ఆస్ట్రేలియా వేదికగా వచ్చే అక్టోబర్లో జరిగే ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) జట్టును ప్రకటించింది. అనూహ్య మార్పులకు ఆస్కారం లేకుండా అంచనాలకు తగ్గట్లే 15 మందితో సోమవారం టీమ్ఇండియాను ఎంపిక చేసింది. గాయాల నుంచి కోలుకుంటున్న జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ తిరిగి జట్టులోకి వచ్చారు. విరామం లేని క్రికెట్తో బుమ్రాకు వెన్నెముక గాయం కాగా, హర్షల్ పటేల్ పక్కటెముకల గాయానికి గురయ్యాడు. మెగాటోర్నీ …
Read More »దాయాది మ్యాచ్ కు ముందు టీమిండియాకు శుభవార్త
ఆసియా కప్లో దాయాదితో కీలక మ్యాచ్ ముందు టీమ్ఇండియా శుభవార్త అందుకుంది. హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ కరోనా నుంచి కోలుకున్నాడు. దీంతో శనివారం సాయంత్రమే దుబాయ్కి విమానం ఎక్కేశాడు. ఆదివారం ఉదయం భారత జట్టు బసచేస్తున్న హోటల్కు చేరుకున్నాడు. ఈనెల 23న ద్రవిడ్కు కరోనా నిర్ధారణ అయిందని బీసీసీఐ ప్రకటించింది. దీంతో బోర్డు వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స తీసుకున్నాడు. అయితే తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు నెగెటివ్గా తేలింది. …
Read More »ఫిబ్రవరి12న కివీస్ తో మహిళా టీమిండియా వన్డే సమరం
మరోవారం రోజుల్లో మహిళా జట్టులైన టీమిండియా-కివీస్ జట్ల మధ్య సవరించిన క్రికెట్ షెడ్యూల్ ప్రకారమే పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ ప్రారంభం కానున్నది. అందులో భాగంగా ఈ నెల పన్నెండో తారీఖున మొదటి వన్డే మ్యాచ్ మొదలు కానున్నది. ఈ పర్యటనలో భాగంగా ఏకైక టీ20తో పాటు ఐదు వన్డే మ్యాచులు జరగనున్నాయి. అయితే ముందుగా అనుకున్న దాని ప్రకారం ఈనెల పదకొండో తారీఖున మొదలు కానున్న ఈ సిరీస్ …
Read More »కపిల్ దేవ్ రికార్డుపై రవిచంద్రన్ అశ్విన్ గురి
టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్.. కపిల్ దేవ్ రికార్డుపై గురిపెట్టాడు. 81 టెస్టుల్లో 427 వికెట్లు తీసిన అశ్విన్.. సఫారీలతో టెస్టు సిరీస్ లో సీనియర్ మాజీ ఆటగాడు కపిల్ దేవ్ (434) రికార్డును దాటేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక పేస్ బౌలర్ మహమ్మద్ షమి ఈ టెస్టు సిరీస్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకోవాలని ఆశిస్తున్నాడు. ఇప్పటివరకు 54 టెస్టులు ఆడిన షమి… 195 వికెట్లు పడగొట్టాడు.
Read More »రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్ సర్కార్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్థానంలో భారత జట్టు T20 కెప్టెన్సీ అందుకోవడానికి రోహిత్ శర్మ అర్హుడని మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్సర్కార్ చెప్పారు. ‘కోహ్లి కెప్టెన్గా వైదొలగడం ఊహించిందే. రోహిత్క నాయకత్వం వహించే అవకాశం వచ్చిన ప్రతిసారీ అతడు ఆకట్టుకున్నాడు. అంచనాలను అందుకున్నాడు. 2018లో రోహిత్ సారథ్యంలో భారత జట్టు ఆసియాకప్ గెలిచింది. IPLలో ముంబై ఇండియన్స్ను గొప్పగా ముందుకు నడిపిస్తున్నాడు’ అని దిలీప్ అన్నారు.
