ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా రాజ్ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. గాంధీజీ ఆదర్శాలు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందకి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని మోదీ ట్వీట్ చేశారు. ఇక… ఇవాళ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా కావడంతో ఆయనకు నివాళులర్పించారు మోదీ. రైతులు, జవాన్లను ప్రభావితం చేసిన లాల్ బహదూర్ శాస్త్రిని అందరం ఆదర్శంగా తీసుకోవాలని మోదీ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ తర్వాత రాజ్ఘాట్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సందర్శించారు. మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అనంతరం రాజ్ఘాట్ వద్ద వాళ్లు కూర్చొని కొన్ని నిమిషాల పాటు మౌనం పాటించారు.అంతకు ముందు రాజ్ఘాట్ను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ సందర్శించి మహాత్మాగాంధీకి నివాళులర్పించారు.