తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ‘డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ’ను (డీఈఈటీ) అందుబాటులోకి తెచ్చింది. కృత్రిమ మేధతో నడిచే ఈ వేదిక నిరుద్యోగులు, కంపెనీల మధ్య సంధానకర్తగా పనిచేస్తున్నది. నిరుద్యోగులు తమ విద్యార్హతలు, ఇతర వివరాలతో డీఈఈటీలో నమోదు చేసుకుంటారు. కంపెనీలు ఆయా వివరాలను పరిశీలించి అర్హులను ఎంపిక చేసుకుంటాయి. అలాగే నిరుద్యోగులు, ఉద్యోగులు ఈ వేదిక ద్వారా ఆయా కంపెనీల్లోని ఖాళీల వివరాలను …
Read More »మిషన్ భగీరథ దేశానికి ఆదర్శం
తెలంగాణలో ఇంటింటికీ శుద్ధిచేసిన తాగునీటి సరఫరా లక్ష్యం నెరవేరింది. రాష్ర్టానికి ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందించిన ప్రతిష్ఠాత్మక మిషన్భగీరథ పథకం మరో ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ప్రజలు తాగడానికి శుద్ధి చేసిన నీటిని అందిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణను దేశంలోనే రెండోస్థానంలో నిలిపింది. మిషన్ భగీరథ కారణంగా తెలంగాణలో 98.7 శాతం కుటుంబాలకు స్వచ్ఛమైన, శుద్ధిచేసిన మంచినీరు అందుతున్నది. 99.2 శాతంతో బీహార్ మనకంటే ముందున్నది. తెలంగాణలో పట్టణప్రాంతాల్లో 99.4 శాతం, గ్రామాల్లో …
Read More »అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యం
అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని జుక్కల్ ఎమ్మె ల్యే హన్మంత్షిండే అన్నారు. బుధవారం నిజాంసాగర్ ప్రాజెక్టులో రొయ్య పిల్లలను విడుదల చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభు త్వం మత్స్యకారులను ఆదుకునేందుకు నెల రోజు ల కిందటే చేప పిల్లలను ఉచితం గా విడుదల చేసిందని గుర్తు చేశారు. ప్రస్తుతం 24.09 లక్షల రొయ్య పిల్లలను విడుదల చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. …
Read More »ఫియట్ రాక చాలా సంతోషకరం
ప్రపంచంలో అన్ని రంగాల్లో పురోగమిస్తున్న నగరాల్లో హైదరాబాద్ గడిచిన ఐదారేండ్లుగా ముందు వరుసలో నిలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ స్నేహపూర్వక పారిశ్రామిక విధానం వల్ల అనేక కంపెనీలు, సంస్థలు ఇక్కడికి వస్తున్నాయి. ఫియట్ సైతం ముందుకు రావడం సంతోషం. ఫియట్కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాం. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఐటీ, ఆటోమొబైల్ సహా అన్ని రంగాలకు తెలంగాణ సమ ప్రాధాన్యం ఇస్తున్నది అని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి …
Read More »రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త
రైతుబంధు పథకానికి కొత్త రైతుల నుంచి వ్యవసాయశాఖ దరఖాస్తులు స్వీకరిస్తున్నది. బ్యాంకుఖాతా నంబర్లు, పేర్లు, ఆధార్నంబర్లు తప్పుగా ఉన్నవారు కూడా సరైన వివరాలను అందించాలని సూచించింది. ఈ నెల 20 వరకు వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో)కి వివరాలు అందించాలని సూచించింది. ఈ నెల పది వరకు ధరణిలో నమోదైన రైతుల వివరాలను సీసీఎల్ఏ నుంచి వ్యవసాయశాఖ సేకరించింది. ఈ నెల 27 నుంచి రైతుబంధు పంపిణీ చేయనున్నట్టు సీఎం …
Read More »మెట్రో ప్రయాణం అద్భుతాల సమాహారం
