గురజాల నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు, మాజీ మంత్రి కాసు కృష్ఱారెడ్డి కుమారుడు వైసీపీ యువ నేత కాసు మహేష్ రెడ్డి దూకుడు ముందు టీడీపీ నేతలు
తట్టుకోలేకపోతున్నారు..అను నిత్యం ప్రజల్లో ఉంటూ..వారికి అన్ని విధాల అండగా నిలబడుతూ, వారి సమస్యల పరిష్కారానికి శ్రమిస్తున్న కాసు మహేష్ రెడ్డికి గురజాలలో అపూర్వ ఆదరణ దక్కుతుంది. ఒకవైపు క్యాడర్ను బలోపేతం చేస్తూ, జగన్ ప్రకటించిన నవరత్నాల్లాంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు.
మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే అవినీతిని, దోపిడీని ఎప్పటికప్పుడు ప్రజల ముందు బట్టబయలు చేస్తున్నారు. తాజాగా ఇంటింటికీ వైసీపీ, వైఎస్సార్ కార్యక్రమాన్ని గురజాలలో ప్రారంభించిన కాసు మహేష్ రెడ్డి అధికార టీడీపీ ఎమ్మెల్యే యరపతనేని శ్రీనివాసరావు అవినీతి, దోపిడీపై నిప్పులు చెరిగారు.ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి జగన్కు అవకాశం ఇవ్వండి, వైసీపీకి అధికారం ఇవ్వండి గురజాలను అభివృద్ధి చేస్తామని కోరామని చెప్పారు..టీడీపీ ఎమ్మెల్యే యరపతనేని కుటుంబ అభివృద్ధి తప్ప ఈ మూడున్నరేళ్లుగా గురజాలలో అభివృద్ధి ఏ మాత్రం జరుగలేదని మండిపడ్డారు. ల్యాండ్ సెటిల్ మెంట్లు, లిక్కర్ బిజినెస్, వ్యాపారులను బెదిరించి కోట్లు కోట్లు వసూలు చేసుకోవడం, ప్రజల కోసం చేపట్టే ప్రతి పనిలో 10 % కమీషన్లు నొక్కేస్తూ ప్రజా ధనాన్ని యరపతినేని అడ్డగోలుగా దోచుకుంటున్నాడని కాసు మహేష్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు..ఎన్నికలకు ముందు అసలు డబ్బులే లేని యరపతినేని ఈ రోజు మూడున్నరేళ్లలోనే రూ.
600 కోట్లకు అధిపతి ఎలా అయ్యాడో ప్రజలు నిలదీయాలని, వచ్చే ఎన్నికల్లో జగన్ని గెలిపించి గురజాలను అభివృద్ధి చేసుకుందామని కాసు మహేష్ రెడ్డి పిలుపు ఇచ్చారు. గురజాలలో కాసు మహేష్ రెడ్డి దూకుడు టీడీపీ గుండెల్లో గుబులు పుట్టిస్తుందనడంలో సందేహం లేదు..వచ్చే ఎన్నికల్లో కాసు మహేష్ రెడ్డి తిరుగులేని మెజార్టీతో గెలవడం
ఖాయమని గురజాల తెలుగుతమ్ముళ్లు కూడా అంతర్గత సంభాషణల్లోచెప్పుకుంటున్నారంట..కాసు ఫ్యామిలీకి ఉన్న మంచి పేరు, మహేష్ రెడ్డి వ్యక్తిత్వం వైసీపీకి ప్లస్ పాయింట్గా మారాయని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గురజాలలో వైసీపీ జెండా ఎగరబోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.