టీటీడీ కొత్త పాలకమండలిని ఏపీ ప్రభుత్వం నియమించింది. 25 మందితో టీటీడీ పాలకమండలిని ప్రభుత్వం నియమించింది. ఈ పాలకమండలిలో ఏపీ నుంచి నలుగురు తెలంగాణ నుంచి నలుగురు, తమిళనాడు నుంచి ముగ్గురు, కర్ణాటక నుంచి ఇద్దరు, మహారాష్ట్ర నుంచి ఒకరు స్థానం దక్కించుకున్నారు. ఎక్స్అఫిషియో సభ్యులుగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి కొనసాగుతున్నారు. పాలకమండలిలో పారిశ్రామిక వేత్త మైహోం రామేశ్వరరావు, హేటిరో పార్దసారధి రెడ్డి, మురంశెట్టి రాములు, …
Read More »సిరిసిల్ల నేతన్నల మాట.. రాత మార్చిన నేత కేటీఆర్
తెలంగాణ ఏర్పడక ముందు సిరిసిల్ల అంటే ఉరిశాల అనే నానుడితో వ్యవహరించిన దుర్భర స్థితి మనందరికీ తెలిసిందే. నాడు నేతన్నల ఆకలి చావులతో జాతీయ స్థాయిలో పతాక శీర్షికలకెక్కిన సిరిసిల్ల నేడు సిరిశాలగా మారి కోటి బతుకమ్మ చీరెలతో తెలంగాణ ఆడబిడ్డల ముఖాలలో సంబురాన్ని చూసుకొని మురుస్తోంది. చేతినిండా ముద్దతో కడుపు నింపుకుంటోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అతి తక్కువ కాలంలోనే సిరిసిల్ల ప్రాంతంలో నేతన్నల ఆత్మహత్యలు ఆగిపోయినవి. ఈ …
Read More »కారు ఎక్కనున్న ఎల్ రమణ
తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు గులాబీ గూటికి చేరేందుకు రంగం సిద్ధమైంది. రమణకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నట్టు మరో ప్రచారం. ఎల్.రమణతో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు,జగిత్యాల MLA డాక్టర్ సంజయ్ సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. పద్మశాలి సామాజికవర్గానికి చెందిన ఎల్.రమణ ఉమ్మడి ఏపీలో చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత నుంచి టీటీడీపీ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. ఎల్.రమణతో పాటు పలువురు టీడీపీ నాయకులు టీఆర్ఎస్లో చేరనున్నట్టు సమాచారం …
Read More »బీజేపీలోకి టీటీడీపీ సీనియర్ మాజీ నేత
తెలంగాణ తెలుగు దేశం పార్టీకి చెందిన సీనియర్ మాజీ నేత ,మాజీ మంత్రి మోత్క్లుపల్లి నరసింహులు ఆ పార్టీ కార్యకలపాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి విదితమే. అయితే తాజాగా మోత్కుపల్లి బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా ఈ రోజు మంగళవారం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్దా సమక్షంలో దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు దీనికోసం బీజేపీ అధ్యక్షుడు …
Read More »భక్తులకు టీటీడీ శుభవార్త
తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ శుభవార్తను తెలిపింది. ప్రస్తుతం నెలకొన్న భక్తుల తాకిడి దృష్ట్యా వైకుంఠ ద్వార మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వైకుంఠ ద్వారాన్ని దాదాపు పది రోజుల వరకు తెరిచే ఉంచాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఆగమ సలహా మండలి కూడా అనుమతివ్వడంతో త్వరలోనే దీన్ని టీటీడీ అమలు చేయనున్నది. ప్రస్తుతం వైకుంఠ ఏకాదశి,ద్వాదశి పర్వదినం రోజుల్లోనే భక్తులను …
Read More »టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి..!
టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తెలంగాణలో గద్వాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి గతంలో టీడీపీ తరపున బరిలోకి దిగి గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు గత కొంతకాలంగా హైదరాబాద్ లో నిమ్స్ ఆసుపత్రిలో గుండె సంబంధిత అనారోగ్య కారణాలతో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ రోజు బుధవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు …
Read More »టీడీపీలో కలకలం.కూటమికి గుడ్బై..!
తెలంగాణలో ప్రతిపక్షాలు ఏర్పాటుచేసుకున్న మహాకూటమి చీలిక దిశగా సాగుతోంది. ఎన్నికల గడువు సమీపిస్తున్నా… సీట్ల సర్దుబాటుపై ఇప్పటి వరకు ఓ అధికారిక ప్రకటన రాలేదు.అయితే, టీడీపీకి 14 సీట్లు కేటాయిస్తారనే ప్రచారం మాత్రం సాగుతోంది. కానీ క్లారిటీ రాకపోవడంతో…ఆ పార్టీ నేతలు తీవ్రంగా మథనపడుతున్నారు. పార్టీ ఆవిర్భావ సిద్ధాంతాన్ని తుంగలో తొక్కి మరీ పొత్తుపెట్టుకుంటే..కాంగ్రెస్ తమకు అవమానాన్నే మిగిల్చిందని భావిస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు …
Read More »కాంగ్రెస్ ప్రకటనకు టీడీపీ నేతలు సిగ్గుతో…!
ఓవైపు తమ పార్టీ ఆవిర్భావ సిద్ధాంతాన్ని తుంగలో తొక్కి మరోవైపు…రాష్ట్ర విభజన చేపట్టిన కాంగ్రెస్పై నిన్నమొన్నటి వరకూ విరుచుకుపడ్డ చంద్రబాబు అదే కాంగ్రెస్ పార్టీతో ఇప్పుడు పొత్తుకు పెట్టుకోవడానికి ఎక్కడలేని ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ బద్ధశత్రువైన కాంగ్రెస్తో చంద్రబాబు చేతులు కలపడం పట్లరెండు పార్టీల్లోనూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనీయర్ నేత వీరప్ప మొయిలీ చేసిన వ్యాఖ్యలు టీడీపీ నేతలు సిగ్గుతో తలదించుకునేలా …
Read More »బాబును చూసి టీడీపీ నేతలే భయపడరు.!
తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చిత్రంగా ఉన్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఎద్దేవా చేశారు. చంద్రబాబును కేసీఆర్ భయపడుతున్నారని పేర్కొనడం చిత్రంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. బాబును చూసి ఆయన పార్టీ నాయకులే భయపడరని కేసీఆర్ భయపడుతారా అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబును హైదరాబాద్ నుంచి తాము వెళ్లగొట్టలేదని, జరిగిన పరిణామాలే ఆయన్ను వెళ్ళగొట్టాయని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ను తానే అభివృద్ధి చేసిన అంటున్న …
Read More »ఏపీ సర్కారు సంచలన నిర్ణయం..!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మరో మరో ప్రైవేటు విద్యుత్ కొనుగోలుకు సిద్ధపడింది. అందులో భాగంగా సింహపురి విద్యుత్ సంస్థ నుంచి ఏకంగా 400 మెగావాట్ల కరెంటును కొనేందుకు బాబు నేతృత్వంలోని టీడీపీ సర్కారు అనుమతించింది. అయితే ఈ సంస్థ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం లోక్ సభ నియోజకవర్గ టీడీపీ మాజీ ఎంపీ …
Read More »