తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ మహా నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నేడు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది. దీంతో కుమ్యులో నింబస్ మేఘాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఐఎండీ డైరెక్టర్ వైకే రెడ్డి తెలిపారు.
నిన్న కుమ్యులో నింబస్ మేఘాల ప్రభావంతో రాష్ట్రంలో హైదరాబాద్లోనే అధిక వర్షపాతం నమోదైనట్లు ఆయన వెల్లడించారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఇవాళ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో నగరవాసులతో పాటు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైకే రెడ్డి సూచించారు.