ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇంటి వాచ్మెన్ కీలక విషయాలు వెల్లడించాడు. ఉదయం 7 గంటల సమయంలో జిమ్కు వెళ్లేందుకు మంత్రి సిద్ధమయ్యాడు. అంతలోనే గుండెలో నొప్పి వస్తోందంటూ సోఫాలోనే కూర్చున్నారు. వెంటనే కుటుంబ సభ్యులను, గన్మెన్లను అప్రమత్తం చేశాం. వారు ఛాతీపై బలంగా ఒత్తినప్పటికీ ఆయనలో చలనం లేదు. దీంతో హుటాహుటిన జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించినట్లు వాచ్మెన్ చెప్పాడు.గౌతమ్ రెడ్డిని ఉదయం 7:45 గంటలకు ఆస్పత్రికి …
Read More »ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కన్నుమూత
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (49) కన్నుమూశారు. ఇవాళ ఉదయం గుండెపోటు రావడంతో హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయన.. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాగా ఆస్పత్రికి వచ్చేటప్పటికే గౌతమ్ పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని తెలుస్తోంది. దీంతో అత్యవసర చికిత్స అందించినప్పటికీ ప్రాణం నిలబడలేదు. ఆయన మరణించారన్న విషయాన్ని గౌతమ్ భార్యకు అపోలో వైద్యులు సమాచారం ఇచ్చారు. కాగా.. వారం రోజుల పాటు …
Read More »రాజ్యసభ సీటుపై ఆలీ క్లారిటీ
ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీ నేత,ప్రముఖ నటుడు అలీ కుటుంబ సమేతంగా ని సీఎం ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. సీఎంతో జరిగిన భేటీ వివరాలను అలీ వెల్లడించారు. ‘మర్యాదపూర్వకంగా మాత్రమే సీఎంను కలిశా. గత సాధారణ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేశారు. సమయం లేక నేనే వద్దని చెప్పా. ఏమీ ఆశించకుండా పార్టీలోకి వచ్చాను. పదవి ఇస్తేనే పార్టీలో సేవ చేస్తానని …
Read More »యాదాద్రి ఆలయ నిర్మాణం అద్బుతం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని అద్బుతంగా నిర్మాణం చేస్తున్నారని నగిరి ఎమ్మెల్యే రోజా కొనియాడారు. శనివారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి రోజా దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఈ కాలంలో ఏవరికి దక్కని అవకాశం కేసీఆర్కు దక్కిందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషించే విధంగా ఆలయం నిర్మాణం జరిగిందని తెలిపారు. ఇక్కడికి తీసుకువచ్చిన రాయి గుంటూరు నుంచి తీసుకు వచ్చారని, ఎప్పటికీ తెలుగువారు అన్నదముళ్ళు, …
Read More »Apకి ప్రత్యేక హోదాపై కీలక అడుగు
ఏపీ ప్రత్యేక హోదా అంశంపై చర్చించేందుకు ఈనెల 17న ఢిల్లీకి రావాలని కేంద్ర హోంశాఖ నుంచి ఏపీ సీఎస్కు సమాచారం అందింది. హోదా ఇవ్వాలని వైసీపీ ఎంపీలు వరుసగా డిమాండ్ చేస్తుండటంతో పాటు ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్ కూడా ఇదే విషయాన్ని కేంద్ర పెద్దల ఎదుట ప్రస్తావించారు. దీంతో ముగిసిపోయింది అనుకున్న ఈ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది.
Read More »నిలకడగా వైసీపీ ఎంపీ ఆరోగ్యం
నిన్న పార్లమెంటులో అస్వస్థతకు గురైన ఏపీకి చెందిన అధికార పార్టీ వైసీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రాజ్యసభ ముగిసిన అనంతరం షుగర్ లెవల్స్ తగ్గడంతో ఆయన కళ్లు తిరిగి పడిపోయారు. వెంటనే సహచర ఎంపీలు రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు.
Read More »మెగాస్టార్ పై మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు
ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంలో చిరంజీవి సీఎం జగన్తో భేటీ అవడంపై ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు. అది పర్సనల్ మీటింగ్ అని, అసోసియేషన్తో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏ ఒక్కరో మాట్లాడితే సమస్య పరిష్కారం కాదని, టికెట్ల విషయంలో ఇండస్ట్రీ అంతా ఏకతాటిపైకి రావాలని చెప్పారు. రెండు ప్రభుత్వాలు ఇండస్ట్రీని ప్రోత్సహిస్తున్నాయని, సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.
Read More »చంద్రబాబుకు విజయసాయి రెడ్డి సలహా
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు మాజీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నానా ప్రయత్నాలు చేస్తున్నారని అధికార వైసీపీకి చెందిన సీనియర్ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. ‘ మాజీ సీఎం నారా చంద్రబాబ నాయుడు మీరు తప్పుల మీద తప్పులు చేస్తున్నావు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఈ రెండున్నరేళ్లలో డబ్బు వెదజల్లావు. ఎక్కడ …
Read More »సీఎం జగన్ కు ముద్రగడ పద్మనాభం కృతజ్ఞతలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కృతజ్ఞతలు తెలిపారు. కాపు ఉద్యమానికి సంబంధించిన పలు కేసులు ఎత్తివేయడంపై సంతోషం వ్యక్తం చేసిన ముద్రగడ.. సీఎం జగన్కు శుక్రవారం లేఖ రాశారు. ఈ మేరకు సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. చేయని నేరానికి తమను ముద్దాయిలను చేస్తూ.. గతంలో పెట్టిన కేసులు చాలా అన్యాయమని, ఇప్పుడు వాటిని ఎత్తివేయడం సంతోషం కల్గించిందని లేఖలో పేర్కొన్నారు ముద్రగడ.కాపుజాతి …
Read More »‘ఆంధ్రప్రదేశ్ రాజధాని’ ని తేల్చేసిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై రాజ్యసభలో ప్రస్తావన వచ్చింది. ‘ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది..? రాజధానిని నిర్ణయించే అధికారం ఎవరిది..?’ అన్నదానిపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావ్ కోరారు. ఇందుకు స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ప్రస్తుతానికి అమరావతే ఏపీ రాజధాని అని పేర్కొన్నారు. అంతేకాదు.. ‘రాజధానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే. మా దగ్గరున్న సమాచారం ప్రకారం ఏపీకి రాజధాని అమరావతే’ అని కూడా కేంద్రం తరఫున మంత్రి …
Read More »