికి రాష్ట్రం మొత్తం పరిధి …
Read More »ఎవరిది తుగ్లక్ నిర్ణయం.. అమరావతిపై జగన్, చంద్రబాబు నిర్ణయాలు ఎలా ఉన్నాయి.?
గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమైనా ఉందా అంటే శూన్యమే అని చెప్పాలి. ప్రజలను నమ్మించి తప్పుడు హామీలు ఇచ్చి చివరికి గెలిచిన తరువాత చేతులెత్తేశారు. రైతులకు ఆశలు కల్పించి చివరికి ఆత్మహత్యలు చేసుకునే స్థితికి తీసుకొచ్చాడు. ఇదేం న్యాయం అని అడిగిన వారిని పోలీసులతో కొట్టించిన ఘనత చంద్రబాబుది. ఇక రాజధాని అమరావతి విషయానికి వస్తే ఏమీలేని అమరావతిలో రాజధాని నిర్మిస్తానని అసలు తుగ్లక్ …
Read More »తెలంగాణలో మరో ఎన్నికల సమరం
తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సమరం మొదలు కానున్నది. ఈ క్రమంలో జూలై నెలాఖరులోగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సూత్రప్రాయంగా నిర్ణయించింది అని సమాచారం. ఈ మేరకు ఓటర్ల తుదిజాబితా ప్రచురణ తేదీని కూడా నాలుగు రోజులు ముందుకు జరిపింది. 2014లో ఈవీఎంల ద్వారా మున్సిపోల్స్ జరగగా.. ఈసారి బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు జరగనున్నాయి. ఒకే దశలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 129 …
Read More »తెలంగాణలో రేపే “తొలి”విడత స్థానిక సంస్థల సమరం
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రేపు అనగా సోమవారం రాష్ట్రంలోని 197 మండలాల్లోని జెడ్పీటీసీ,ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనున్నది.ఈ క్రమంలో ఆయాస్థానాల్లో ఎన్నికల ప్రచారం నిన్న శనివారం సాయంత్రం 5.00గంటలకుముగిసింది. తొలివిడుతలో మొత్తం 197 జెడ్పీటీసీ, 2,166 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే వీటిలో రెండు జెడ్పీటీసీ, 69 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాల్లో రేపు సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం …
Read More »జగన్ పాదయాత్ర దేశ రాజకీయాల్లో ఒక చరిత్ర.. చంద్రబాబు చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయం..
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పట్ల ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారని ఆపార్టీ నాయకులు మధు, రత్నాకర్లు అన్నారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడూ చేయలేని సాహసం జగన్ చేశారని, వేల కిలోమీటర్లు ప్రజలతో కలిసి నడిచి ప్రజల సమస్యలు తెలుసుకుని వారి మనసులను గెలుచుకున్నారని తెలిపారు. పాదయాత్ర దారి పొడవునా అన్నివర్గాల ప్రజలతో జగన్ మమేకమయ్యారని, జగన్ పాదయాత్ర యజ్ఞంలా చేశారన్నారు. ప్రజల సమస్యలు తెలుకుని వాటి …
Read More »ఏపీ లో మెట్రో దూసుకెల్తుందా?
టీడీపీ అధికారంలోకి రాగానే జరగాల్సిన ప్రాజెక్ట్…విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు ఇప్పటికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు దక్షిణ కొరియాకు సంబంధించిన కొన్ని సంస్థలు ముందుకువచ్చాయి. అమరావతిలో ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. రూ.8 వేల కోట్లు అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు డీపీఆర్ రూపొందించారు.దీనికి సంభందించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో సగం పెట్టుకోవాలని భావించగా,కేంద్రం నుండి ఎటువంటి సహాయం …
Read More »