Home / INTERNATIONAL / ఎంపీ కవిత పై విషప్రచారం చేస్తున్న ఏన్నారైకి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన Trs Australia President నాగేందర్ రెడ్డి

ఎంపీ కవిత పై విషప్రచారం చేస్తున్న ఏన్నారైకి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన Trs Australia President నాగేందర్ రెడ్డి

తరతరాలుగా తెలంగాణ లో వివక్షకు గురవుతున్న మహిళలను మరియు మన సంస్కృతి, సంప్రదాయాలను జాగృతం చేసేందుకు తెలంగాణ జాగృతి అనే సంస్థను స్థాపించి సమైక్యరాష్ట్రంలో గుర్తింపు కోల్పోతున్న బతుకమ్మ పండుగ తాను భుజానేసుకుని ప్రపంచం గుర్తించి గౌరవించేలా విశిష్టతను ఎలుగెత్తి చాటిన ఘనత ఆమెకే దక్కింది. విదేశాల్లో సైతం బతుకమ్మ పండుగను ఎన్ఆర్ఐలు ఘనంగా నిర్వహిస్తున్నారు అంటే దీనికి వెనక కవితక్క కృషి ఎనలేనిది. ఒకమాటలో చెప్పాలంటే మురుగున పడిన బతుకమ్మ పండుగకు పునర్ జీవం పోసింది కవితక్కే.

2009లో ప్రత్యేక రాష్ట్రానికై తన తండ్రి కేసీఆర్ గారు ఆమరణ దీక్షకు పూనుకుంటే కూతురిగా తండ్రి పక్క ఉండాల్సిన సమయంలో తన తండ్రి ఆశయ సాధన కోసం ఉద్యమకారులకు మద్దతుగా నిలబడడమే కాకుండ ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపుతున్న అప్పటి పాలకుల దుర్మార్గాన్ని ఎండగడుతూ అండగా నిలబడింది.
ఒకవైపు ఉద్యమం చేస్తూ ఇంకోవైపు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల విశిష్టతను ఖండాంతరాలకు వ్యాప్తి చెందేలా కృషి చేసారు కవితక్క.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత పార్లమెంట్ సభ్యురాలిగా గెలిచి తెలంగాణ ప్రగతికై చట్టసభలో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటాలపై గట్టిగా పోరాడుతున్నారు, సీనియర్ పార్లమెంట్ సభ్యులు సైతం కవిత గారు సమస్యలపై వివిధ అంశాలపై చేస్తున్న ప్రసంగాలకు ముగ్ధులైన గొప్ప వక్తగా అభివర్ణించడం విశేషం.

తెలంగాణలోనే కాదు ప్రపంచంలో ఉన్న తెలంగాణ ప్రజలకు ఉద్యమ స్ఫూర్తిని నింపేందుకు సంస్కృతి సంప్రదాయాలను విస్తరించేందుకు ఉద్యమం లో భాగంగా అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాలకు వెళ్లిన కవిత కు లభించిన అశేష ఆదరణ చూరగొన్న కవిత తన వంతు బాధ్యతగా విదేశాలలో ఉన్న తెలంగాణ ప్రజలకు,
భవిష్యత్ తరాలు మరచిపోకుండా ఉండేలా బతుకమ్మను అంగరంగ వైభవంగా జరిపించాలనే తపనతో సంకల్పించుకున్నారు.
విదేశాలలో చదువుకున్న కవితక్క కు అక్కడా మన వాళ్ళు సంప్రదాయాలపై ఎంత గౌరవం ఉంటుందో స్వయంగా చుసిన తను ప్రపంచమంతా బతుకమ్మను ఘనంగా జరిపించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఉద్యమంలో భాగంగా జాగృతి ద్వారా బతుకమ్మ ను తెలంగాణ మొత్తం నిర్వహించి మహిళలను ఉద్యమం లో భాగస్వాములుగా చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కవిత అక్క పాత్రను జాగృతి వేదికను మరువలేనిది.

సమైక్య పాలనకు చరమ గీతం పాడుతూ, నాలుగు కోట్ల ప్రజల ఆశయాన్ని నెరవేరుస్తూ, వందలాదిమంది బిడ్డల ఆత్మ త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ ఇప్పుడు. తెలంగాణ వచ్సిన తరువాత తన పాత్ర పై ఆలోచిస్తున్న సమయంలో “ఇంట గెలిచి రచ్చ గెలవాల”న్న సంకల్పం తో స్వరాష్ట్రం లో ఇప్పుడు బతుకమ్మ జీవం పోసుకున్న తరువాత విదేశాలలో జీవం పోయడానికి కంకణం కట్టుకున్నారు కవిత . ప్రపంచ పటం లో తెలంగాణ కీర్తి ప్రఖ్యాతులు మన సంస్కృతీ సాంప్రదాయాలతో చాటి చెప్పడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్న కవిత మొదట తెలంగాణ ప్రజలు ఎక్కువ గ నివసించే అమెరికా వెళ్లి అక్కడ ప్రపంచమంతా గర్వించేలా ఘనంగా బతుకమ్మ స్ని నిర్వహించారు ,అదే విధంగా లండన్ లో అశేష జనాదరణ చూరగొన్న తాను ఇక ప్రతి సంవత్సరం ఇలాగే ఘనంగా నిర్వహించడానికి “జాగృతి ” సంస్థ ని అమెరికా , యూరప్ దేశాలలో ఏర్పరచి అక్కడికి కార్యవర్గానికి మన సంస్కృతి సంప్రదాయాలను కొనసాగించేలా దిశా నిర్దేశం చేశారు కవిత. 2015 మరియు 2016 లో తెలంగాణ లో జాగృతి అద్వర్యం లో ప్రతి ఊరు ,వాడ ,పల్లె ,నగరం మన బతుకమ్మ పండుగ ను చరిత్ర లో లేని విధంగా ఘనంగా జరుపుకున్న తరువాత మిగతా దేశాలలో ఘనంగా జరపడానికి 2016లో అమెరికా, బ్రిటన్ , ఆస్ట్రేలియా ,సింగపూర్, దుబాయి, మలేషియా, న్యూజిలాండ్, డెన్మార్క్ దేశాలకు తిరిగి అక్కడ అంతమవుతున్న తెలంగాణ సంస్కృతి కి జీవం పోసారు. ఈ రోజు ప్రపంచం అంత బతుకమ్మ ను సగౌరవంగా జరపడానికి కారణం కవిత ఇది జగం ఎరిగిన సత్యం .
ఈ విజయాన్ని తట్టుకోలేని ప్రతిపక్ష నాయకులూ ముఖ్యంగా NRI కాంగ్రెస్ నాయకులూ కవిత అక్క పై సంస్కార హీనంగా ,సభ్యత మరచి మాట్లాడే
సంస్కరాహీనులను వారి విజ్ఞతకే వదిలేస్తూ ….

నాగేందర్ రెడ్డి కాసర్ల
ప్రెసిడెంట్
తెరాస ఆస్ట్రేలియా

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat