Home / SLIDER / టీ కాంగ్రెస్ నేతలకు ఎంపీ గుత్తా కౌంటర్

టీ కాంగ్రెస్ నేతలకు ఎంపీ గుత్తా కౌంటర్

కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార్కపై నల్లగొండ  ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు. జీవో 39, 40పై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క ఆరోపణలు సిగ్గు చేటని ఆయన మండిపడ్డారు. రైతు సమన్వయ సమితుల ఏర్పాటుపై ఆందోళన చేయడం తగదన్నారు. పంచాయతీరాజ్ చట్టం పరిధిలో వారికి ఈ జీవోలతో ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేశారు ఎంపీ. ఉనికి కోసమే ప్రతిపక్ష నేతలు ఆందోళనలు చేస్తున్నారని పేర్కొన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మతిభ్రమించి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కోపోద్రిక్తులయ్యారు. అధికారంలోకి వస్తమని కోమటిరెడ్డి పగటి కలలు కంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌లో ఆధిప్యత పోరు ఎక్కువైంది.. వాళ్లలో వాళ్లే పోట్లాడుకుంటున్నారని ఎంపీ గుత్తా పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat