Home / SLIDER / ఆ జిల్లాలో టీడీపీ దుకాణం బంద్ ..

ఆ జిల్లాలో టీడీపీ దుకాణం బంద్ ..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తోలి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున మొత్తం పదిహేను మంది ఎమ్మెల్యేలు గెలుపొందిన సంగతి విదితమే .ఆ తర్వాత అధికారంలో ఉన్న టీఆర్ ఎస్ పార్టీ సర్కారు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గత మూడున్నర ఏండ్లుగా పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోన్న సంగతి విదితమే .కేసీఆర్ సర్కారు చేస్తోన్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులైన తెలంగాణ టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు కారెక్కారు .

ఈ నేపథ్యంలో గతంలో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ హయాంలో మంత్రిగా పని చేసిన సీనియర్ మాజీ మంత్రి ,నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ మహిళా నాయకురాలు ఉమా మాధవరెడ్డి టీడీపీ కి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తోన్నాయి.. ఈ క్రమంలో జిల్లాలో భువనగిరి లో మూడు దశాబ్దాలుగా టీడీపీ పార్టీ బలోపేతం కోసం ఆమె పని చేశారు .తాను పార్టీ మారడం కోసమే మాజీ మంత్రి…తెలుగుదేశంపార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు అయిన ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మెజారిటీ కార్యకర్తలు ,నేతలు పార్టీ మారితేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అని సూచించారు అని సమాచారం .

దీంతో ఆమె రాజకీయ భవిష్యతు కోసం గత మూడున్నర ఏండ్లుగా టీఆర్ ఎస్ సర్కారు చేస్తోన్న సంక్షేమ అభివృద్ధి పనులకు ఆకర్షితులు కావడమే కాకుండా గత కొన్ని దశాబ్దాలుగా ఉన్న ప్లోరైడ్ సమస్యను పరిష్కరించడానికి పలు ప్రాజెక్టులతో పాటుగా ఉదయం సముద్రం లాంటి వాటిని కూడా శరవేగంగా పూర్తిచేయడం ..తెలంగాణ లో టీడీపీకి రాజకీయ భవిష్యత్తు లేకపోవడంతో ఆమె పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు జిల్లా పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి .అన్ని కుదిరితే త్వరలోనే ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో తన అనుచరవర్గంతో సహా గులాబీ గూటికి చేరే అవకాశాలు ఉన్నట్లు జిల్లా లో అందరు చర్చించుకుంటున్నారు .ఇదే విషయాన్నీ ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు చెందిన ఆస్థాన మీడియా టీటీడీపీ కి మరో సీనియర్ మంత్రి గుడ్ బై చెప్పే ఆలోచనలో అని వార్తలు రాయడం కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూర్చుస్తుంది ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat