వరంగల్ మున్సిపల్ ఎన్నికల వేల బీజేపీకి గట్టి షాక్ తగిలింది..వరంగల్ లో గత 25 ఏండ్లుగా బీజేపీకి వివిద హోదాల్లో సేవ చేసి బీజేపీ ని నిలబెట్టిన సీనియర్ బీజేపీ నాయకుడు గందె నవీన్ గారు,వారి సతీమణి గందె కల్పన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గులాబీ పార్టీలో చేరారు.. ఈ మేరకు వారికి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారు కండువా కప్పి పార్టీలోకి …
Read More »మున్సిపల్ పట్టణాల్లో సోడియం హైపోక్లోరైట్ స్ప్రే చేయాలి: మంత్రి కేటీఆర్
తెలంగాణరాష్ట్రంలో కోవిడ్ వ్యాధి మళ్లీ ప్రబలుతున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మరియు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో యుద్ధ ప్రాతిపదికన సోడియం హైపోక్లోరైట్ ద్రావకం పిచికారీ చేయాలని పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ అధికారులను ఆదేశించారు.మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, కమీషనర్ ఎండ్ డైరెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ సత్యనారాయణ, జీ.హెచ్.ఎం.సీ కమీషనర్ లోకేశ్ కుమార్ లతో మంత్రి ఇవ్వాళ ఫోన్లో మాట్లాడారు. కోవిడ్ తీవ్రత దృష్ట్యా …
Read More »సూర్యాపేటలో ఫిక్లర్ ట్రీట్ మెంట్ ప్లాంట్
సూర్యాపేటలో ఎఫ్.ఎస్. టి.పి(ఫికల్ సర్జ్ ట్రీట్ మెంట్ ప్లాంట్) నిర్మాణం చేపట్టబోతున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. అందుకు అవసరమైన 10 ఎకరాల ప్రభుత్వ భూమిని మున్సిపాలిటికి బదలాయించాలని ఆయన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ని ఆదేశించారు.ఈ మేరకు శుక్రవారం ఉదయం మంత్రి జగదీష్ రెడ్డి ఇమాంపేట లో స్థలాన్ని పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ లతో …
Read More »మాజీ మంత్రి అజ్మీరా చందులాల్(66) మృతి
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత,మాజీ మంత్రి అజ్మీరా చందులాల్(66) మృతి చెందారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. వరంగల్ జిల్లా ములుగు (మం) జగ్గన్నపేటలో జన్మించిన ఆయన తెలంగాణ రాష్ట్ర టూరిజం& సాంస్కృతికశాఖకు తొలిమంత్రిగా సేవలందించారు. దివంగత మాజీ సీఎం,టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ కేబినెట్లోనూ గిరిజనశాఖ మంత్రిగా పనిచేశారు. ములుగు నుంచి 3సార్లు ఎమ్మెల్యేగా, 2సార్లు ఎంపీగా గెలిచారు. కరోనాకు చికిత్స …
Read More »తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు రద్దు
తెలంగాణలో టెన్త్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతో అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రుల్లో భయం పట్టుకుంది. ఇప్పటికే సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో.. రాష్ట్రంలో కూడా పబ్లిక్ పరీక్షల నిర్వహించాలా? వద్దా? అనే విషయంపై ప్రభుత్వం విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించింది. కరోనా సెకండ్ వేవ్ రాష్ట్రంలో …
Read More »ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్కు రిజర్వేషన్లు ఖరారు
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్కు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు రిజర్వేషన్ల జాబితాను ఇవాళ విడుదల చేశారు. 1, 8 డివిజన్లు ఎస్టీ జనరల్, 32వ డివిజన్ ఎస్టీ మహిళకు కేటాయించారు. 22, 42, 59 డివిజన్లను ఎస్సీ మహిళలకు, 40, 43, 52, 60 డివిజన్లను ఎస్సీ జనరల్కు, 28, 29, 30, 33, …
Read More »సీఎం కేసీఆర్ పై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ఎస్సీ,ఎస్టీలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని కేసీఆర్ పై ఆమె మండిపడ్డారు. మాజీ డిప్యూటీ సీఎం,ప్రస్తుత ఎమ్మెల్యే రాజయ్యపై ఆరోపణ వచ్చిన వెంటనే పదవి నుంచి తప్పించారన్నారు. అదే మంత్రి మల్లారెడ్డిపై వందల ఆరోపణలొస్తున్నా.. బర్తరఫ్ చేయట్లేదు ఎందుకని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరంలో లోటస్ పాండ్ లో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి …
Read More »రేషన్ కార్డులపై సీఎం కేసీఆర్ శుభవార్త
కొత్త రేషన్ కార్డుల గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ త్వరలోనే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. 57 ఏండ్ల వయసు ఉన్న వారికి పెన్షన్లు కూడా త్వరలోనే అందజేస్తామని చెప్పారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియాలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. పల్లె ప్రగతితో గ్రామాల్లో అద్భుతమైన ప్రగతి సాధించామన్నారు. హరితహారం, పల్లె ప్రకృతి …
Read More »అచ్చంపేట అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం
అచ్చంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం తరపున అన్నిరకాల సహాయ సహకారాలు అందించటం జరుగుతుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్ఛంపేట మున్సిపాలిటీలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రూ. 5 కోట్ల అంచనా వ్యయంతో అంబేద్కర్ భవనానికి, రూ. 4.5 కోట్ల వ్యయంతో సమీకృత మార్కెట్ సముదాయాన్ని, రూ. 75 లక్షల వ్యయంతో మార్కెట్ యార్డ్ …
Read More »తెలంగాణలో కొత్తగా 3,037 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 3037 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం రాత్రి 8 గంటల వరకు మరో ఎనిమిది మంది బాధితులు మరణించగా, 897 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 3,37,775కు చేరాయి. ఇందులో 1788 మంది బాధితులు వైరస్వల్ల మరణించగా, మరో 3,08,396 మంది డిశ్చార్జీ అయ్యారు. మొత్తం కేసుల్లో 27,861 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇందులో 18,685 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. కొత్తగా …
Read More »