తెలంగాణ రాష్ట్ర టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజక వర్గం కోడంగల్ నియోజక వర్గం .గత మూడున్నర ఏండ్లుగా నియోజక వర్గానికి ..నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో ఉండకుండా సమస్యల నిలయంగా మారుస్తున్నాడు .నిత్యం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో కూర్చొని టీఆర్ఎస్ సర్కారు పై ముఖ్యమంత్రి కేసీఆర్ పై అవాకులు చవాకులు పేలుస్తున్నాడు .
ఈ నేపథ్యంలో నియోజక వర్గానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు గందె మోహన్ నియోజక వర్గం వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడమే కాకుండా వాటి శాశ్వత పరిష్కారం కోసం సంబంధిత అధికారులను సంప్రదించి శరవేగంగా పరిష్కారం అయ్యే విధంగా పని చేస్తూ స్థానిక ప్రజల మన్నలను పొందుతున్నారు .ఇటీవల నియోజక వర్గంలో కోడంగల్ మండలంలో చిట్టపల్లి గ్రామంలో పర్యటించారు .దీనిలో భాగంగా గత కొన్ని ఏండ్లుగా గ్రామా ప్రజలు డ్రైనేజీ వ్యవస్థ లేక ఎదుర్కొంటున్న సమస్యలను ..ఎమ్మెల్యే అయి ఉండి రేవంత్ రెడ్డి తమను గాలికి వదిలేస్తోన్న తీరును యువ నేత గందె మోహన్ కు వివరించారు .దీంతో చలించిన మోహన్ సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి పరిష్కారం అయ్యే విధంగా చొరవ తీసుకున్నారు .దీంతో రెస్పాండ్ అయిన అధికారక యంత్రాంగం డ్రైనేజీ కి సంబంధించిన పనులను ప్రారంభించారు .దీనికి సంబంధించిన మోరీలు ,ఇసుక తదితర వాటిని తరలించి పనులు ప్రారంభించారు .ఎమ్మెల్యే పట్టించుకోకపోయిన తమ గోడును విని సమస్యలు పరిష్కారమై విధంగా చొరవ చూపిన యువనేత మోహన్ పై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తోన్నారు .