తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ 9 కార్పోరేషన్లు, 110 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు ఖరారైన చైర్ పర్సన్లు (చైర్మన్లు), వైస్ చైర్మన్లు వివరాలిలా ఉన్నాయి. వరంగల్ రూరల్ జిల్లా: నర్సంపేట మున్సిపాలిటీ: చైర్ పర్సన్- గుంటి రజిని (టీఆర్ఎస్), వైస్ చైర్మన్-మునిగాల వెంకట్ రెడ్డి (టీఆర్ఎస్) పరకాల మున్సిపాలిటీ: చైర్ పర్సన్-సోదా …
Read More »వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్ గా అరుణ
నూతనంగా ఏర్పాటైన వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్ గా 6వ వార్డు కౌన్సిలర్ ఆంగోత్ అరుణ, వైస్ చైర్మన్ గా 11వ వార్డు కౌన్సిలర్ కోమాండ్ల ఎలేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సంధర్బంగా ఆర్డీవో మహేందర్ జీ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లతో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారుని, ఎమ్మెల్యే అరూరి రమేష్ గారిని …
Read More »ఫలించిన తారక మంత్రం
సోషల్ మీడియాలో గులాబీ గుబాళించింది. మున్సిపల్ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేయడంతో సామాజిక మాధ్యమంలో ‘జై టీఆర్ఎస్..జై రామన్న.. జై కేసీఆర్..ఫలించిన తారకమంత్రం, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ’ అంటూ పోస్టులు వెల్లువెత్తా యి. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్లలో దూసుకుపోతు న్న కారు బొమ్మలను నెటిజన్లు విరివిగా షేర్ చేశారు. సృజనాత్మకత రంగరంచి కారు ఫొటోలను చక్కర్లు కొట్టించారు. ఎన్నికల ఫలితాలు ప్రారంభమైన ఉదయం నుంచే సోషల్ మీడియాలో నెటిజన్లు తమ …
Read More »అభ్యర్థిని గెలిపించిన కొండముచ్చులు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కొండముచ్చులు ఒక అభ్యర్థి యొక్క గెలుపును నిర్ణయించాయంటే ఎవరైన నమ్ముతారా..?. కానీ ఇదే నిజం. రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ లో గత ఏడదై వరకు కోతుల బెడద తీవ్రంగా ఉండేది. కోతుల గుంపులు ఇళ్లపైకి వచ్చి నాశనం చేసేవి. అంతటితో ఆగకుండా పంటపోలాలను కూడా నాశనం చేస్తుండేవి. స్థానిక ప్రజలపై దాడులకు తెగబడి గాయపరిచేవి. ఈ సమస్యకు పరిష్కారం …
Read More »కొడుకు ఎమ్మెల్యే.. తల్లి కౌన్సిలర్
ఇది నిజం. తనకు జన్మనిచ్చిన తల్లి కౌన్సిలర్ .. తను ఎమ్మెల్యే అయిన సంఘటన తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో చోటు చేసుకుంది. శనివారం విడుదలైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యుడు బాల్క సుమన్ తల్లి బాల్క ముత్తమ్మ గెలుపొందారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎమ్మెల్యే సుమన్ తల్లి పదమూడో వార్డు నుండి టీఆర్ఎస్ …
Read More »57 ఏళ్లు దాటిన అందరికీ వృద్ధాప్య పింఛను
అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సి ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది మార్చి 31వ తేదీ నుంచి 57 ఏళ్లు దాటిన అందరికీ వృద్ధాప్య పింఛను ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు వయోపరిమితి కూడా పెంచుతామని సీఎం చెప్పారు. పీఆర్సీ పెంపుపై కూడా …
Read More »టీజేఎస్ ఖాతాలోఒకే ఒక్క వార్డు
తెలంగాణ రాష్ట్రంలో సరిగ్గా ఏడాది కింద జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన తెలంగాణ జనసమితి పార్టీ తరపున నిలబడిన అభ్యర్థులు ఒక్క చోట కూడా డిపాజిట్ తెచ్చుకోలేకపోయిన కానీ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఒక్క వార్డును దక్కించుకుంది. జిల్లా పరిషత్,పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది ఈ పార్టీ. అయితే తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని ఒకే ఒక్క వార్డును …
Read More »ఒక్క ఓటు కూడా దక్కించుకోని కాంగ్రెస్ అభ్యర్థి..?
తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శనివారం నాడు వెలువడిన సంగతి విదితమే. ఈ ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ 111,కాంగ్రెస్ పార్టీ 03,బీజేపీ 02,ఎంఐఎం02 మున్సిపాలిటీల్లో విజయకేతనం ఎగురవేసింది. మిగిలిన రెండు చోట్ల ఫలితాలు ఇంకా వెలువడలేదు. అయితే ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల మున్సిపాలిటీలో పోటి చేసిన కాంగ్రెస్ అభ్యర్థికి ఒక్క ఓటు కూడా పడలేదు. అఖరికీ ఆ అభ్యర్థికి చెందిన కుటుంబం …
Read More »మంత్రి కేటీఆర్ కు మంత్రి హారీష్ కంగ్రాట్స్
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఇటు కార్పొరేషన్లలోనూ, అటు మున్సిపాలిటీల్లోనూ టీఆర్ఎస్ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి హరీశ్రావు ట్విట్టర్ ద్వారా కేసీఆర్కు, కేటీఆర్కు అభినందనలు తెలియజేశారు. ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టీఆర్ఎస్ దేనని మరోసారి రుజువు చేశారు తెలంగాణ ప్రజలు. మునిసిపల్ ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ ప్రభంజనమే వీసింది. …
Read More »5 మున్సిపాలిటీలను సొంతం చేసుకున్న కాంగ్రెస్
తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు శనివారం వెలువడుతున్న మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్,బీజేపీ పార్టీలు ఎక్కడ కూడా పోటీ ఇవ్వడం లేదు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు అధికార టీఆర్ఎస్ పార్టీ మొత్తం నూట ఇరవై మున్సిపాలిటీల్లో 86చోట్ల విజయకేతనం ఎగురవేసింది. ఐదు చోట్ల కాంగ్రెస్ పార్టీ ,ఒకచోట బీజేపీ ,రెండు చోట్ల స్వతంత్రులు గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన మున్సిపాలిటీల …
Read More »