తెలంగాణలో ‘ఆపరేషన్ కమల్’ మళ్లీ ప్రారంభమైంది. ఈక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలపై బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తున్నాయి. అసంతృప్త నేతలను అక్కున చేర్చుకోవాలని పావులు కదుపుతోంది. వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలను అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ నేతలు కసరత్తు ప్రారంభించారు. తెలంగాణ కాంగ్రెస్ అసమ్మతి నేతలతో బీజేపీ నేతలు టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు నేతలతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఫోన్లో …
Read More »ఢిల్లీకి బండి సంజయ్
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీ కి బయల్దేరనున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఆయన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. దీంతో బండి సంజయ్ తన పాదయాత్రకు శనివారం తాత్కాలిక విరామం ప్రకటించారు. ఢిల్లీలో ఆయన బీజేపీ అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్ షాను కలిసే అవకాశం ఉంది. ఈనెల 21న మునుగోడులో సభ, పాదయాత్ర ముగింపు సభలకు అమిత్ షా, జేపీ నడ్డాను అహ్వానించనున్నట్లు తెలిసింది. మునుగోడు …
Read More »మహారాష్ట్ర తరహాలోనే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం
మహారాష్ట్ర తరహాలోనే తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ పార్టీ నేత సువేందు అధికారి జోస్యం చెప్పారు. మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండేతో కలిసిన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, తెలంగాణలోనూ మహారాష్ట్రలో ఉన్నట్లే బుజ్జగింపు రాజకీయాలున్నాయని, ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సువేందు అన్నారు.
Read More »BJP ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదు..
తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన నేత… దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై హైదరాబాద్ మహానగరంలోని అబిడ్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది. జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ సామూహిక లైంగికదాడి ఘటనలో బాలిక ఫోటోలు, వీడియోలను రఘునందన్ రావు బీజేపీ ఆఫీసులో విడుదల చేశారు. దీంతో ఆయనపై ఐపీసీ సెక్షన్ 228ఏ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.బాలిక వీడియోలను బహిర్గతం చేయటంలో కీలకంగా వ్యవహారించిన …
Read More »తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై నెటిజన్లు మరోసారి సెటైర్లు
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇటీవల చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర, తుక్కుగూడ బహిరంగ సభ విజయవంతం అయినందుకు ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి, తనతో మాట్లాడారని సోషల్ మీడియాలో బండి సంజయ్ పోస్ట్ పెట్టారు. ప్రధానితో అనేక విషయాలు మాట్లాడినట్టు రాసుకొచ్చారు. దీనిపై నెటిజన్లు వ్యంగ్యాస్ర్తాలు విసిరారు. ‘బండికి హిందీ రాదు.. మోదీకి తెలుగు, ఇంగ్లిష్ రాదు.. ఎట్లా మాట్లాడుకున్నరు? కొంచెం ఆ ఆడియో …
Read More »కేంద్రానికి మంత్రి పువ్వాడ వార్నింగ్
వచ్చే ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణను చూస్తారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు.ఈ రోజు శనివారం మీడియాతో మాట్లాడుతూ… ఏప్రిల్ రెండు వరకు కేంద్రంలోని బీజేపీ సర్కారు స్పందన కోసం చూస్తాము… ఎలాంటి స్పందన లేకపోతే ఆ తర్వాత ఉగ్ర రూపాన్ని కేంద్రానికి చూపిస్తామని తెలిపారు. రైతులతో పెట్టుకుంటే పొట్టు అవుతారని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు ఉడుకుతున్నారన్నారు. ఆ ఉడుకు ఏంటో ఉగాది తర్వాత చూస్తారని మంత్రి …
Read More »కక్షపూరిత ప్రతిపక్షాలతో తెలంగాణ సమాజానికి చేటు -మంత్రి హారీష్ రావు ఎడిటోరియల్ కాలమ్
తెలంగాణను పట్టుకున్న ఎన్నో దరిద్రాలను వదిలించ గలుగుతున్న మేము ప్రతిపక్షాల భావ దారిద్ర్యాన్ని మాత్రం వదిలించ లేకపోతున్నాం. కొలువుల కుంభమేళాను ప్రకటిస్తే ఎద్దేవా చేయడమేమిటి? 1952 ముల్కీ పోరాటం నుంచి తెలంగాణ ప్రజల్లో గూడుగట్టుకున్న ఆవేదనను తీర్చింది కేసీఆర్ ప్రభుత్వమే..కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం జీఎస్డీపీ రేటులో, తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్ వినియోగంలో సాధించిన వృద్ధిని చూసి యావత్ దేశమే అబ్బురపడుతోంది. ఈ లెక్కలు మేం చెబుతున్నవి కాదు. …
Read More »లక్షలాది మందితో ఢిల్లీలో ధర్నా చేస్తాం
అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడినం. ప్రజాస్వామ్య బద్ధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ మంత్రి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు సుమారు 5 వేల బైక్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..మరోసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే …
Read More »బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఉగ్ర ముప్పు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఉగ్ర ముప్పు ఉందన్న హెచ్చరికలతో.. హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో నాంపల్లి పార్టీ కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. కొత్త వ్యక్తులు కనిపిస్తే అప్రమత్తం చేయాలని కార్యాలయం సిబ్బందికి పోలీసులు సూచించారు. జనవరి 26 వరకు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి సమయంలో గస్తీని ముమ్మరం చేయాలని ఉన్నతాధికారులు పోలీసు సిబ్బందిని ఆదేశించారు
Read More »తెలంగాణకు అస్సాం సీఎం హిమాంత బిస్వా
తెలంగాణకు బీజేపీ ముఖ్యమంత్రులు ఒకరి తర్వాత ఒకరు క్యూ కడుతున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ సీఎం రాగా.. ఆదివారం అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిస్వా శర్మ వస్తున్నారు. బేగంపేట ఎయిర్పోర్టులో ఆయనకు రాష్ట్ర బీజేపీ నేతలు బండి సంజయ్, లక్ష్మణ్ తదితరులు స్వాగతం పలకనున్నారు. అస్సాం సీఎం బండి సంజయ్తో కలసి రోడ్డు మార్గంలో వరంగల్కు బయలుదేరతారు. మధ్యహాన్నం 12గంలకు ఉపాధ్యాయ, నిరుద్యోగ, ఉద్యోగ సమస్యలపై బండి సంజయ్తో కలసి హిమాంత …
Read More »