తెలుగు బుల్లితెర హాట్ ష్రోగ్రాం జబర్ధస్త్ షో ద్వారా నవ్వులు పూయిస్తున్న పార్టిసిపెంట్స్ సినిమాల్లో కామెడియన్స్గా అవకాశాలు అందిపుచ్చు కుంటున్నారు. ఈ షో ద్వారా యాంకర్స్ గా అడుగు పెట్టిన అనసూయ, రష్మీ లు మంచి క్రేజ్ తెచ్చుకొన్నారు. ఇక దసరా కానుకగా జబర్దస్త్ టీం ఒక సర్ఫ్రెజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ షోలో గొడవ చోటు చేసుకుంది. సుధీర్, రచ్చ రవి, గెటప్ శ్రీను, చంటి, ఆర్.పి. రాకేశ్లు షోలో కొట్టుకొన్నారు.. అదీ మెగా బ్రదర్స్ అయిన చిరంజీవి గొప్ప అని కొందరు.. పవన్ కల్యాణ్ గొప్పని అని కొందరు స్టేజ్ పై కొట్టుకొన్నారు.. ఈ వివాదాన్ని సద్దుమణిగేలా చేయాలని చూసిన నాగబాబుని సుధీర్ ఏదో అనడం తో నాగబాబు స్టేజ్ నుంచి వెళ్లిపోయాడు..
అంతేకాదు రచ్చ రవి.. రోజా ని హర్ట్ చేసినట్లుగా కూడా ప్రొమో తిరుగుతోంది. మీరు చెప్పండి.. ఆ పార్టీ ఈ పార్టీ అంటూ ఏదొక పార్టీ మారడం కాదు.. ఒకే పార్టీలో ఉండండి అన్న మాటలకు జడ్జ్ రోజా కంట తడి పెట్టినట్లుగా ప్రొమోలో ఉంది. ఈ వివాదం చూసిన యాంకర్ అనసూయ కళ్ళు తిరిగి పడిపోయింది. కాగా ఇదంతా నిజంగా జరిగిందా.. లేక షోలో భాగంగా ఇదంతా చోటు చేసుకొన్నదా.. తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.. ఈ ప్రోమో చూసిన కొంత మంది ప్రేక్షకులు.. ఏప్రిల్ 1 న ఫూల్స్ చెయ్యడానికి సుధీర్ తిట్టిన ప్రోమో ఎలా రిలీజ్ చేసి బుల్లి తెరప్రేక్షకులను వీపీలను చేశారో.. అదేవిధంగా ఈ గొడవలో కూడా ఏదొక కారణం ఉండి ఉంటుందని ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.