Home / MOVIES / తెలుగు రాష్ట్రాల్లో పీక్‌కు వెళ్ళిన బిగ్‌బాస్ పీవ‌ర్‌.. ఇంత‌కీ విన్న‌ర్ ఎవ‌రు..?

తెలుగు రాష్ట్రాల్లో పీక్‌కు వెళ్ళిన బిగ్‌బాస్ పీవ‌ర్‌.. ఇంత‌కీ విన్న‌ర్ ఎవ‌రు..?

తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్న‌ బిగ్‌బాస్ షోలో ఎన్టీఆర్ హోస్టింగ్‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. ఇక చివ‌రి అంకానికి వ‌చ్చిన బిగ్‌బాస్ షో విన్నర్ ఎవరన్న ఉత్కంఠ పెరిగిపోతోంది. దీనిపై బిగ్‌బాస్ హౌస్‌లోనూ పెద్ద చర్చ.. అనేక సర్‌ప్రైజ్‌లకు చోటుండే బిగ్‌బాస్‌లో 68 రోజుల్లో ట్విస్టుల మీద ట్విస్టులు. ఫైనల్‌కు చేరిన ఐదుగురు కొత్త లుక్‌తో అందంగా కనిపించారు. విజేత ఎవరనేది బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టంట్స్ కూడా ఫినాలే కోసం హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఎప్పుడు రాత్రి తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యే బిగ్‌బాస్ షో ఆదివారం ఆరు గంటలకే మొదలుకానుంది.

ఈ శనివారం ఎన్టీఆర్ రావడంలేదు. దీంతో ఆదివారం కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి.. తారక్ వన్‌ మ్యాన్ షోగా దాదాపు 4 గంటలపాటు బిగ్‌బాస్ షో ఆకట్టుకోనుంది. మరో ట్విస్ట్ ఏంటంటే.. ఫైనలిస్టులు ఎంతమంది.. ఐదుగురు కదా.. ఆరుగురు అని బాంబు పేల్చింది దీక్షాపంత్. దీంతో ఫైనలిస్టులు ఎంతమంది అనే అనుమానం మొదలైంది. ఇక బిగ్‌బాస్ ఫైనలిస్టులో శివబాలాజీకి విపరీతమైన క్రేజ్ వుందని చెప్పింది మధుప్రియ. బాలాజీ తర్వాత రెండో స్థానంలో ఆదర్శ్.. నవదీప్, అర్చన, హరితేజలు ఉన్నారు. అయితే శివకు ఆదర్శ్ గట్టిపోటీ ఇస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి వరకు ఓటింగ్‌కు సమయం ఉండడంతో వీళ్లిద్దరిలో బిగ్‌బాస్ విజేత ఎవరనేది తీవ్ర ఉత్కంఠగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat