టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ ఈ రోజు ఆసీస్ తో జరుగుతున్న నాల్గో వన్డే మ్యాచ్ లో వార్నర్ వికెట్ తీసి వన్డేల్లో వంద వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చేరాడు. ఈ రోజు బెంగుళూరు లో చిన్నస్వామిలో జరుగుతున్న నాలుగో వన్డేలో 35.5వ బంతికి ఓపెనర్ ఫించ్ను ఔట్ చేసి 99వ వికెట్ పడగొట్టాడు.
37.1వ బంతికే ఆసీస్ సారథి స్టీవ్స్మిత్ (3; 5 బంతుల్లో)ను పెవిలియన్ పంపి వంద వికెట్లు తీశాడు. బంతిని ఫ్లిక్ చేయబోయిన స్మిత్ మిడ్వికెట్ ప్రాంతంలో కోహ్లీకి చిక్కాడు. 46 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 287/3తో ఉంది. హ్యాండ్స్కాంబ్ (33; 23 బంతుల్లో), ట్రావిస్ హెడ్ (20; 34 బంతుల్లో) క్రీజులో ఉన్నారు.