ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరో రికార్డును సాధించాడు .గత మూడున్నర ఏండ్లుగా ఏమి రికార్డ్లను సృష్టించాడని ఇప్పుడు సరికొత్తగా ఏమి సాధించారు అని ఆలోచిస్తున్నారా ..?.అసలు విషయానికి వస్తే రాష్ట్రంలోని విజయవాడ నగరంలో లక్ష ఎన్టీఆర్ గృహాలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
మొత్తం జిల్లాల్లో ఎన్టీఆర్ గృహాలను స్థానిక మంత్రులు ప్రారంభించారు. ఒకే రోజు లక్ష గృహాలను ప్రారంభించడమే కాకుండా ఎన్టీఆర్ గృహాల లబ్దిదారులకు నూతన వస్త్రాలను అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ “నగరంలో ఒకే రోజు లక్ష గృహాల ప్రవేశం చరిత్రలో నిలిచిపోతుందని ఆయన తెలిపారు.
ఇళ్ల నిర్మాణంలో అవినీతిని సహించేది లేదన్నారు. క్రిస్మస్, సంక్రాంతి సందర్భంగా మరికొన్ని గృహ ప్రవేశాలు చేస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు.అయితే గత మూడున్నర ఏండ్లుగా ఎన్నో పథకాలకు ఇలాగే శిలా పలకాలు వేయడమే కానీ ఒక్క పని కూడా పూర్తీ కావడంలేదు అని ..సరిగ్గా రెండు యేండ్ల కిందట దసరా రోజున రాజధాని నగరం అమరావతి నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేసిన ఇంతవరకు ఒక్క ఇటుక రాయి వేయలేదు ..ఇప్పుడు లక్ష ఇండ్లు అని ప్రజల చెవిలో పూలు పెడుతున్నాడు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి .