తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన పోలీస్ ఎన్కౌంటర్ లో గ్యాంగ్ స్టర్ నయీం మరణించిన సంగతి విదితమే .అప్పట్లో నయీం తో పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలకు లింక్ ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి .ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన బడా బడా నేతలతో సంబంధాలు ఉన్నాయి .
త్వరలోనే వారికి అరెస్ట్ వారెంట్లు కూడా జారి అవుతాయి అని కూడా వార్తలు చక్కర్లు వచ్చాయి .ఆ తర్వాత ఆ కేసు కోర్టులో ఉన్న విషయం కూడా తెలిసిందే .అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించిన కదలిక వచ్చింది .ఈ క్రమంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు జారిచేశారు .ఈ క్రమంలో నోటీసులను నయీం భార్యకు పంపించారు.
ఈ నోటిసులలో నయీం అక్రమంగా పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టారని అవన్నీ ఎలా వచ్చాయో తమకు వివరించాని పేర్కొంటూ నోటీసుల్లో ఉన్నట్లు సమాచారం .అయితే రాష్ట్రంలో యాదాద్రి జిల్లాలోని భువనగిరిలోగల నయీం సొంత ఇంటికి ఈ నోటీసులు అంటించారు.అంతే కాకుండా నయీం భార్యకు, తల్లికి, సోదరీమణులకు నోటీసులు పంపించారు. మొత్తం 26చోట్ల నయీం ఆస్తులు గుర్తించి, వాటిల్లో బినామీలు నయీం భార్య, తల్లి, సోదరీమణులు ఉన్నట్లు అనుమానించి ఐటీ అధికారులు వారికి నోటీసులు పంపారు అని సమాచారం .