హైదరాబాద్ మహానగరంలో ప్రయాణమంటేనే నరకం. రోడ్డెక్కితే చాలు..ఇంటికి ఎప్పుడు చేరుతామన్న గ్యారంటీ లేదు. అడుగడుగునా ట్రాఫిక్ జామ్లు. సిగ్నళ్లు. అనుకున్న సమయానికి గమ్యస్థానానికి చేరలేం. ట్రాఫిక్లో ఇబ్బందిపడుతూ ప్రయాణిస్తూ చాలామంది అలసటకు లోనవుతున్నారు. ఒత్తిడికి గురై అనారోగ్యం బారిన పడుతున్నారు. నగరరోడ్లపై నిత్యం నరకయాతన అనుభవిస్తున్న హైదరాబాదీలు మెట్రో రాకతో జర్నీని ఎంజాయ్ చేస్తున్నారు. చింతలను దూరం చేసి..వింతలను పరిచయం చేస్తున్న మెట్రోలో మియాపూర్-ఎల్బీనగర్ వరకు ప్రయాణిస్తూ కొందరిని పలకరించగా కొత్త …
Read More »యువతకు చేయూత
ఒకరి కింద పని చేయకుండా.. తానే ఓ వ్యవస్థను నడుపుతూ నలుగురికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ఉన్న వారిని ఎస్సీ కార్పొరేషన్ వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నది. ఇందులోభాగంగా 40 మందికి మొబైల్ టిఫిన్ సెంటర్లను మంజూరు చేసింది. బుధవారం బేగంపేటలోని హరితప్లాజాలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి ఈ టిఫిన్ సెంటర్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు. పైలెట్ ప్రాజెక్ట్గా.. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలవుతున్న …
Read More »వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా చేస్కోవాలి
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం నుంచి స్లాట్ బుకింగ్ మొదలుకాగా, సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయి. రిజిస్ట్రేషన్కు స్లాట్ బుకింగ్ తప్పనిసరి. దీనికి తగ్గట్టు ప్రభుత్వం ఆన్లైన్లో సులభంగా స్లాట్ బుక్ చేసుకొనేలా ఏర్పాట్లు చేసింది. బుకింగ్ కోసం ఇచ్చే వివరాల నమోదులో ఆస్తి యజమానులే కీలకపాత్ర పోషించనున్నారు. స్లాట్ బుకింగ్ వెబ్సైట్: www.registration. telangana.gov.in రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ముందుగా వెబ్సైట్లో ఫోన్ నంబర్తో లాగిన్ …
Read More »ఆన్లైన్ ఆడిట్లో తెలంగాణ అద్భుత ప్రతిభ
ఆన్లైన్ ఆడిట్లో తెలంగాణ అద్భుత ప్రతిభ చూపుతున్నదని కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్ఐ)-స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ (ఎస్ఐజీ) అవార్డు జ్యూరీ ప్రశంసించింది. వివిధ రాష్ర్టా ల ఆడిట్ సంచాలకులు, పంచాయతీ అధికారులతో సీఎస్ఐ-ఎస్ఐజీ అవార్డు జ్యూరీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సమావేశంలో తెలంగాణ ఆడి ట్ సంచాలకులు మార్తినేని వెంకటేశ్వరరావు పవ ర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ …
Read More »నేడు హస్తినకు సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఇవాళ ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పలు సమస్యలపై చర్చించేందుకు ఆయన కేంద్రమంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉన్నది. కేంద్ర జలవనరులశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను శుక్రవారం, కేంద్ర పౌరవిమానయాన, హౌసింగ్శాఖల మంత్రి హర్దీప్సింగ్ పురిని శనివారం కలువనున్నట్టు సమాచారం. ఈ ఇద్దరు మంత్రులతో భేటీకి సంబంధించిన షెడ్యూల్ ఖరారైనట్టు తెలిసింది. వీరితోపాటు మరి కొంతమంది కేంద్ర మంత్రులతోనూ సీఎం కేసీఆర్ భేటీ …
Read More »