Read More »నా దేశాన్ని రక్షించండి -స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్
ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి వెళ్తుండటంతో మరోసారి ఆ దేశం మెల్లగా తాలిబన్ల గుప్పిట్లోకి వెళ్తోంది. దేశంలోని ఒక్కో ప్రాంతాన్ని తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. దీంతో ఆఫ్ఘన్ సైన్యం, తాలిబన్ల మధ్య యుద్ధం సాధారణ ప్రజలను బలి తీసుకుంటోంది. తమ దేశం రావణకాష్టంగా మారుతుండటాన్ని చూసి తట్టుకోలేకపోతున్న స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్.. తమను ఇలా గందరగోళంలో వదిలేయకండి అని ప్రపంచ నేతలను వేడుకుంటున్నాడు. బుధవారం అతడు …
Read More »కండోమ్ వాడి స్వర్ణం గెలిచింది
చదవడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం.. అసలు విషయం ఏంటంటే టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం నెగ్గిన కయాకింగ్ ప్లేయర్ జెస్సికా ఫాక్స్(AUS).. తను ఎదుర్కొన్న ఓ సమస్యకు కండోమ్ సహాయం చేసినట్లు తెలిపింది. రేస్ వల్ల పడవ ముందు భాగం దెబ్బతిందని, దీంతో వేగం తగ్గకూడదని కోచ్ పిండి పదార్థం అంటించినట్లు తెలిపింది. అది కూడా నీటిలో నిలవదని తెలిసి.. తానే కొన భాగానికి కండోమ్ తొడిగినట్లు చెప్పింది. …
Read More »ఒకే వన్డేలో ఐదుగురు అరంగేట్రం
ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు ప్లేయర్స్కు ఒకే వన్డేలో తొలిసారి అవకాశం ఇచ్చింది టీమిండియా. శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో ఆరు మార్పులతో బరిలోకి దిగిన ధావన్ సేన.. అందులో ఐదుగురు కొత్త ప్లేయర్స్ను తీసుకుంది. సంజు శాంసన్తోపాటు నితీష్ రాణా, కే గౌతమ్, చేతన్ సకారియా, రాహుల్ చహర్లు తమ తొలి వన్డే ఆడుతున్నారు. ఇలా ఒకే మ్యాచ్లో ఐదుగురు ప్లేయర్స్ ఇండియా తరఫున అరంగేట్రం …
Read More »పంత్ కల నెరవేరిన వేళ
ఆస్ట్రేలియాపై టీమిండియా సాధించిన చారిత్రక విజయంలో టీమిండియా యంగ్ ప్లేయర్ రిషబ్ పంత్ పాత్ర మరువలేనిది. శుబ్మన్ గిల్ వెనుదిరిగిన తర్వాత పుజారాతో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడిన పంత్ ఒకవైపు వికెట్లు పడుతున్నా 138 బంతుల్లో 89 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టును సగర్వంగా విజయతీరాలకు చేర్చాడు. నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకుంటాడనే అపవాదు మూటగట్టుకున్న పంత్ గబ్బా వేదికగా జరిగిన మ్యాచ్లో మాత్రం ఓపికను ప్రదర్శిస్తూ ఇన్నింగ్స్ ఆడిన …
Read More »రెండో టెస్టులో భారత జట్టు 8 వికెట్ల తేడాతో విజయం
మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆసీస్ నిర్దేశించిన 70 పరుగుల లక్ష్యాన్ని.. 15.5 ఓవర్లలోనే టీమిండియా ఛేదించింది. మయాంక్, పుజారా ఫెయిలైనా.. గిల్(35), రహానే(27) రాణించారు మ్యాచ్ నాలుగు రోజుల్లోనే ముగిసింది. ఈ ఫలితంతో టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. మూడో టెస్టు సిడ్నీ లేదా మెల్ బోర్న్ లోనే JAN 7 నుంచి JAN 11 …
Read More »