ప్రజలను సైక్లింగ్ వైపు మళ్లించి అటు పర్యావరణపరంగా, ఇటు ఆరోగ్యపరంగా మేలు కలిగేలా చైతన్యం తెచ్చేందుకు కేంద్రం ప్రభుత్వం నిర్వహించిన ‘సైకిల్ ఫర్ చేంజ్ చాలెంజ్’లో వరంగల్ నగరం విజేతగా నిలిచింది. దేశవ్యాప్తంగా 11నగరాలకు ఈ టైటిల్ దక్కగా వాటిలో తెలంగాణ నుంచి వరంగల్ ఒక్కటే నిలిచి గెలిచింది. అన్నివర్గాలవారిని ‘సైక్లింగ్’లో ప్రోత్సహించేందుకు విశేషంగా కృషి చేసి కేంద్రం నుంచి అవార్డుతోపాటు కోటి రూపాయల నజరానా అందుకునేలా చేసిన ‘జీడబ్ల్యూఎంసీ’పై …
Read More »యునెస్కో గుర్తింపుపై మంత్రి పువ్వాడ హర్షం
తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడం (వరల్డ్ హెరిటేజ్ సైట్)గా యునెస్కో గుర్తింపు దక్కడం పట్ల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. యునెస్కో గుర్తింపు కోసం సహకరించిన కేంద్రానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. భారత్కు మద్దతు తెలిపిన యునెస్కో సభ్య దేశాలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప ఆలయానికి గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేసిన సీఎం కేసీఆర్ …
Read More »సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపిన వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు
వరంగల్ అర్బన్ జిల్లాను హన్మకొండ జిల్లాగా వరంగల్ రూరల్ జిల్లాను వరంగల్ జిల్లాగా పేరును సవరించారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, ఆరూరి రమేశ్, శంకర్ నాయక్, టి రాజయ్య, చల్లా ధర్మారెడ్డి సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాల అభివృద్ధికి మరింత సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
Read More »సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించిన మేయర్ గుండు సుధారాణి.
పరిపాలన సౌలభ్యం కొరకు వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల స్థానంలో హన్మకొండ, వరంగల్ జిల్లాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో నగర మేయర్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, కార్పొరేటర్లు ముఖ్యమంత్రి నిలువెత్తు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి సి.ఎం.కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాల ఏర్పాటుకు సహకరించిన రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు కె టి ఆర్, రాష్ట్ర పంచాయతీ రాజ్, …
Read More »గెజిటెడ్ అసోసియేషన్ నేత జగన్మోహన్ రావు ను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ ఎన్నమనేని జగన్మోహన్ రావు తల్లి పద్మావతి ఐటీవల మృతి చెందారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, రైతు రుణ విమోచన చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి శుక్రవారం జగన్మోహన్ రావును హన్మకొండలోని ఆయన నివాసంలో పరామర్శించారు. పద్మావతి చిత్రపటానికి పూలతో నివాళులు అర్పించారు.
Read More »హన్మకొండలోని కాకాజీ కాలనీలో GLS డెంటల్ ఆస్పత్రి ప్రారంభోత్సవం
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధిశాఖమంత్రి వర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ చేతుల మీదుగా హన్మకొండలోని కాకాజీ కాలనీలో GLS డెంటల్ ఆస్పత్రి ప్రారంభోత్సవం..హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ లో సామాన్య ప్రజలకు మెరుగైన దంతవైద్యం అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో GLS డెంటల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని Dr. శేషుకుమార్, Dr. రోహిణి దంపతులు స్థాపించారు.. హన్మకొండ …
Read More »సీఎం కేసీఆర్ కు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు
సోమవారం వరంగల్ నగర పర్యటన సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా సమగ్ర అభివృద్ధికి, సంక్షేమానికి వరాలను ప్రకటించిన సీఎం కేసీఆర్కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ జిల్లాను విద్యా, వైద్య, ఐటీ, వ్యవసా, పారిశ్రామిక రంగాల్లో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న సీఎంకు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజాభిప్రాయం మేరకు వరంగల్ …
Read More »ఈ నెల 21న వరంగల్ కు సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్లో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానకు ఈనెల 21న శంకుస్థాపన చేయనున్నారు.అందులో భాగంగా సీఎం పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరంగల్ అర్బన్ జిల్లా సమీకృత కలెక్టర్ భవనాన్ని ప్రారంభిస్తారు. తర్వాత జిల్లాలోని గ్రామాల్లో అకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు. వరంగల్ నుంచే జిల్లా కలెక్టర్లతో సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. హాస్పిటల్ నిర్మాణం కోసం కేటాయించిన స్థలాలను మంత్రి …
Read More »ప్రజారోగ్యమే ప్రభుత్వ ద్యేయం- మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
తెలంగాణలో హైద్రాబాద్ తరువాత అత్యంత ప్రాధాన్యత గల ఉమ్మడి వరంగల్ జిల్లా ఆరోగ్య సదుపాయాల కల్పనలో ముందంజలో ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటిసరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. అందులో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, మహబూబాబాద్, ములుగులోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షల కేంద్రాలను ( డయాగ్నస్టిక్ సెంటర్లు) ఈనెల 9వ తేదిన ప్రారంభించబడతాయని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు పరీక్ష చేసి మందులు …
Read More »తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 3,043 కరోనా కేసులు వెలుగుచూశాయి. మరో 21 మంది మరణించారు. ఫలితంగా కరోనా కేసుల సంఖ్య 5,56,320కు పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా ధాటికి 3,146 మంది మరణించారు. కొత్తగా 4,693 మంది కోలుకోగా, రికవరీల సంఖ్య 5,13,968కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 39,206యాక్టివ్ కేసులున్నాయి. తాజా కేసుల్లో GHMCలో 424 నమోదయ్యాయి.
Read More »