ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వైఎస్సార్ కుటుంబంలోకి చేరాలన్న పిలుపునకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటికి వైఎస్సార్ కుటుంబంలోకి 38 లక్షల మంది చేరారు. రాష్ట్ర ప్రజల నుంచి వస్తున్న స్పందన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.
వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం సాగుతున్న తీరును సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వస్తున్న స్పందనపై సంతృప్తి వ్యక్తం చేసిన జగన్.. ఈ కార్యక్రమన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల మీద కూడా దృష్టి సాదించాలన్నారు.
ఏపీలోని 13 జిల్లాల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి సమావేశాలు నిర్వహించాలని.. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల్ని గమనించి.. అందుకు తగ్గట్లుగా స్పందించాలన్నారు.
అయితే దివంగత నేత వైఎస్ హయాంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావిస్తున్నారని.. ఆరోగ్య శ్రీ.. ఫీజులు తిరిగి చెల్లించే పథకాలతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారన్నారు. దింతో చంద్రబాబు టీడీపీ కార్యకర్తుల ,లీడర్లు కూడ వైఎస్సార్ కుటుంబంలో చేరుతున్నారని షాక్ అయ్యినట్లు సమచారం.